translateexpand_more

High Court News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 01:30 pm
పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభకు బ్రేక్.. అనుమతి నిరాకరించిన పోలీసులు

హైదరాబాద్‌లో జనసేన పార్టీ రేపు నిర్వహించ తలపెట్టిన నవనిర్మాణ సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2వ తేదీన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో 'జనసేన సాధక్' (యాక్టివ్ సభ్యులు) సమావేశం నిర్వహించాలనుకున్నారు. సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేసిన ఈ సమావేశానికి అనుమతిని తిరస్కరిస్తున్నట్లు సెరిలింగంపల్లి జోన్ డీసీపీ కార్యాలయం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.శాంతిభద్రతల సమస్యలు, స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులు నమోదు కావడం, ఆ తర్వాత ఏపీకి చెందిన జనసేన సహా కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల వల్ల తెలంగాణలోని విద్యార్థి సంఘాలు, ఇతర బృందాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని వివరించారు.అంతేకాకుండా, జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సమయంలో సమావేశం నిర్వహించడం సమంజసం కాదని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహిస్తే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని, నిరసనలు, ఆందోళనలు జరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.వీటితో పాటు, సమావేశం జరగాల్సిన సంధ్యా కన్వెన్షన్‌కు తగినంత పార్కింగ్ సౌకర్యం లేదని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. నిర్వాహకులు పార్కింగ్ కోసం ప్రతిపాదించిన ఎఫ్‌సీఐ సొసైటీ లేఅవుట్‌కు సంబంధించిన స్థలంపై న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని,

SkyC Media01 Jun, 01:45 pm
హైదరాబాద్ లో జనసేన నవ నిర్మాణ సంకల్ప సభకు పర్మిషన్ నో

హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ రేపు నిర్వహించాలనుకున్న జనసేన నవ నిర్మాణ సంకల్ప సభ సమ్మేళనానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఈ సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. ఈనెల జూన్ 2 తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్లు మరియు లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి కొన్ని ఉద్రిక్తతలు కూడా నెలకొని ఉన్నాయి. దీంతో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ఈ సభ నిర్వహణకు అనుమతులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశం ద్వారా తెలంగాణలో పార్టీని మరింత విస్తరించాలని జనసేన నాయకత్వం గట్టిగా భావించింది. సంస్థాగత బలోపేతం మరియు భవిష్యత్ వ్యూహాలపై పవన్ కళ్యాణ్ ఈ వేదిక ద్వారా దిశా నిర్దేశం చేయాలని ప్లాన్ చేశారు. సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు వెంటనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫలితంగా ఈ సభ నిర్వహణపై తుది నిర్ణయం కోసం ఇప్పుడు కోర్టు ఆర్డర్ వైపు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే జనసేన పార్టీ తన తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు ఈ జనసేన నవ నిర్మాణ సంకల్ప సభ చాలా కీలకమైనదిగా నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో