translateexpand_more

Gachibowli News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 02:05 pm
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ

తెలంగాణలో పవన్ కల్యాణ్ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ చర్య పూర్తిగా అర్థరహితమని, రాజకీయ దురుద్దేశంతోనే తమ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.వివరాల్లోకి వెళితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' పేరిట ఓ ఇండోర్ కార్యక్రమం నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. సుమారు 2000 మంది పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం తలపెట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం వంటి అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.అయితే, పార్కింగ్ సమస్యను కారణంగా చూపుతూ ప్రభుత్వం ఈ సభకు అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా తప్పుబట్టింది. నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ సమావేశాలు జరిగే సంధ్య కన్వెన్షన్‌లో, కేవలం తమ కార్యక్రమానికే పార్కింగ్ సమస్యను కారణంగా చూపడం సహేతుకం కాదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, ఆయనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని జనసేన గుర్తుచేసింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోవని స్వయంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించింది. అయినప్పటికీ, ఆ వ్యవహారాన్ని సాకుగా చూపి సభను అడ్డుకోవడం సరికాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

SkyC Media01 Jun, 01:45 pm
హైదరాబాద్ లో జనసేన నవ నిర్మాణ సంకల్ప సభకు పర్మిషన్ నో

హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ రేపు నిర్వహించాలనుకున్న జనసేన నవ నిర్మాణ సంకల్ప సభ సమ్మేళనానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఈ సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. ఈనెల జూన్ 2 తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్లు మరియు లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి కొన్ని ఉద్రిక్తతలు కూడా నెలకొని ఉన్నాయి. దీంతో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ఈ సభ నిర్వహణకు అనుమతులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశం ద్వారా తెలంగాణలో పార్టీని మరింత విస్తరించాలని జనసేన నాయకత్వం గట్టిగా భావించింది. సంస్థాగత బలోపేతం మరియు భవిష్యత్ వ్యూహాలపై పవన్ కళ్యాణ్ ఈ వేదిక ద్వారా దిశా నిర్దేశం చేయాలని ప్లాన్ చేశారు. సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు వెంటనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫలితంగా ఈ సభ నిర్వహణపై తుది నిర్ణయం కోసం ఇప్పుడు కోర్టు ఆర్డర్ వైపు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే జనసేన పార్టీ తన తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు ఈ జనసేన నవ నిర్మాణ సంకల్ప సభ చాలా కీలకమైనదిగా నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో

AP7AM30 May, 01:30 am
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 11 మందికి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) విద్యార్థులు సత్తా చాటారు. వర్సిటీలో డేటా సెంటర్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసుకున్న 11 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగాలు సంపాదించారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపికైన వీరికి ఏటా రూ.7 లక్షల ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది.ఈ కోర్సులో మొత్తం 14 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోగా, వారిలో 11 మంది మైక్రోసాఫ్ట్‌కు ఎంపిక కావడం విశేషం. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు గల మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో ఈ వర్సిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు.తమ విద్యార్థుల విజయంపై యూనివర్సిటీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. "పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దడంలో ఇదొక గర్వించదగ్గ మైలురాయి" అని అభివర్ణించింది. తెలంగాణ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఈ వర్సిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రారంభమైన కొద్ది కాలంలోనే వర్సిటీ 17 కోర్సులను ప్రవేశపెట్టి, 418 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.