
Wedding gift | ఇంటర్నెట్ డెస్క్: వివాహం అనేది జీవితంలో అద్భుత ఘట్టం. అందుకే ఈ వేడుకను కొందరు ఉన్నంతలో సింపుల్గా జరుపుకొంటే.. మరికొందరు ఆడంబరాలకు పోతుంటారు. పెళ్లికి వచ్చేవారికి రిటర్న్ గిఫ్ట్గా ఖరీదైన బహుమతులూ ఇస్తుంటారు. కానీ, మహారాష్ర్టలోని ఓ కుటుంబం మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని ప్రజలందరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను అందించి సమాజంపై ఉన్న తమ ఉదారతను చాటుకుంది. వీరి ఆలోచనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహారాష్ట్రలోకి నాందేడ్ జిల్లా బహదూర్పూర గ్రామానికి చెందిన సిద్దేశ్వర్, మంజూషకు ఇటీవల వివాహం జరిగింది. తన కుమారుడి వివాహం సందర్భంగా కుటుంబం పెళ్లికి వచ్చిన గ్రామస్థులందరికీ రిటర్న్ గిఫ్ట్గా రూ.1 లక్ష విలువైన యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లను అందించింది. పెళ్లి మండపంలోనే 3500 మందికి బీమా పత్రాలను అందించారు. దీంతో పెళ్లికి వచ్చిన వారు సమాజంపై కుటుంబానికి ఉన్న నిబద్ధతను కొనియాడారు. అనుకోని ప్రమాదాల సమయంలో ఈ ఇన్సూరెన్స్ గ్రామస్తులకు ఎంతో ఉపయోగపడుతుందని పేఠ్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్భాటాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
