translateexpand_more

Namasthe Telangana News

Latest updates from Telugu Digital news sources.

Namasthe Telangana31 May, 12:25 pm
పూటకో పార్టీ మారుతవ్ .. నువ్వా నా గురించి మాట్లాడుతున్నవ్

Harish Rao | తాను పార్టీ మారే వ్యక్తి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి చిల్లరాయన.. ఇప్పటికీ చాలా సార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు అసలు ఓ క్రెడిబులిటీ ఉందా..? నాలుగు పార్టీలు మారినోడు.. రోజుకు నాలుగు అబద్దాలు మాట్లాడేటోడు. 400 అబద్దపు హామీలిచ్చి అడ్డదారిలో అధికారమెక్కినోడు. పంద్రాగస్టుకల్లా రుణమాఫీ చేస్తమని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు. ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్‌ రెడ్డి మాటలకు ఓ విలువ ఉన్నదా..? అని అన్నారు. అబద్దాలు చెప్పుడు.. అడ్డమైన మాటలు మాట్లాడుడు. అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు. అబద్దాల గారడీతో కాలం వెళ్లదీసుడు తప్ప. నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా రేవంత్‌ రెడ్డి అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా..? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని 65 రోజులైనా రైతు బంధు ఎగబెట్టింది నువ్వు కాదా…అసలు నాలుగు పార్టీలు మారింది నువ్వు.. పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రేవంత్‌ రెడ్డి నా గురించి మాట్లాడుతడా..? నేనిప్పటికీ వందసార్లు చెప్పిన నా జీవితమంతా కేసీఆర్.. నేను బతికున్నంత కాలం బీఆర్‌ఎస్‌ అని వందసార్లు.. ఇంకా వందసార్లు చెప్తా. అసలు నీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కుందా..?

Namasthe Telangana31 May, 10:22 am
ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు

Ponnam Prabhakar | పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. బస్ డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోందని, ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు.ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి

Namasthe Telangana31 May, 04:21 pm
పెద్దపల్లిలో గాలివాన బీభత్సం.. రోడ్డుపై కూలిన చెట్లు, ఎగిరిపోయిన రేకులు

Rain : పెద్దపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు తోడు వర్షం కురవడంతో పలుచోట్లు రహదారిపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్మారం మండల కేంద్రంలో ఇంటి రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ధర్మారం మండల కేంద్రంలో గాలివాన జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఓదెల మండలంలో గాలివాన అందుకోవడం.. పలు గ్రామాల్లో కరెంటు నిలిచిపోయింది. గాలివాన కారణంగా ఎర్రగుంటపల్లి గ్రామం వద్ద కరీంనగర్ రాయపట్నం రహదారిపై మర్రి చెట్టు కూలిపోయింది. దాంతో, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్మారం మండల కేంద్రంలో గాలి తీవ్రతకు బీఆర్‌ఎస్ నాయకుడు గాజుల రాజు ఇంటి రేకులు లేచి కింద పడ్డాయి. సమీపంలోని రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడగా.. తీగలు తెగిపడ్డాయి. దాంతో, ధర్మారంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకుంది. గాలి తీవ్రతకు కిందపడిన ఇంటిపై కప్పు రేకులు

Namasthe Telangana01 Jun, 02:50 pm
మా ఊర్లో స్కూల్ ఉంది కానీ అంగన్వాడీ టీచర్ లేదు సార్.. సీఎం రేవంత్ రెడ్డితో మహిళ

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది. సార్ మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, ఆయమ్మ లేదు. మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా సార్‌.. మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని సదరు మహిళ సీఎంతో తన బాధలు చెప్పుకున్నది. అంగన్‌వాడీలో స్థానికులకే అవకాశం ఇవ్వాలి సార్‌ అంటూ విజ్ఞప్తి చేసింది. మహిళ చెప్పిన సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రి సీతక్క, అధికారులకు సూచించారు. కాంగ్రెస్ సర్కార్‌ పాలనలో అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో సదరు మహిళ మాటలతో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు లేవని రేవంత్ రెడ్డికి తన బాధలు చెప్పుకున్న మహిళ pic.twitter.com/0MhCVZZQrh Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ని అడ్డగించిన వ్యక్తి..! Maganuru | జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు Rashmika | జపాన్ ట్రిప్‌తో మళ్లీ వార్తల్లో రష్మిక మందన్న.. ఫోటోల్లో కనిపించిన ‘స్పెషల్ పర్సన్’పై చర్చ!

Namasthe Telangana01 Jun, 02:26 pm
బూర్గంపహాడ్ లో వంటావార్పుతో వీఓఏల నిర స న

బూర్గంపహాడ్, జూన్ 01 : త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ వీఓఏలు వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. నిర‌వ‌ధిక సమ్మెలో భాగంగా సోమవారం వారి శిబిరంలోనే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఐకెపి వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సెర్ప్ ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా వీఓఏల న్యాయమైన కోరికలు తీర్చాలని బూర్గంపహాడ్ ఎంపీడీఓ కార్యాలయం ముందు వీఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరింది. ఈ సంద‌ర్భంగా వీఓఏలు మాట్లాడుతూ.. గాలి దుమారాలతో కూడిన వర్షాలు లెక్క చేయక, మే నెల వడగాల్పుల తీవ్రతకు తట్టుకోలేక కొంతమంది వీఓఏలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకునే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. కష్టానికి తగ్గ ఫలితం లేదని, వీఓఏల‌కు రూ.26,000 వేల గౌరవ వేతనం, పీఆర్సీ అమలు చేయాలని, వీఓఏల‌ను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా రూ.20 లక్షలు చెల్లించాలని, ఆరోగ్య బీమా రూ.10 లక్షలు కల్పించాలని, అర్హులైన వీఓఏల‌కు సిసిలుగా ప్రమోషన్ కల్పించాలన్నారు. వీఓఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ట్యాబ్‌లు ఇచ్చి నెట్ సౌకర్యం కల్పించాలని, ఆన్‌లైన్‌ రిపోర్ట్ లు చేయమని, గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని, వీఓఏ జీతాలు వీఓఏల అకౌంట్లోనే వేయాలని, అభయ హస్తం డబ్బులు పొదుపు సంఘాలకు ఇవ్వాలని, అర్హులైన వీఓఏల‌ను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని, జీఓ నంబర్ 58ని సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఓఏల మండల అధ్యక్షురాలు నిర్మల, కోశాధికారి సావిత్రి, పద్మ, శ్రీ లక్ష్మీ, సుబ్బమ్మ, లలిత, గౌతమి, రాంచందర్, మండలంలోని 62 మంది వీఓఏలు పాల్గొన్నారు.

Namasthe Telangana01 Jun, 11:56 am
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

తాండూర్, జూన్ 1 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రం ఐబీలో జాతీయ రహదారిపై సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్టీ పర్సస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులని పర్మినెంట్ చేయాలన్నారు. బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలి. నెలకు రూ. 26 వేలు ఇవ్వాలని, సంవత్సరానికి ఒక్క కార్మికునికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని, బెల్లం, నూనె, సంవత్సరానికి రెండు జతల చెప్పులు, సబ్బులు ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్పుల శంకర్, బొల్లం రాజేశం, మొగిలి, హక్కు, అక్చర్, నందిపేట వెంకటి, ఇప్ప రామయ్య, ఇప్ప దుర్గు, ఇప్ప ఎల్లమ్మ, ఇప్ప సుజాత, కాజీపేట కమల, రామగిరి రాధా, కార్మికులు పాల్గొన్నారు.

Namasthe Telangana01 Jun, 06:11 am
ఆసిఫాబాద్ జిల్లాలో సీఐటీయూ నాయకుల ముందస్తు అరెస్ట్

కుమురం భీం ఆసిఫాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేసేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల పేరుతో సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రటరీ వెలిశాల క్రిష్ణమాచారిని ఆయన స్వగ్రామమైన చింతకుంటలో ఉదయం 5 గంటల సమయంలో పోలీసులు ఇంటికెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా భావిస్తున్నామని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రంగాల కార్మికులకు ఇచ్చిన హామీల అమలు, కనీస వేతనాల పెంపు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లను వినిపించేందుకు మాత్రమే వెళ్లాలనుకున్న కార్మిక నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడం, నిరసనలు తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కులని, ఆ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు.

Namasthe Telangana31 May, 02:15 pm
భారత సైనికుడిగా ఎంపికైన చిన్న మాసన్ పల్లి యువకుడు

రాయపోల్, మే 31 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని చిన్న మాసాన్‌పల్లి(Chinna Masanpally) గ్రామానికి చెందిన శ్రీశాంత్ ముదిరాజ్ భారత సైన్యానికి ఎంపికయ్యాడు. గజ్వేల్‌లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీశాంత్ కృషి, పట్టుదలతో ఆర్మీలో చేరాలనే తన కలను నిజం చేసుకున్నాడు. రాయపోల్ మండలంలో ఇప్పటివరకు మొత్తం 9 మంది యువకులు భారత సైన్యానికి ఎంపికవ్వగా.. వారిలో 8 మంది ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందడం విశేషం. భారత సైన్యంలో సోల్జర్‌గా శ్రీశాంత్ ముదిరాజ్ ఎంపికవ్వడం పట్ల ఆజాద్ డిఫెన్స్ అకాడమీ కావడం పట్ల నిర్వాహకులు చైర్మన్ నీల చంద్రం (రిటైర్డ్ ఆర్మీ ) సంతోషం వ్యక్తం చేశారు. తమ అకాడమీలో గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశ సేవకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాంత్ సైన్యంలో ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, చిన్న మాసన్‌పల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశాంత్ ముదిరాజ్ సాధించిన విజయం పట్ల గ్రామ పెద్దలు, యువకులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు. సైన్యంలో చేరనున్న శ్రీకాంత్ మరెంతో మంది యువతకు ఆదర్శంగా నిలవాలని వారంతా ఆకాంక్షించారు.

Namasthe Telangana30 May, 03:37 pm
వరికొయ్యలను తగబెడుతూ.. నిప్పంటుకొని రైతు మృతి

Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట – భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. వానాకాలం పంట సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం పొలంలో ఎల్లయ్య వరి కొయ్యలను తగబెడుతుండగా పొగ, మంటలు చుట్టుముట్టడంతో ఆయనకు ఊపిరాడలేదు. శ్వాస తీసుకోవడం కష్టమవ్వడంతో కిందపడిపోయిన ఎల్లయ్యకు మంటలంటుకున్నాయి. మంటల కారణంగా తీవ్రగాయాలు కావడంతో ఎల్లయ్య మృతి చెందాడు.

Namasthe Telangana01 Jun, 01:04 pm
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పెండ్యాల విజయభాస్కర్

జూలూరుపాడు, జూన్ 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పెండ్యాల విజయభాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని సోమవారం అందుకున్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ధారా రామనరసింహం ప్రోత్సాహంతో మహాసభలో సభ్యత్వం పొందిన విజయభాస్కర్ సంఘంలో తనదైన ముద్ర వేశారు. ఆర్యవైశ్య యువజన సంఘం మండల స్థాయి బాధ్యత నుండి అంచలంచెలుగా ఎదుగుతూ జిల్లా యువజన సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, తదనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విశేష సేవలందించారు. ఆ తర్వాత మండల ఆర్యవైశ్య మహాసభలో పలు కీలక పదవులు నిర్వహించారు. తనకున్న అపార అనుభవంతో జిల్లా ఆర్యవైశ్య మహాసభలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు. సుజాతనగర్ నియోజకవర్గ కన్వీనర్‌గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాల విభజన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభకు తొలి కన్వీనర్‌గా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించి.. ప్రస్తుతం జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ కార్యవర్గంలో సభ్యుడిగా పనిచేశారు. జిల్లాలో గత నాలుగు పర్యాయాలుగా జరిగిన అధ్యక్షుల ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, పలువురి మన్ననలను పొందారు.

Namasthe Telangana31 May, 06:50 am
రాత్రి భార్యాభర్తలు కలిసి వెళ్తుంటే ఆగిన బైక్.. పొదల్లోంచి దుండగులు వచ్చి

Wife Husband | సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య అనుమానాస్పద స్థితిలో హత్యగావించబడగా.. ఆమె భర్త పరిస్థితి విషమం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్ కుమార్, మీనా దేవి(35) దంపతులు శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం IDA బొల్లారం మీదుగా బైక్‌పై వెళ్తుండగా.. IDA బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద సడెన్‌గా బైక్ ఆగిపోయింది. అదే సమయంలో దుండగులు పొదల్లోంచి వచ్చి భార్య మీనా దేవి(35)ని పొదల్లోకి లాక్కెళ్లారు. అడ్డుకున్న భర్త అనిల్ కుమార్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతని ముందే భార్య మీనా దేవి గొంతు కోసి హత్య చేశారు. తీవ్రగాయాలతో ఉన్న అనిల్ కుమార్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నబొల్లారం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోష‌న‌ల్ పోస్ట్ Mahesh Babu | ఎప్పటికీ మీరే నా హీరో నాన్న .. కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్ ముగ్గురు స్నేహితులను కాపాడి కాపాడి ఆ పై తాను మృతి చెంది..అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

Namasthe Telangana30 May, 11:02 am
ఉద్యాన పంట ల రైతుల కు స బ్సిడీపై డ్రిప్ ఆటోమేషన్ సాంకేతికత అంద జేత

– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.బంగ కోటేశ్వర్ చుంచుప‌ల్లి, మే 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉద్యాన పంటల రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ శుభవార్త అందించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు “డ్రిప్ ఆటోమేషన్” సాంకేతికతను సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. బంగ కోటేశ్వర్ తెలిపారు. డ్రిప్ ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా రైతులు మొబైల్ ఫోన్ లేదా కంట్రోల్ యూనిట్ సహాయంతో నీటి పారుదల వ్యవస్థను సులభంగా నియంత్రించవచ్చు. దీంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్, శ్రమ, సమయం ఆదా అవుతాయని చెప్పారు. నేలలోని తేమ స్థాయిని బట్టి ఆటోమేటిక్‌గా నీటి సరఫరా జరిగే విధంగా ఈ వ్యవస్థ పని చేస్తుంద‌న్నారు. ఈ పథకం కింద ఒక హెక్టారు విస్తీర్ణానికి డ్రిప్ ఆటోమేషన్ యూనిట్ ధర రూ.40,000గా నిర్ణయించారు. ఇందులో రైతులకు 55 శాతం సబ్సిడీగా రూ.22,000 అందించగా, మిగిలిన 45 శాతం అంటే రూ.18,000 రైతులు భరించాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఈ సబ్సిడీని RKVY/PDMC పథకాల ద్వారా అందించనున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల రైతులు తమ సమీప ఉద్యాన శాఖ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Namasthe Telangana01 Jun, 09:45 am
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత..బంకుల వద్ద బారులు తీరిన వినియోగదారులు

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న తెలకపల్లి, తాడూరు, బిజినపల్లి మండలాల పరిధిలోని బంకులకు డీజిల్ సరఫరా కాకపోవడంతో కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలో సైతం పోలీస్ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నడిపిస్తున్న బంకులో మినహా పట్టణంలోని మిగతా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వినియోగదారులు డబ్బాలు, క్యాన్లు పట్టుకొని బారులు తీరారు. Cockroach Janta Party: ఢిల్లీకి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. జూన్ 6న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న Sleeplessness | నిద్ర లేమి వల్ల చురుగ్గా ఉండ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి.. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడట..? పవన్‌ కళ్యాణ్‌పై ఫైర్‌ అయిన మంత్రి పొన్నం

Namasthe Telangana01 Jun, 08:39 am
వికారాబాద్ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృతి

వికారాబాద్ : వికారాబాద్‌లోని మహావీర్ హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఒకే రోజు ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం మినపల్లి కలాంకు చెందిన ఐదునెలల పాప, చించెల్ పేట్ కు చెందిన 18నెలల బాబు చికిత్స కోసం దవాఖానలో చేరారు. అయితే సీనియర్ డాక్టర్స్‌ అందుబాటులో లేకుండా సెల్‌ఫోన్స్‌లో జూనియర్ డాక్టర్స్‌కు సూచనలు అందించడం వల్లే చిన్నారులు మృతి చెందారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Namasthe Telangana01 Jun, 09:00 am
జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు

మాగనూరు జూన్ 01: అక్రమంగా మొరం మట్టి తరలిస్తు్న్నా అధికారులు పట్టించుకోవడం లేదని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడేబల్లూరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు.. నల్లగట్టు సమీపంలో అక్రమంగా మొరం మట్టి తవ్వకాలు జరిపి దాదాపు 5 నుంచి 10 ట్రిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయంపై పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు దినాలు అని చూడకుండా అధికారుల కనుసైగలోనే ఈ అక్రమ మట్టిదంద కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులు వివరణ కోరగా అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని అయితే ఈ విషయంపై ఎస్ఐ నవీదుకు మూడు రోజుల కిందటే సమాచారమిచ్చారన్నారు. ఇదే విషయంపై ఎస్సై నవీద్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. అయితే కృష్ణ మండలంలో అక్రమ ఇసుక మొరం దందాలు పోలీసులు, రెవెన్యూ అధికారుల కనుసైగల్లోనే కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Namasthe Telangana01 Jun, 12:27 pm
బూర్గంపహాడ్ కబరస్థాన్ లో మంచినీటి బోరు ఏర్పాటు

బూర్గంపహాడ్, జూన్ 01 : బూర్గంపహాడ్ మండ‌ల కేంద్రంలోని కబరస్థాన్‌లో ఎమ్మెల్యే సొంత నిధులతో మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కబరస్థాన్‌లో మంచినీటి వసతి లేక అంత్యక్రియల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గతంలో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మహ్మద్‌పాషా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన కబరస్థాన్‌లో బోరు ఏర్పాటు చేయించడంతో మైనార్టీ నాయకులతో పాటు స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రహరీ లేకపోవడంతో ఆ నిర్మాణం కూడా త్వరలో చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, భజన సతీశ్‌, కైపు శ్రీనివాసరెడ్డి, గుద్దేటి ప్రవీణ్, బీబ్లాక్ మహిళా నాయకురాలు బర్ల నాగమణి, మైనార్టీ నాయకులు ఆరీఫ్, నయీమ్, దస్తగిరి పాల్గొన్నారు.

Namasthe Telangana01 Jun, 12:20 pm
గుడి, బడి, పబ్లిక్ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు తొలగించాలి

– పారిశ్రామికవాడలో బెల్ట్‌షాపు నిర్వాహకులకు సార‌పాక‌ సర్పంచ్ హెచ్చరిక బూర్గంపహాడ్, జూన్ 01 : బూర్గంపహాడ్ మండలంలో పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో బెల్టుషాపు నిర్వాహకులకు సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయ‌క్ హెచ్చరికలు చేశారు. సారపాక ప్రధాన సెంటర్‌తో పాటు గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషాపు నిర్వాహకులు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు దుకాణాలను తొలగించాలని లేదంటే సర్పంచ్‌గా బెల్టుషాపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. పబ్లిక్ ప్రదేశాలతో పాటు గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషాపులు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా విద్యార్ధులు, యువత చెడు మార్గం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సారపాక పంచాయతీ తీర్మానం ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో, గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషాపులు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా తెలియచేసి నిబంధనల ప్రకారం వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Namasthe Telangana31 May, 04:33 am
ఇసుక అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు

మాగనూరు మే 31: నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక, మట్టి( మొరం), వండ్రు మట్టి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా మండలంలో అక్రమ వ్యాపారం చేస్తున్న వారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన మేరా ఇసుక, మట్టి, ఒండ్రు మట్టికి ప్రభుత్వపరంగా అనుమతులు ఇస్తామన్నారు. కావున అవసరమైన లబ్ధిదారులు ట్రాక్టర్, టిప్పర్ల యజమానులు అనుమతులు పొందాలని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక అనుమతులు పొందుతున్న ట్రాక్టర్ యజమానులు నిజమైన లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయకుండా ఎక్కువ డబ్బులకు బయట వారికి అమ్ముకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. లబ్ధిదారులకాకుండా ఇసుక పక్క దారి పట్టిస్తున్న ట్రాక్టర్స్ను సీజ్ చేస్తామన్నారు.

Namasthe Telangana01 Jun, 06:33 am
బదిలీపై వెళ్తున్న పశువైద్యాధికారి రణధీర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన రైతులు

వేలేరు : 14 సంవత్సరాలుగా హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా సేవలం దించిన డాక్టర్ రణధీర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెళ్లారు. సోమవారం వేలేరు మండల కేంద్రంలో ఆయన సేవలను గుర్తించి స్థానిక రైతులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. శాలువతో సత్కరించి కన్నీటి పర్యంతమైయ్యారు. గత 14 సంవత్సరాలుగా వేలేరు మండల రైతులతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడిందని డాక్టర్ రణధీర్ రెడ్డి సేవలను కోల్పోతుండటం బాధాకరమని రైతులు కన్నీటి పర్యంతమైయ్యారు. 15 సంవత్సరాలుగా సేవలంది పాడి పరిశ్రమతో రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా సాగేలా డాక్టర్ రణధీర్ రెడ్డి కృషి చేశారని కమ్మరిపేట సర్పంచ్ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల రైతులు పాల్గొన్నారు.

Namasthe Telangana02 Jun, 11:36 am
జూలూరుపాడులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు, జూన్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యల్లంకి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించగా, పార్టీ సీనియర్ నాయకులు యదలపల్లి వీరభద్రం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారిందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దుకుందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, పరిపాలనా రంగాల్లో కొత్త రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర అభివృద్ధి మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, భూక్యా సేవా, భూక్యా జోహార్ లాల్, యల్లంకి సత్యనారాయణ , సాయిన్ని హరీష్, తాళ్లూరి రామారావు, పురస్తపురవు రామకృష్ణ, బండారి వెంకయ్య, లేళ్ల సీతయ్య, ధర్మరాజుల నరసింహారావు, నిమ్మటూరి కనకయ్య, పొన్నెబోయిన పుల్లయ్య, నూతి నరసింహారావు, బానోత్ హనుమంతరావు, ఈసం వెంకటేశ్వర్లు, మోదుగు నరసింహారావు, పోతురాజు కృష్ణ, ఉప సర్పంచులు బాదావత్ నరేష్, నూనావత్ నవీన్, కుంజా రవిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలూరుపాడులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Namasthe Telangana01 Jun, 01:24 pm
ప్రోటోకాల్ వివాదం.. బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత

– సర్పంచ్‌ భర్త, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పై దాడి చేశారంటూ ఫిర్యాదు – కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారంటూ ఆరోపణలు – అధికార పార్టీకి పోలీసులు అంటకాగడంపై తీవ్ర విమర్శలు బీబీనగర్‌, జూన్ 01 : బీబీనగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్‌ వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్‌ కొలను వాణి, బీఆర్‌ఎస్ నాయకుల కథనం ప్రకారం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్‌ ప్రకారం సర్పంచ్‌తో రిబ్బన్‌ కటింగ్‌ నిర్వహించాలని గ్రామ కార్యదర్శి సూచించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి సర్పంచ్‌ చేతిలో ఉన్న కత్తెరను తీసుకుని స్వయంగా రిబ్బన్‌ కట్‌ చేశారని ఆరోపించారు. దీనిని సర్పంచ్‌, వార్డు సభ్యులు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీయగా, సర్పంచ్‌ భర్త కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సురకంటి సుధాకర్‌ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. అనంతరం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ కూడా పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని, సీఐ, ఎస్ఐ సమక్షంలో తమను కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారులకు సర్పంచ్‌ , వార్డు సభ్యులు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు మార్గమధ్యలో అడ్డగించి పోలీస్ స్టేషన్‌కు తరలించారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. అనంతరం స్టేషన్‌లో తమతో

Namasthe Telangana01 Jun, 12:16 pm
ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

ఉప్పల్‌, జూన్‌ 1 : ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలోని డివిజన్‌లలో తాగునీటి సరఫరా, నూతన పైపు లైన్ల ఏర్పాటు లీకేజీల నివారణ, మురుగునీటి నిర్వాహణ తదితర అంశాలపై సోమవారం జలమండలి సీజీఎం పంకజ, జీఎం సంతోష్‌లతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను, వేసవి కాలంలో నీటి కొరత లేకుండా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అదే విధంగా పాత పైపులైన్ల కారణంగా తరచూ ఏర్పడుతున్న లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పైపులైన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మురుగు నీటి సమస్యలు అధికంగా ఉన్న కాలనీలలో ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులతో పాటు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Namasthe Telangana31 May, 06:30 am
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృధికి కృషి

రాజన్న సిరిసిల్ల, మే 31: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి సహకారం అందిస్తాం అని నవతేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చైర్మన్ గండ్ర యాదగిరి రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేశారని, ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. కోరుట్లపేట గ్రామశాఖ అధ్యక్షుడు లోకుర్తి బాలమల్లు, ఆలయ నిర్వాహకులు చిదుగు గోవర్ధన్ గౌడ్, సర్పంచ్ ఇల్లేందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Namasthe Telangana31 May, 05:19 am
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ స్థానాచారి కపిందర్ వేదోక్త ఆశీర్వచనాలతో కలెక్టర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ చెక్కిళ్ల అశోక్, ఏఎసై చిలుక శ్రీనివాస్, ఆర్ఐ తిరుపతి ఉన్నారు.

Namasthe Telangana02 Jun, 10:16 am
తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ జావిద్ కు ఘన సన్మానం

బచ్చన్నపేట, జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు ఎండీ జావిద్‌ను జనగామ జిల్లా బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అలాగే తెలంగాణ అమరవీరులకు బచ్చన్నపేట చౌరస్తాలో అమర వీరుల స్థూపం వద్ద ఘన మంగళవారం నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పోరాటం వెలకట్టలేనిదన్నారు. వారిని గౌరవించుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, నాయకులు ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, కొండి వెంకటరెడ్డి, పులిగిల్ల పూర్ణచందర్, సిద్ధిరాం రెడ్డి, ఉపసర్పంచ్ బైరి రజిత, బొమ్మెన ఆంజనేయులు, అల్వాల ఎల్లయ్య. ఎండీ షబ్బీర్, శివరాత్రి రాజు, మచ్చ సతీష్, గంధమల్ల మహేష్, కర్ణాకర్, దిలీప్, ఎండీ అజీమ్, చింతల వెంకటయ్య పాల్గొన్నారు.

Namasthe Telangana02 Jun, 09:10 am
ఎన్నో ఏండ్ల పోరాట ఫలితమే స్వరాష్ట్ర సాధన

ధర్మసాగర్ : పోరాటాల ఫలితమే తెలంగాణ స్వరాష్ట్ర సాధన అని పీఏసీఎస్ ఛైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించకున్న తెలంగాణను కేసీఆర్‌ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రాజేశ్వర్ రెడ్డి, తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సదానందం, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్ కుమార్, పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీధర్ రావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపించారు. అనంతరం మండల ప్రజలకు అధికారులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ యాద కుమారస్వామి, సీఈవో రాజిరెడ్డి, ఎస్సైలు జానీ పాషా, రవీందర్ చారి, డీటీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Namasthe Telangana02 Jun, 08:58 am
బచ్చన్నపేటలో మిన్నంటిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

బచ్చన్నపేట, జూన్ 2 : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపానికి, ప్రజాకవి కాలోజీ నారాయణరావు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు అంటూ చేసిన నినాదాలతో చౌరస్తా మార్మోగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో ఉంచుకుని, రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కోనేటి స్వామి, గౌరవ సలహాదారులు నల్లగోని బాలకృష్ణ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గౌరవ సలహాదారులు బోడకుంటి మల్లయ్య, దొంతుల చంద్రమౌళి, అల్లాదుర్గం వెంకటేశ్వర్లు, ఫోరం ప్రధాన కార్యదర్శి రాపేల్లి వెంకటేశ్వర్లు గిరబోయిన బాల్ సిద్ధులు, ఎండీ జావిద్, షబ్బీర్, ముసిని శ్రీశైలం గౌడ్, అఖిల్ మాల, మల్లయ్య, వార్డు సభ్యులు కర్రె ప్రశాంత్, మినలాపురం మల్లేశం పాల్గొన్నారు.

Namasthe Telangana26 May, 06:29 am
Gadwala | ఉపాధి హమీ పథకంలో అవకతవకలు..ఇర్కిచేడులో లక్షల రూ…గోల్‌మాల్‌

గద్వాల అర్బన్‌,మే 24 : ఉపాధి హామీ పథకంలో పనికి రాకుండా ఉన్న వ్యక్తుల మీద బిల్లులు లిప్ట్‌ చేసి లక్షల రూపాయలు కాజేసిన ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పరిధిలోని ఇర్కిచేడు గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం పంచాయతీ నిధులలో అవకతవలపై అరోపణలు రావడంతో అధికారులు నిధుల విషయంలో ఆరా తీస్తున్న క్రమంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. గతంలో చేసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పంచాయతీ ఖజనాకు గండికొట్టినట్లు సమాచారం. అలాగే ఉపాధి హామీ పథకంలో కూడా లక్షల రూపాయలు కాజేసిన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. ఈ క్రమంలో ఉపాధి పనికి వెళ్లని వారిపై కూడా బిల్లులు లిప్ట్‌ చేసి కాజేయడంతో అసలు వ్యవహరం బయటకిపొక్కిన్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఆర్టికల్చర్‌కు సంబంధించి ఆయా పనులలో కూడా అవకతవకలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపై గ్రామంలోని కొందరు వ్యక్తులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ నిధులతో పాటు ఉపాధి హామీ పథకం, ఆర్టికల్చర్‌ తదితర వ్యవహారాలపై విచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై ఎంపీడీవో రమణరావు వివరణ కొరగా..ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Namasthe Telangana26 May, 06:08 am
Singaram | ధాన్యం కొనుగోలు చేయాలని గోదాంకు తాళం వేసి సింగారం రైతుల నిరసన

యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోలులో జాప్యం, లిఫ్టింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సింగారం గ్రామ రైతులు గోదాంకు తాళం వేసి నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు, మిల్లర్లు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి గోదాంల నుంచి లిఫ్టింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించినట్లు సమాచారం.

Namasthe Telangana30 May, 02:08 pm
రామవరం డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం విరమించుకోవాలి

– సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ రుద్రంపూర్, మే 30 : రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, ఆస్పత్రిని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, మాజీ కార్మికులు, వారి కుటుంబాలతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఈ వైద్యశాల ఎంతో కాలంగా వైద్య సేవలు అందిస్తోందని, ఈ ఆస్పత్రిలో కొత్త వైద్యుల నియామకం చేపట్టకుండా, కేవలం ఇద్దరు స్టాఫ్‌తో మందులు ఇచ్చేలా యాజమాన్యం కుట్రపూరితంగా మార్చిందని మండిపడ్డారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగి పదవీ విరమణ పొందడంతో, కొత్తవారిని నియమించకుండా ఆస్పత్రిని ఏకంగా సీల్ చేయడం సరైంది కాదన్నారు. ఈ ఆస్పత్రిని మూసివేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలు చిన్నపాటి వైద్య సేవలకు సైతం సుదూర ప్రాంతంలోని ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర భారంగా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం మొండివైఖరి వీడి తక్షణమే ఇక్కడ వైద్యులను, సిబ్బందిని నియమించి ఆస్పత్రిని యధావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.