ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్లో మంగళవారం (జూన్ 2) పవన్ కల్యాణ్ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో పోలీసులు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ అంశాన్ని ప్రస్తావించకుండా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "అదృష్టమనేది అందరినీ వరించదు. కొందరు అవిశ్రాంతంగా శ్రమించి, వైఫల్యాలను చవిచూసి, తిరిగి పుంజుకుని విజయాన్ని సాధిస్తారు. అలాంటి విజయం సాధారణమైనది కాదు.. అదో చరిత్రగా నిలిచిపోతుంది.. అదే పవన్ కళ్యాణ్ కథ. అధికారులు గానీ, ప్రతిపక్షం గానీ దానిని అణచివేసేందుకు ప్రయత్నించినప్పుడు, అది ఆయనకు అతిపెద్ద విజయంగా మారుతుంది. ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే." అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణకు కారణాలు..మరోవైపు జూన్ రెండో తేదీ మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ రెండో తేదీ సంధ్య కన్వెన్షన్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ 2 వేల మందితో సమావేశం నిర్వహణకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి అనుమతి కోరినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై కేసులు, దీంతో తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్తత, కొంతమంది ఏపీ నేతల వ్యాఖ్యలతో
Pawan Kalyan Hyderabad Meeting News
Latest updates from Telugu Digital news sources.

Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఓ రకంగా షాకిచ్చారు తెలంగాణ పోలీసులు.. హైదరాబాద్లో నిర్వహించనున్న జనసేన పార్టీ 'నవనిర్మాణ సంకల్ప సభ'కు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీంతో, ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ పాల్గొననున్న ఈ సభను గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేన నాయకత్వం 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అంతేకాకుండా జనసేన సాధక్ సమ్మేళనాన్ని కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ సభకు అనుమతి కోరుతూ జనసేన పార్టీ చేసిన దరఖాస్తును తెలంగాణ పోలీసులు తిరస్కరించినట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, అలాగే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రస్తుతం సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసుల నిర్ణయంపై జనసేన నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించుకునే హక్కు తమకు ఉందని, అవసరమైన అన్ని నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. సభకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జనసేన నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభ నిర్వహణపై తుది నిర్ణయం కోర్టు తీర్పుపై ఆధారపడి ఉండనుంది. జనసేన దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు అనుమతి లభిస్తే సభ యథావిధిగా నిర్వహించే అవకాశాలు