
హైదరాబాద్లో జనసేన పార్టీ రేపు నిర్వహించ తలపెట్టిన నవనిర్మాణ సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2వ తేదీన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో 'జనసేన సాధక్' (యాక్టివ్ సభ్యులు) సమావేశం నిర్వహించాలనుకున్నారు. సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేసిన ఈ సమావేశానికి అనుమతిని తిరస్కరిస్తున్నట్లు సెరిలింగంపల్లి జోన్ డీసీపీ కార్యాలయం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.శాంతిభద్రతల సమస్యలు, స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల ప్రొఫెసర్ కె. నాగేశ్వర్పై ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ కేసులు నమోదు కావడం, ఆ తర్వాత ఏపీకి చెందిన జనసేన సహా కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల వల్ల తెలంగాణలోని విద్యార్థి సంఘాలు, ఇతర బృందాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని వివరించారు.అంతేకాకుండా, జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సమయంలో సమావేశం నిర్వహించడం సమంజసం కాదని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహిస్తే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని, నిరసనలు, ఆందోళనలు జరిగి ట్రాఫిక్కు అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.వీటితో పాటు, సమావేశం జరగాల్సిన సంధ్యా కన్వెన్షన్కు తగినంత పార్కింగ్ సౌకర్యం లేదని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. నిర్వాహకులు పార్కింగ్ కోసం ప్రతిపాదించిన ఎఫ్సీఐ సొసైటీ లేఅవుట్కు సంబంధించిన స్థలంపై న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని,
