translateexpand_more

Pawan Kalyan News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 03:54 pm
కేసీఆర్, రేవంత్ వేరే రాష్ట్రాలకు పోవచ్చు.. పవన్ కల్యాణ్ సభ పెట్టుకోకూడదా? కాంగ్రెస్ పై రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao: తెలంగాణలో జనసేన సభకు అనుమతించకపోవడంపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో ఉందని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమేంటి అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. ”పవన్ కల్యాణ్ ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేశంలో అనేకమంది అనేక ప్రాంతాలకు వెళ్లి మాట్లాడుతుంటాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మీడియాతో చిట్ చాట్ చేస్తానే ఉంటారు. మరో రాష్ట్ర డిప్యూటీ సీఎం పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ లేదా సభ పెడితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తారు. కేసీఆర్ వేరే రాష్ట్రానికి పోయి రైతులకు పైసలు ఇచ్చి వస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగం. ఆయనను మేము ఎలా వేరు చేస్తాం. ఆయన ఏ రాష్ట్రంలో ఉంటే ఏంటి? ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు కూడా. ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వారు వేరే రాష్ట్రాలకు పోవద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? అని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Asianet News Telugu02 Jun, 02:32 pm
తెలంగాణ మీ జాగిరా.? పూర్తిగా ఓపెన్ అయిన ప వ న్ క ళ్యాణ్

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

10TV Telugu02 Jun, 02:22 pm
ఎక్కువ ప్యాకేజీ ఇస్తే జగన్ కి కూడా మద్దతిస్తారు..!- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో ప్యాకేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల సినిమాలో నటిస్తారు.. రాజకీయాల్లో సైతం ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే పవన్ మద్దతిస్తున్నారు అని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ ఆయనకి కూడా మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జైల్లో కలవడమే పవన్ ప్లస్ పాయింట్ అని అన్నారు. ”పవన్ కల్యాణ్ తెలంగాణకి క్షమాపణ చెప్తారని అనుకున్నా. నరదృష్టి ఉన్న దగ్గరికి పవన్ ఎందుకు రావాలి? పవన్ వెళ్ళి గుజరాత్ లో పోటీ చేయాలి. నల్లగా అయిపోతాననే పవన్ విజయవాడ వెళ్ళడం లేదు. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు? పవన్ ఇంగ్లీషులో మాట్లాడింది అమిత్ షా కి అర్థం కావడానికే. కేసీఆర్, అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి భూముల వ్యవహారమే తెలీదు. పవన్ కబ్జా చేసిన భూమి దగ్గరికి వెళ్తే కేసులు పెడతారా? రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి పవన్ డిప్రెషన్ లో ఉన్నారు” అని అనిరుధ్ రెడ్డి అన్నారు. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

10TV Telugu02 Jun, 01:56 pm
తెలంగాణ మా అయ్య జాగీరే- పవన్ కల్యాణ్ కు మంత్రి పొన్నం కౌంటర్

Ponnam Prabhakar – Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. మిస్టర్ పవన్ కల్యాణ్… ఇది మా అయ్య జాగీరే అని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ.. 4 కోట్ల మంది ప్రజల జాగీరు. మీ అయ్య జాగీరు కాదు అని ఎదురుదాడికి దిగారు. ”పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి చేసేదేంటి? పవన్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్ తో ఒక క్యారెక్టర్ చేయిస్తా. తెలంగాణపై పవన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్. గద్దర్ కు కార్ కొనిచ్చినా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తనకి ఆంధ్రాలోనే దిక్కు లేదని పవన్ చెప్పుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా వాళ్ళని మేము ఏమీ అనలేదు. మేం ఆంధ్రా వాళ్ళని ఏదో అన్నట్టు పవన్ అబద్ధాలు చెబుతున్నారు. పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు మీ అయ్యా జాగీరా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? పవన్ తిరిగితే జనాలు వస్తారు. కానీ, ఓట్లు వేయరు. పవన్ వచ్చినా, పోయినా మాకేం సంబంధం లేదు. తెలంగాణ ఎప్పుడైనా ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుంది. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు” అని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

SkyC Media02 Jun, 12:55 pm
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టిస్తూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎవరి సొత్తు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ పుట్టిందే హైదరాబాద్ గడ్డపై అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము కేవలం రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే వ్యతిరేకించామని పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. తాము బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనుమతులు నిరాకరిస్తే ఇళ్ల నుంచే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ పక్క రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఆయన అభివర్ణించారు. పవన్‌కు అహంకారం ఎక్కువైందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాంగ్రెస్, జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు ఇంటర్‌స్టేట్ రాజకీయ వివాదంగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2026 నుంచి 2028 మధ్య కాలంలో తెలంగాణలో బలం పుంజుకోవాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని యువత, అర్బన్ ఓటర్లే లక్ష్యంగా జనసేన వ్యూహాలు రచిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం జనసేనకు పెద్ద సవాలుగా మారనుంది. టీడీపీ, జనసేన కూటమి తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాబోయే రోజుల్లో జనసేన తెలంగాణలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ వ్యూహం కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Samayam Telugu02 Jun, 12:45 pm
ఏపీ-తెలంగాణ హైవేకు ఆ మాజీ సీఎం పేరు పెట్టాలి.. పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కించపరిస్తే, అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే.. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతల విగ్రహాలను కూల్చేస్తామని.. పలువురు తెలంగాణ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో.. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యా్ణ్ స్పందించారు. ఎవరి విగ్రహాలు పెట్టాలి వద్దు అనేది ప్రజల ఇష్టం అని తెలిపారు. అలా అనుకుంటూ పోతే.. స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీజీ, అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాలను కూడా పెట్టొద్దని.. కొందరు వాదిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోని కొంతమంది నాయకులు.. ప్రాంతీయవాదాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారని.. ఇతర రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాల నేతలను ద్వేషిస్తున్నారని పవన్ కళ్యాణ్ ‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వాదం అనేది ఉగ్రవాదం కంటే చాలా హానికరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయవద్దంటూ కొంతమంది నేతలు, పలు సంఘాలు డిమాండ్ చేయడం, విగ్రహాల ఆవిష్కరణలను అడ్డుకోవడం వంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకోవడంతో.. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు ఐక్యతకు చిహ్నం మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని.. ఆయన విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే హైవేపై పెట్టాలని.. ఆ హైవేకు బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. గొప్ప నేతల విగ్రహాలు వారి గుర్తులుగా ఏర్పాటు చేస్తారని.. అలాంటి నాయకులకు ప్రాంతీయ బేధాలు ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇలా చేసుకుంటూ పోతే.. మహాత్మాగాంధీ గుజరాత్ వ్యక్తి అని.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహారాష్ట్ర వ్యక్తి అని.. వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయవద్దనే వాదనలు తెరపైకి వస్తాయని.. ఇలాంటి ప్రాంతీయ విబేధాలు దేశ ఐక్యతకు మంచివి కావని సూచించారు. అదే సమయంలో తెలంగాణలో ప్రారంభమైన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం.. తమిళనాడులో హిందీ గో బ్యాక్ డిమాండ్లు.. దక్షిణాదిన నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అని కొందరు మాట్లాడుతున్నారని.. ఇవన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మనం అందరం భారతీయులం అని గుర్తు చేశారు. ఇలాంటి కేంద్రం ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యాస, భాషలో హిందుస్తానీ ఉందని అలాంటి తెలంగాణలో హిందీ ఉండొద్దని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా పశ్చిమ బెంగాల్‌లో ఇలాగే మాట్లాడారని.. బెంగాల్‌కు వస్తే తన్ని తరిమేస్తామని టీఎంసీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. కానీ నాయకుల మాటలు వేరు ప్రజల మాటలు వేరని.. అక్కడి ప్రజలు టీఎంసీ నాయకులను తన్ని తరిమేశారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Sakshi02 Jun, 12:21 pm
తెలంగాణలో జనసేన ఉంటుంది

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

Zee Telugu02 Jun, 12:07 pm
తెలంగాణ మీ అయ్య జాగీరా...ప్రెస్ మీట్ లో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Andhra Pradesh Deputy cm Pawan kalyan press meet in Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంశం రాజకీయాల్లో దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు అడుగడుగున అడ్డుకున్న వారిపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రము కావాలని రాకముందే కల్చరల్ పరంగా సినిమా పరంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గతంలో తిరిగిన వాడినని చెప్పుకొచ్చారు. తెలంగాణ అంటే నాకు ఎంతో ఇష్టమన్నారు. తెలంగాణ పైన నాకు ఉన్న ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మేము వ్యతిరేకం కాదని విభజన చేసిన విధానం కరెక్ట్ కాదని మాత్రమే చెబుతున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తన వారాహికి అనుమతి లేదంటే, కోదాడ వరకు నాకు అండగా తెలంగాణ వారు నిలిచారన్నారు. 2029 లో తప్పకుండా జనసేన పోటీ చేస్తుందన్నారు. బెదిరింపులకు లొంగేవాడిని కాదన్నారు. నా గుండెల్లో తెలంగాణ అంటే ఎంతో గౌరవముంటున్నారు. ఇంకెంత కాలం ఆంధ్రోడు అని తిడుతారన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న చాలా మంది గతంలో తాను తిరిగిన ఆదిలాబాద్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో కనీసం వెళ్లలేదన్నారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. గతంలో తనను వైసీపీ నాయకులు బెదిరింపులకు గురిచేశారన్నారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై కూడా వెంటనే విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే తన ఆస్తుల్ని సీజ్ చేయాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకొవాలన్నారు. ఏనాడు కూడా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పైన విద్వేషాం చూపించలేదన్నారు. హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతావని కొంత మంది అంటున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. మీ అయ్యా జాగిరా తెలంగాణ అంటూ.. సభను అడ్డుకున్న వారిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాంతో ఊగిపోయారు. నన్ను బెదిరింపులకు గురిచేసిన వారి విషయంలో రాహుల్ గాంధీ స్పందించాలన్నారు. ఇక్కడ ఎన్నికల్లో కూడా పోటీచేస్తానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగమన్నారు. ఎంత కాలం ప్రాంతీయ వివాదాలు రెకెత్తిస్తారని మండిపడ్డారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావొద్దని సీఎం రేవంత్ తీర్మానం చేయాలన్నారు. ఇక్కడ ఎన్నికల్లో పొటీ చేస్తా..నేనే తిరుగుతానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్బాగమన్నారు. ఎవరు రావొద్దనడానికి ఇదేమన్న పాలస్తీనానా అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పడంతో కాంగ్రెస్ దిమ్మలు కూల్చేస్తే జనసేన అండగా నిలిచిందన్నారు. ప్రతి సమస్యలపై పొరాడుతానన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే ఈ రోజు పదవుల్లో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. దేశంలో తెలంగాణ అంతర్బాగమన్నారు. దేశ సమగ్రతకు భంగం కల్గిస్తే చూస్తు ఊరుకోబోమన్నారు. ఆంధ్రాను, ఆంధ్రావారిని ద్వేశించి ఏంచేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. మళ్లీ గడీల పాలన తీసుకొస్తారా అంటూ మండిపడ్డారు. ప్రతి ఇంట్లోకి దూరుతానని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలపై చర్చిద్దామన్నారు. వైఎస్సార్ తనను రెచ్చగొడితే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నేను చచ్చిపొవడానికి సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. వైఎస్సార్ ఉన్నప్పుడు లేవని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయని పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ లో బాంబులు పెట్టిన వారికి అనుకూలంగా కాంగ్రెస్ మాట్లాడిందన్నారు. తెలంగాణలో వలస తగ్గాలంటే ఏపీలో ఉద్యోగాలు పెరగాలన్నారు. బెంగాల్ కు వస్తే అమిత్ షాను తరిమేస్తారని గతంలో అన్నారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు పెట్టేవారిపై కేంద్రం దృష్టి సారించాలన్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

10TV Telugu02 Jun, 12:03 pm
తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

NTV Telugu02 Jun, 12:01 pm
తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్

Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ ఫైర్‌ అయ్యారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో లక్షలాది మంది జనసేన కార్యకర్తలు ఉన్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు. జనసేన పార్టీని హైదరాబాద్ నడిబొడ్డునే స్థాపించామని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, తెలంగాణపై తమకు కొత్తగా ప్రేమ పుట్టలేదని చెప్పారు. తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించడం రాజకీయ పార్టీగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. తాను తెలంగాణలోని నాలుగు మూలలూ తిరిగానని, రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడూ కోరుకునే వ్యక్తినని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదిలాబాద్ వంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించానని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న చాలామంది అప్పట్లో అక్కడికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానంపైనే తన అభ్యంతరం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఎవరూ తనను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. తన ఇంటి చిరునామా చెప్పడానికే ప్రెస్‌మీట్ పెట్టానని, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను గతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరించారని, కానీ తెలంగాణ ప్రజల నుంచి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాల కొరత లేదా ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎవరైనా అన్యాయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందులో తాను ఉన్నా మినహాయింపు అవసరం లేదని పేర్కొన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరపాలని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే ఆస్తులను సీజ్ చేయాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ గురించి ప్రస్తావించిన పవన్ కల్యాణ్, ఆయన జీవించి ఉన్న సమయంలో చాలా మంది పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో గద్దర్ తనను సహాయం కోరగా, తాను వెంటనే వాహనం కొనిచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే తెలంగాణ అంతటా పర్యటిస్తానని, ప్రజా సమస్యలపై ఇదే విధంగా మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Oneindia Telugu02 Jun, 11:58 am
తెలంగాణ మీ అయ్య జాగీరా ? బెదిరింపులపై పవన్ ఫైర్

ఆంధ్రలో తనను తిరగనివ్వనని అంటే, తన వారాహికి అనుమతి ఇచ్చింది తెలంగాణాయే అని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. ఇక్కడి జనసైనికులే తనకు అండగా నిలిచారన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేద్దామని మా నాయకులు అంటే.. ప్రజలు కోరుకుంటే చూద్దామని చెప్పినట్లు వెల్లడించారు. ఇక్కడ కూర్చొన్నా ఆంధ్రలోనే అధికారం కోరుకుంటానని, తెలంగాణలో కేవలం మార్పు మాత్రమే కోరుకుంటానన్నారు. ఈ మధ్య మాట్లాడితే ఆంధ్ర ఆంధ్ర అంటున్నారని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదని, వాళ్లంతా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఇక్కడ ఉండే వారు కాదన్నారు. దీన్ని ఎవరూ మర్చిపోరన్నారు. హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతావని, ఇక్కడేం పని అని అడుగుతున్నారని, మీరెవరు నన్ను బెదిరించడానికి అన్నారు. బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణా అని ప్రశ్నించారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే తనకు బెదిరింపులు ఎక్కువన్నారు. తెలంగాణలో రానివ్వనంటారని, ఆంధ్రలో అయితే కోనసీమలో తల తీసేయమంటారన్నారు.తాను 2019లో ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు ఇక్కడ ఉంటే అలాంటి పరిస్ధితి రానిచ్చే వాళ్లం కాదన్నారు. తెలంగాణలో తాను సాధించేది ఏమీ లేదన్నారు. ప్రెస్ మీట్ కూడా ఇంట్లోనే ఎందుకు పెట్టానంటే, దాడి చేసే వాళ్లకు అవకాశం కోసమేననన్నారు. బాంచెన్ సారు కాల్మొక్తా అనే వాళ్లం అయితే పార్టీ ఎందుకు పెడతామన్నారు. మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా అన్నారు. 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నాయకుడిని అయినా ఒక్క మాట అనలేదన్నారు. తనకు పౌరుషం చచ్చిపోలేదని, తెలంగాణపై ప్రేమ కూడా చావలేదన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు మాట్లాడతానన్నారు. తెలంగాణలో జనసేన ఎదగాలని కోరుకుంటున్నానని, ఇక్కడి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన హెడ్ ఆఫీసును మంగళగిరిలో పెట్టుకున్నానన్నారు. తన గుండెల్లో తెలంగాణ ఉందని, తనను ఎంత తిట్టినా బెదిరిపోనున్నారు. ఏపీలో వైసీపీ గూండాల బెదిరింపుల కంటే ఇక్కడి వాళ్ల బెదిరింపులు ఎక్కువేమీ కాదన్నారు. ఓ విశ్లేషించే వ్యక్తి వల్లే ఈ గొడవ ప్రారంభమైందన్నారు. ఆయన మీడియాలో అమిత్ షా, తాను మాట్లాడుకున్నట్లు చెప్తే దాన్ని ఖండించామన్నారు. తనను ఓ మాట అంటే జనసైనికులు కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి వదిలేయమని చెప్పానన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా అభివృద్ది లేకపోవడానికి ఇంకా ఆంధ్రోళ్లు, పవన్ కళ్యాణే కారణమా అని అడిగారు. ఆంధ్రా ప్రజలు, తెలుగు సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారణం మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులే అన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిలో పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన్నూ ఉరి తీయాలన్నారు. గుజరాతీలు సూరత్ లో, నాందేడ్ లో స్థానికులు తెలుగు వాళ్లు వద్దని తరిమేస్తే దేశం నిలబడుతుందా అని పవన్ అడిగారు. నాగేశ్వర్ ను ప్రశ్నిస్తే తనకు తెలంగాణ అంటే పడదు, వ్యతిరేకం అని, చెరువు కబ్జా చేశానని ఆరోపణలు చేస్తున్నారని, తనకేం పనిలేదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవమని, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువును ఆక్రమించుకున్నాడని తేలితే దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న ఓ అనలిస్ట్ .. వామపక్ష భావజాలాన్ని వదిలి ప్రాంతీయవాదానికి వచ్చారన్నారు. గద్దర్ మీద తన ప్రేమ ఈనాటిది కాదన్నారు. ఆయనకు తాను బండి కొనిచ్చానన్నారు. బతికున్నప్పుడు గద్దర్ కు మీరేం చేశారని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన వైఎస్ కు కొమ్ముకాసిన వ్యక్తులు ఇవాళ తన నాలుకలు కోస్తామంటున్నారని పవన్ విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రకు వస్తే తాను స్వాగతించానని, గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టి, గతంలో జనసేనలో పనిచేసిన వ్యక్తిని ఏపీకి అధ్యక్షుడిగా పెడితే స్వాగతించామన్నారు. ఆంధ్రాలో సీఎంకు దిక్కులేని పవన్ కళ్యాణ్.. ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కానీ ఇక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామనే భయం అన్నారు. 2 వేల మంది జనసైనికులతో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వనంటే ఎలా అన్నారు. ఓ అనలిస్ట్ కూర్చుని అమిత్ షా గురించి మాట్లాడితే, తాను దాన్ని ప్రశ్నిస్తే ఇందులో ప్రాంతీయత ఎక్కడ ఉందని, తెలంగాణలో అవమానం ఎక్కడుందని, కులాలు ఎక్కడ వచ్చాయని, మాకు నొచ్చుకునే హక్కు కూడా లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పీకలు కోసుకుంటా కానీ తనకు భయం అయితే రాదన్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అడుగుతున్నారని, అక్కడి కాంట్రాక్టర్లు ఇక్కడ బాగానే ఉన్నారని, మీరు ఎవరిని పిచ్చోళ్లని చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిజంగా వద్దనుకుంటే పవన్ కళ్యాణ్ ను రానివ్వబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నారు. తన ప్రేమను శంకిస్తే .. ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదని, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణలో తిరిగేందుకు సిధ్దమన్నారు. ప్రతీ సమస్య మీదా మాట్లాడతామనని, ప్రతీ అన్యాయాన్నీ ఎదుర్కొంటానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగమని మర్చిపోవదన్నారు. మీరు బెదిరిస్తే భరించేది లేదన్నారు. దశాబ్దం

NTV Telugu02 Jun, 11:47 am
బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకర్తగా తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలు, యువత ఉపాధి అవకాశాలపై మాట్లాడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఇక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని, భయపెట్టే కొద్దీ తన సంకల్పం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పలువురు వ్యక్తులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. యువరాజ్యం రోజుల నుంచి తెలంగాణ యువత తనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొన్నామని అన్నారు. వేర్పాటువాదం దేశ సమగ్రతకు భంగం కలిగించనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చనీయాంశమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చని, కానీ తాము తెలంగాణలో పర్యటిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చని, గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, అదే విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశాలపై స్పందించాలని కోరారు. ఇక, పాశం యాదగిరిపై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాము దేశ పౌరులమని, పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎలాంటి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల కోసం గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.

Andhra Jyothy02 Jun, 11:39 am
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. హైదరాబాద్,జూన్02: తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌ కల్యాణ్ వివరించారు. తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చామన్నారు పవన్ కల్యాణ్. మీ తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదన్నారు. భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతులేపేది జనసేన పార్టీనే అని స్పష్టం చేశారు. ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్నారు. గుంటూరులో టీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణను తానెప్పుడు అవమానించాను? అని ఆయన స్థానిక నేతలను ప్రశ్నించారు. తన పీక కోసినా కూడా భయపడేది లేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని తెలిపారు. తనను ఎన్ని తిట్టినా పట్టించుకోనన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? అని రాజకీయ పార్టీల నాయకులను ఆయన సూటిగా నిలదీశారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందన్నారు. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారన్నారు. ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. సడెన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని.. అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా? అని ఆయన సూటిగా నిలదీశారు. తన ఫామ్‌హౌస్‌ కబ్జా అని తేలిస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు గద్దర్‌ తెలుసునన్నారు. గద్దర్‌ ఒంట్లో బుల్లెట్లు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని రాజకీయ పార్టీల నేతలను పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. గద్దర్‌ తమ పార్టీ కార్యాలయానికి వచ్చేవారని గుర్తు చేశారు. గద్దర్‌ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అంటూ తనను ప్రశ్నిస్తున్న నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలంటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Eenadu02 Jun, 11:28 am
మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా

హైదరాబాద్‌: తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని, అది రాజకీయాలకు అతీతమైందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను బెదిరించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఈ మధ్యన కొందరు నన్ను హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్‌.. ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నారు. అసలు మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి..? బెదిరించే వాళ్ల అయ్య జాగీరా.. తెలంగాణ. మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా.. అందుకే నా అడ్రస్‌ తెలియాలనే ఇంటి వద్ద ప్రెస్‌మీట్‌ పెట్టా. నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ. తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఆంధ్రాలో నన్ను తిరగనివ్వం అంటే వారాహి అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రజలే. నాకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు. జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం’’ ‘‘తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని మా నేతలు చాలా సార్లు అడిగారు. ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుతాను. నాకు అధికారంపై ప్రేమకాదు.. మార్పుపైనే ప్రేమ. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకుంటే ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదు. తెలంగాణ నలుమూలల నుంచి తిరిగిన వ్యక్తిని.. ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్లు ఆదిలాబాద్‌ అడవుల్లో తిరగలేదు.. నేను తిరిగాను’’ ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకిని కాదు.. విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకిని. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చాను. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పా. తెలంగాణ వ్యతిరేకం అని వైఎస్‌ చెప్పినా, ఆయనకు ఊడిగం చేశారు. బెదిరింపులకు లొంగిపోయేవాడిని కాదు.. నేను ఇప్పటివరకు ఒక్క తెలంగాణ నాయుకుడిని కూడా ఒక్క మాట అనలేదు. నాకు రెచ్చగొట్టడం ఇష్టంలేదు.. ఎన్నోసార్లు తగ్గి ఉన్నా. గద్దర్‌ బతికున్న రోజుల్లో మీరంతా ఎక్కడ ఉన్నారు? గద్దర్‌ వచ్చి తనకు బండి కొనివ్వాలంటే రెండు రోజుల్లో కొనిచ్చాను. గద్దర్‌ బతికి ఉన్న రోజుల్లో ఆయనకు మీరు ఏం చేశారు?ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైంది. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం నాకు మొదట్లో తెలియదు. నాకు తెలిశాక కేసులు వద్దు వదిలేయమని చెప్పా. ఆ తర్వాత ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టి నన్ను తిట్టారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రావారే కారణమా’’ ‘‘ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మర్రి చెన్నారెడ్డి వల్లే సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చింది. తెలుగు ప్రజలు 50 ఏళ్లు కలిసి ఉన్న రాజధాని.. హైదరాబాద్‌. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను ఉరితీసినా ఫర్వాలేదు. పాలకులు వేరు.. ప్రజలు వేరు.. పాలకులను తిట్టండి.. ప్రజలను కాదు. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారు. అక్కడకి ప్రజలు మన తెలుగు ప్రజల్ని పంపిస్తే మన పరిస్థితి ఏమిటి? నేను చెరువును ఆక్రమించుకున్నాననే ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గారికి చెబుతున్నా.. ఒకవేళ నేను కబ్జా చేశానని నిరూపణ అయితే, స్వాధీనం చేసుకోండి. కేసీఆర్‌ బీఆర్‌ఎస్ పెట్టి.. ఏపీకి వచ్చినప్పుడు స్వాగతించా. జనసేన మాజీ నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నా స్వాగతించా. కేవలం 2వేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వరా? విశ్లేషకులు ఇష్టానుసారం మాట్లాడినా మా అభిప్రాయం చెప్పకూడదా? ఇలాంటి విశ్లేషకుల వల్లే కమ్యూనిజం చచ్చిపోయింది’’ ‘‘ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు గనక చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేం ఇక్కడ పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో నేనే తిరుగుతాను. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. మీరు బెదిరిస్తే భయపడం. తెలంగాణను వ్యతిరేకించిన వారే పదవుల్లో కూర్చొన్నారు. వ్యతిరేకించినవారే ఎమ్మెల్యేలు అయ్యారు’’ అని పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

10TV Telugu02 Jun, 11:26 am
మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడారు. హైదరాబాద్ లో పవన్ కు ఏం పని? అని కొందరు వ్యక్తులు పదే పదే బెదిరిస్తున్నారు.. మీరెవరు నన్ను బెదిరించటానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కల్యాణ్ ఎదురు దాడికి దిగారు. తెలంగాణలో బెదిరింపుల కంటే ఏపీలో బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. ఏపీలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వం అంటే తెలంగాణ జనసైనికులు నాకు అండగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే అధికారం కోరుకోని వాడిని, తెలంగాణలో కోరుకుంటానా? ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. మీరు సమస్యల మీద పోరాడండి అని మా పార్టీ నాయకులను కోరా. మాట్లాడితే ఆంధ్రా అంటున్నారు. హైదరాబాద్ లో ఏం పని? అంటున్నారు. హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. మీరెవరు నన్ను బెదిరించటానికి? మీ అయ్య జాగీరా తెలంగాణ? నాకు తెలంగాణలో కంటే ఆంధ్రలో బెదిరింపులు ఎక్కువ. ఆంధ్రలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకిక్కడ కొత్తగా బాగుకునేది ఏమీ లేదు. బెదిరించే వాళ్లకు అందరికీ చెబుతున్నా.. నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా రండి.. ఇదే నా ఇంటి అడ్రస్. మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఎలాంటి భయాలు లేవు. బాంచన్ కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతా? భయపడే వాళ్లమే అయితే పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో నేను తెలంగాణ నాయకులను ఒక్క మాట కూడా అనలేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Oneindia Telugu02 Jun, 11:21 am
తెలంగాణతో బంధం కొత్తదేం కాదు..! ఆ గొంతుకలు..పవన్ కామెంట్స్

జనసేన పార్టీని తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లోనే స్థాపించామని, తెలంగాణ మీద తమ పార్టీకి ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. తన చుట్టు పక్కల ఉన్న నాయకులంతా 2007-08 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న నాయకులే అన్నారు. ఈ రోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ తనది కాదన్నారు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాక ముందే ఇక్కడి సంస్కృతి, పోరాట స్ఫూర్తి నుంచి ఉత్తేజం పొందామని, సినిమాలు, సంస్కృతి పరంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఇవాళ తమను విమర్శించే గొంతులు 2007లో లేవన్నారు. తాను తెలంగాణ నలుమూలలా పెరిగిన వాడిని, వెళ్లిన వాడిని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పోరేషన్లలో మువ్వన్నెల జెండా తాము ఎగురవేశామన్నారు. ఇది కొత్తగా వచ్చిన ప్రేమ కాదన్నారు. ఆదిలాబాద్ జిల్లాల్లో, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు తనను విమర్శిస్తున్న నాయకులు ఎప్పుడూ తిరగలేదన్నారు. ఆదిలాబాద్ గోండు తండాల్లో, గెలుస్తానో లేదో తిరగని పరిస్ధితుల్లో తాను తిరిగామన్నారు. ఓట్లు పడతాయని కాదని, తనకు తెలంగాణ అంటే ఇష్టమన్నారు. తెలంగాణపై తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. సామాజిక తెలంగాణలో అన్ని కులాలు బాగుండాలని చెప్పి మరీ వచ్చామన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ, ఆంధ్రను విభజించిన తీరు తప్పని మాత్రమే చెప్పానన్నారు. తెలంగాణ సంస్కృతీ, ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ తాను వ్యతిరేకం కాదన్నారు.

10TV Telugu02 Jun, 10:54 am
పవన్ కల్యాణ్ ని బలి చేయకండి, పవన్ కు రాజకీయాలు తెలీదు- అద్దంకి దయాకర్

Addanki Dayakar – Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. పవన్ ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇవ్వడం కుదరదని అద్దంకి దయాకర్ తేల్చి చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో మీటింగ్ పెడతామంటే పర్మిషన్ ఇస్తామన్న అద్దంకి దయాకర్.. కుట్రతో పర్మిషన్ అడిగితే అనుమతి ఇవ్వము అని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు, కుట్ర పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కాగా, గతంలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర చేస్తామంటే పర్మిషన్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ తన స్వార్థం కోసం పవన్ కల్యాణ్ ని బలి చేయొద్దని అద్దంకి దయాకర్ కోరారు. పవన్ కల్యాణ్ కి రాజకీయాలు ఏమీ తెలియవన్నారు. ”చేగువేరా వారసుడిగా చెప్పుకుంటూ సనాతనం కోసం పాటుపడే వ్యక్తి పవన్. పవన్ రాజకీయాలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ తెలంగాణ అని మోదీ అంటే మేం అర్థం చేసుకోలేకపోయాం. మోదీ ఓట్ల మ్యాజిక్ తో గెలవగలరు. ప్రజలను గెలవలేరు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినని వ్యక్తి పవన్. జూన్ 2న పవన్ మీటింగ్ ఎందుకోసం పెట్టారో తెలియదా? బీజేపీ అనుకూల రాజకీయాలు చేసేందుకు బీఆర్ఎస్ స్పాన్సర్ చేస్తున్న కార్యక్రమమే పవన్ మీటింగ్. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసే పవన్ ను తెరపైకి తెచ్చాయి. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టే వాళ్ళు మా వ్యతిరేకులే. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడితే ఊరుకోము. బీజేపీ నేతలు నల్లి కుంట్లోళ్ళు . తెలంగాణపై ఇంత దాడి జరిగితే కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తెలంగాణపై బీజేపీ నిలువెల్లా విషం కక్కుతోంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానంటేనే మోదీతో రేవంత్ కలుస్తారు. సుష్మా స్వరాజ్ అంటే మోదీకి ఇష్టం ఉండదు” అని అద్దంకి దయాకర్ అన్నారు. Also Read: తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ తను చెప్పుకోవాలి

Andhra Jyothy02 Jun, 05:04 am
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడినా.. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే అని సీఎం అన్నారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి: చంద్రబాబు ‘తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా... తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి’ అంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: పవన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారినవర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి