translateexpand_more

Abhishek Banerjee News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 06:29 am
బెంగాల్ లో మరో సంచలనం.. మమత వార్నింగ్ ఆడియో లీక్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల అభిషేక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో కోల్‌కతాలోని ఓ ప్రముఖ ప్రైవేటు

Andhra Jyothy31 May, 11:55 am
టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ

<p><strong>కోల్‌కతా: </strong>తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee)పై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తీవ్ర సంచలనమవుతోంది. బీజేపీ నేతలే తనను చంపేందుకు కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను తాజాగా బీజేపీ ఖండించింది. దాడి నిందితుల్లో అరెస్టయిన ఒక వ్యక్తికి టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మిత్రాతో సంబంధాలున్నాయని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. టీఎంసీలో అంతర్గత విభేదాలే దాడికి కారణంగా కనిపిస్తోందని అన్నారు. 'ఇది కేవలం ఒకే ఒక్క సంఘటనకు పరిమితమా? తృణమూల్ కాంగ్రెస్‌లో లోతైన వర్గ విభేదాలే కారణమా? జవాబులు కన్నా ప్రశ్నలే ఎక్కువ తలెత్తుతున్నాయి' అని ఆయన పేర్కొన్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మమతా బెనర్జీ తర్వాత టీఎంసీలో నెంబర్-2 గా పేరున్న అభిషేక్ బెనర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర అల్లర్లలో బాధితులైన కుటుంబాన్ని పరామర్శించడానికి శనివారంనాడు వెళ్లారు. ఆయనపై అకస్మాత్తుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడ్లు, రాళ్లు విసురుతూ దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దారు. భద్రతా సిబ్బంది ఆయనకు హెల్మెట్ పెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై టీఎంసీ విరుచుకుపడింది. బీజేపీ మండల అధ్యక్షుడు అభిజిత్ బిశ్వాస్ ఈ దాడికి నేతృత్వం వహించి అల్లరిమూకను రెచ్చగొట్టారంటూ అతని ఫోటోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విడుదల చేసింది. ఈ ఘటనకు బాధ్యత నుంచి ముఖ్యమంత్రి సువేందు అధికారి తప్పించుకోవచ్చేమో కానీ ఈ ఘటనపై తలెత్తిన ప్రశ్నల నుంచి తప్పించుకోలేరని విమర్శించింది. జనాగ్రహమే దాడికి కారణమని బీజేపీ చెబుతున్నప్పుడు ఘటనాస్థలిలో బీజేపీ నేత ఎందుకు ఉన్నారు? చురుకుగా ఎందుకు వ్యవహరించారు? అని వరుస ప్రశ్నలు గుప్పించింది.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #d20f0f">శశిథరూర్ స్పందన</span></strong></p><p>టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడిపై కాంగ్రెస్

Andhra Jyothy31 May, 10:50 am
నేనో రాజకీయ హింసా బాధితుణ్ని.. దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తనపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. బీజేపీ నేతలే తనపై దాడికి పాల్పడ్డారని.. ఆ పార్టీ రాజకీయ హింస, బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ బెనర్జీ.'రాహుల్ జీ.. మీ మద్దతుకు ధన్యవాదాలు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను నిలబెట్టేందుకు చేసే పోరాటంలో మనం ఐక్యంగా, దృఢంగా నిలబడదాం' అని బెనర్జీ పేర్కొన్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>విదేశాలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంలో తన పాత్రను వివరిస్తూ.. ఆపరేషన్ సిందూర్‌ సంబంధిత అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగంగా తాను 5 దేశాలలో పర్యటించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని ఈ సందర్భంగా అభిషేక్ అన్నారు. 'జాతీయవాద సంరక్షకులమని చెప్పుకునే వారు ప్రయోగించిన రాజకీయ హింసకు, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి నేడు నేను బాధితుడినయ్యాను' అని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను, అసమ్మతివాదులనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ఆ పార్టీకి మద్దతిచ్చిన వాళ్లనే దేశభక్తులుగా భావిస్తారని, వారికి వ్యతిరేకంగా ప్రశ్నించినవారిని లక్ష్యంగా చేసుకుంటారన్నారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా తాను ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సొరేన్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై కొందరు వ్యక్తులు దొంగ దొంగ అని అరుస్తూ దాడికి పాల్పడ్డారు. చొక్కా చించివేయడం సహా ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. పోలీసులు రంగంలోకి దిగి ఆయనకు హెల్మెట్‌ పెట్టి సురక్షిత ప్రదేశానికి తరలించారు. అయితే.. బీజేపీ నేతలే

Zee Telugu31 May, 08:56 am
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో టీఎంసీ ఎంపీపై దాడి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tmc mp kalyan Banerjee attacked by mob in Hooghly Kolkata: వెస్ట్ బెంగాల్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఒకవైపు మమత మేనల్లుడిపై సోరాన్ పూర్ లో గుడ్లు, రాళ్లతో దాడ ఘటనతో పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మరోవైపు దీనిపై మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఈ ప్రతీకార రాజకీయాలు మానుకొవాలన్నారు. ఇలాంటి దాడులు తమ ఆత్మస్థైర్యంను నీరుగార్చలేవన్నారు. ఇక అభిషేక్ బెనర్జీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన బెల్ వ్యూ ఆస్పత్రి సీఈవోపై మమతా ఫైర్ అయినట్లు ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. తన మేనల్లుడు క్రికెట్ హెల్మెట్ పెట్టుకొకుంటే తలపగిలి చనిపోయి ఉండేవాడని మమతా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారని,అవసరం అయితే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు తాము రెడీగా ఉన్నట్లు చెప్పారన్నారు. అభిషేక్ బెనర్జీకి ఏమైన జరిగితే దానికి బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ సైతం ఈ దాడులతో భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరో టీఎంసీ ఎంపీపై హుగ్లీలో దాడి జరిగింది. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఆయనపై కొంత

Oneindia Telugu31 May, 07:13 am
తృణమూల్ ఎంపీపై పిడిగుద్దులు

పశ్చిమ బెంగాల్&amp;zwnj;లో అధికార మార్పిడి చోటు చేసుకున్న తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయాలను పలుచోట్ల ధ్వంసం చేశారు రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. శనివారం తృణమూల్ లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీపై దాడి చోటు చేసుకుని 24 గంటలు కూడా గడవక ముందే అదే పార్టీకి చెందిన మరో ఎంపీపై ఇటువంటి ఘటనే సంభవించింది.తృణమూల్ సీనియర్ నాయకుడు, శ్రీరామ్ పూర్ లోక్ సభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీపై తాజాగా హుగ్లీ జిల్లాలో దాడి జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడి, పార్టీ నాయకులు, కార్యకర్తల అరెస్టులకు నిరసనగా చేపట్టిన ప్రదర్శన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిరసనల్లో భాగంగా నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి వ్యతిరేక నినాదాలు చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకన్నారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట జరిగింది. మొదట ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరిగింది. ఇది దాడికి దారితీసింది.తమ పార్టీ నాయకులను విడుదల చేయాలంటూ హుగ్లీ జిల్లా పరిధిలోని చండితాల పోలీస్ స్టేషన్&amp;zwnj;లో వినతిపత్రం అందించడానికి వెళ్తోన్న సమయంలో బీజేపీ నాయకులు ఆయనపై దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. చోర్.. చోర్ అంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ కు సమీపించినప్పుడు కల్యాణ్ బెనర్జీ, ఆయన అనుచరులు, టీఎంసీ కార్యకర్తలను కొందరు బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఆయనను చుట్టుముట్టారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పిడిగుద్దులు గుద్దారు. కిందికి తోసివేశారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు తక్షణమే జోక్యం చేసుకున్నారు. వారిని విడిపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకులు తనపై రాళ్లు

AP7AM31 May, 02:26 am
నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసలో బాధిత సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై స్థానికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఇది బీజేపీ పన్నిన పక్కా ప్రణాళిక అని టీఎంసీ ఆరోపించింది. టీఎంసీ పాలనపై ప్రజాగ్రహమే కారణమని బీజేపీ అంటోంది.అసలేం జరిగింది?సోనార్‌పూర్‌లోని కమ్రాబాద్ ప్రాంతానికి అభిషేక్ బెనర్జీ మోటార్ సైకిల్‌పై వస్తున్న సమాచారం అందుకున్న వందలాది మంది స్థానికులు గుంపుగా చేరారు. ఆయన రాగానే చుట్టుముట్టి 'చోర్ చోర్' (దొంగ) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు సైతం చీపుర్లు, వెదురు కర్రలతో నిరసనకు దిగారు. కొంతమంది ఆందోళనకారులు అభిషేక్‌పై రాళ్లు, గుడ్లు, చెప్పులు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తోపులాటలో ఆయన చొక్కా చిరిగిపోగా, కళ్లద్దాలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు హెల్మెట్ ఇచ్చి.. మానవహారంగా ఏర్పడి అతికష్టం మీద అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాడిలో గాయపడిన అభిషేక్‌ను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ థెరపీ యూనిట్ (ఐటీయూ)లో చేర్పించి చికిత్స అందించారు.బీజేపీ కుట్రే: అభిషేక్, మమతదాడి అనంతరం అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. "ఇది బీజేపీ స్పాన్సర్ చేసిన హత్యాయత్నం. నన్ను చంపడానికే ఈ దాడి చేశారు. హెల్మెట్ ఉండటం వల్లే నా ప్రాణాలు నిలిచాయి. మా పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా భద్రత

Zee Telugu31 May, 09:04 am
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మరో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tmc mp kalyan Banerjee attacked by mob in Hooghly Kolkata: వెస్ట్ బెంగాల్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఒకవైపు మమత మేనల్లుడిపై సోరాన్ పూర్ లో గుడ్లు, రాళ్లతో దాడ ఘటనతో పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మరోవైపు దీనిపై మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఈ ప్రతీకార రాజకీయాలు మానుకొవాలన్నారు. ఇలాంటి దాడులు తమ ఆత్మస్థైర్యంను నీరుగార్చలేవన్నారు. ఇక అభిషేక్ బెనర్జీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన బెల్ వ్యూ ఆస్పత్రి సీఈవోపై మమతా ఫైర్ అయినట్లు ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. తన మేనల్లుడు క్రికెట్ హెల్మెట్ పెట్టుకొకుంటే తలపగిలి చనిపోయి ఉండేవాడని మమతా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారని, అవసరం అయితే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు తాము రెడీగా ఉన్నట్లు చెప్పారన్నారు. అభిషేక్ బెనర్జీకి ఏమైన జరిగితే దానికి బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ సైతం ఈ దాడులతో భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరో టీఎంసీ ఎంపీపై హుగ్లీలో దాడి జరిగింది. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఆయనపై

Oneindia Telugu31 May, 05:37 am
మేనల్లుడికి ట్రీట్మెంట్ నిర్లక్ష్యం-ఆస్పత్రిపై మమత ఫైర్-రాహుల్ ఆఫర్

పశ్చిమబెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)పై బీజేపీ కార్యకర్తలు నిన్న చేసిన దాడి తర్వాత పరిస్ధితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. బీజేపీ దాడుల్లో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు సోనార్ పూర్ వెళ్లిన అభిషేక్ బెనర్జీపై పోలీసుల సమక్షంలో స్థానికుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వుతూ, బట్టలు చించేసి మరీ వెంబడించారు. వీరి దాడి నుంచి తప్పించుకునేందుకు అభిషేక్ తలకు హెల్మెట్ పెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు పోలీసుల సాయంతో బయటపడ్డ అభిషేక్ స్థానిక బెల్ వ్యూ ఆస్పత్రిలో చేరారు. అయితే బెల్ వ్యూ ఆస్పత్రిలోనూ అభిషేక్ కు చికిత్స అందించకుండా డిశ్చార్జ్ చేయాలంటూ బీజేపీ నేతలు ఫోన్లు చేయడంతో పరిస్ధితి మరింత ఉద్రిక్తంగా మారింది. తన మేనల్లుడు అభిషేక్ కు సరైన వైద్యం అందించకుండా డిశ్చార్జ్ చేసేందుకు ఆస్పత్రి చేస్తున్న ప్రయత్నాలపై మమతా బెనర్జీ సీఈఓ ప్రదీప్ టాండన్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తప్పుచేస్తున్నారని, గతంలో చేసిన సాయం మర్చిపోతున్నారని, దేవుడు మిమ్మల్ని క్షమించడని తెలిపారు. మీ అహంకారం గుర్తుంచుకుంటాం, బీజేపీ నుంచి అధికారం తమకు మారగానే మేం చేయాల్సింది చేస్తామని హెచ్చరికలు చేశారు. మరోవైపు బెల్ వ్యూ ఆస్పత్రిలో సరైన చికిత్స అందకపోవడంతో అభిషేక్ ను డిశ్చార్జ్ చేసి మమత తన ఇంటికి తీసుకెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అక్కడే ఆయనకు వ్యక్తిగత డాక్టర్ల సాయంతో చికిత్స అందిస్తున్నారు. అటు అభిషేక్ పై దాడి, సరైన చికిత్స అందించకపోవడంపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. మమతా బెనర్జీకి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. అవసరమైతే అభిషేక్ బెనర్జీకి హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తామని ఆఫర్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఇంట్లోనే అభిషేక్

AP7AM31 May, 05:13 am
బెంగాల్ లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అభిషేక్ పై దాడితో టీఎంసీకి కొత్త ఊపు

మూడున్నర దశాబ్దాల క్రితం తనపై జరిగిన దాడితో రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరిన మమతా బెనర్జీకి.. ఇప్పుడు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి మరో రాజకీయ పునరుజ్జీవానికి నాంది పలుకుతుందా? ఎన్నికల ఓటమి, అంతర్గత సంక్షోభంతో బలహీనపడిన తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) ఇది కొత్త మలుపు అవుతుందా? అనే చర్చ బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత సంక్షోభంలో ఉన్న టీఎంసీకి ఈ ఘటన పెను షాక్‌కు గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. లైవ్ కెమెరాల ముందే ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో విరుచుకుపడ్డారు. హెల్మెట్ ఉండటంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత అభిషేక్ వీల్‌చైర్‌పై ఆసుపత్రిలో ఉనన దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.ఈ కష్టకాలంలో మమతా బెనర్జీకి 'ఇండియా' కూటమి నుంచి అనూహ్య మద్దతు లభించింది. గతంలోని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పలువురు జాతీయ నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా మమతకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఖండించారు. అవసరమైతే అభిషేక్‌కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇది బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్‌కతాకు వచ్చి మరీ మమతను పరామర్శించారు. అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్

AP7AM30 May, 02:03 pm
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర నిరసన సెగ తగిలింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో శనివారం ఆయనపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో, ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించి తనను తాను కాపాడుకోవాల్సి వచ్చింది.అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధితుడైన ఓ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం సోనార్‌పూర్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో కమల్ గాజీ వద్ద కొంతమంది మహిళలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అనంతరం సోనార్‌పూర్ చేరుకోగానే వందలాది మంది స్థానికులు, మహిళలు ఆయన్ని చుట్టుముట్టి "దొంగ" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ క్రమంలో, అభిషేక్ తన కారు దిగి, ఓ స్థానిక టీఎంసీ కార్యకర్త బైక్‌పై గమ్యస్థానానికి చేరేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు మరింత ఆగ్రహంతో ఆయనపైకి దూసుకొచ్చారు. కొందరు మహిళలు ఆయనపై చేయి చేసుకోగా, మరికొందరు చొక్కా చించివేశారు. ఆయనపైకి కోడిగుడ్లు విసరడంతో, వెంటనే ఆయన తలకి క్రికెట్ హెల్మెట్ పెట్టుకున్నారు. కొందరు రాళ్లు విసిరినప్పటికీ అవి ఆయనకు తగల్లేదు.ఈ ఘటనపై అభిషేక్ తీవ్రంగా స్పందించారు. "ఇది బీజేపీ గూండాల పనే. నా తల హెల్మెట్ వల్ల సురక్షితంగా ఉంది. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందా? నేను దాడికి గురవుతున్నప్పుడు పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తా, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తా" అని ఆయన అన్నారు. మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత అభిషేక్

TeluguOne31 May, 10:22 am
బెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత...టీఎంసీ ఎంపీపై దాడి తలకు తీవ్ర గాయం

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి. రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆదివారం (మే 31) హుగ్లీ జిల్లాలోని చండితాల పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతం ఒక్కసారిగా రణరంగమైంది. టీఎంసీ నాయకులు, కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట టీఎంసీ శ్రేణులు భారీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్తా కొద్దిసేపట్లోనే పరస్పర దాడులకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న క్రమంలో అక్కడే ఉన్న టీఎంసీ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణల్లో ఆయన తలకు బలమైన గాయం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. బెంగాల్ రాజకీయాల్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు కీలకమైన టీఎంసీ ఎంపీలపై వరుస దాడులు జరగడం ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితిని కళ్ళకు కడుతోంది. శనివారం నాడే టీఎంసీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీపై సోనాపూర్‌లో కొందరు దుండగులు కోడిగుడ్లు, టమాటాలతో దాడికి తెగబడ్డారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అభిషేక్ బెనర్జీకి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘోర పరాభవం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే,

AP7AM31 May, 07:22 am
బెంగాల్ లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై దాడులు కలకలం రేపుతున్నాయి. పార్టీలో కీలక నేత అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే, ఈ ఉదయం మరో ఎంపీ సొంత నియోజకవర్గంలోనే దాడికి గురయ్యారు.వివరాల్లోకి వెళితే.. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే కొందరు ఆయన తలపై కొట్టారు. ఈ అనూహ్య పరిణామంతో ఆయన తల పట్టుకుని కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.దాడికి ముందు కొందరు వ్యక్తులు కల్యాణ్ బెనర్జీకి నల్ల జెండాలు చూపిస్తూ 'చోర్ చోర్' (దొంగ దొంగ) అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీ పర్యటనలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆయన పర్యటనలోనూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు చేశారు.రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక టీఎంసీ నేతలపై ఒకే తరహాలో దాడులు, నిరసనలు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Andhra Jyothy25 May, 01:21 pm
Home » National » Police deployment outside Abhishek Banerjee Kolkata residence days after KMC notices over properties AVR...

Home » National » Police deployment outside Abhishek Banerjee Kolkata residence days after KMC notices over properties AVR ABN , Publish Date - May 25 , 2026 | 06:51 PM తృణమూల్ కాంగ్రెస్‌లో నెంబర్-2గా ఉన్న ఆ పార్టీ డైమ...

AP7AM30 May, 03:06 pm
మేనల్లుడిపై దాడి... బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం

పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపించారు.శనివారం సాయంత్రం మమతా బెనర్జీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "పాలకులు హంతకులుగా మారారు. బీజేపీ సిగ్గుపడాలి" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆమె తన పోస్టులో పంచుకున్నారు. ఎన్నికల హింసలో ప్రాణాలు కోల్పోయిన సంజూ కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్‌పై బీజేపీ మద్దతు ఉన్న దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది.ఈ దాడిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతకు ఉద్దేశపూర్వకంగానే సరైన పోలీస్ భద్రత కల్పించలేదని, ఇది బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించాలని, ఇలాంటి దాడులను నివారించాలని ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. టీఎంసీ కీలక నేతపై జరిగిన ఈ దాడి, బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం ద్వేషపూరిత, హింసాత్మక రాజకీయాలు మాత్రమే చేయగలదని నిరూపించిందన్నారు. సున్నితమైన వాతావరణంలో పోలీసుల గైర్హాజరు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

Samayam Telugu30 May, 01:15 pm
బెంగాల్ లో ఉద్రిక్తత.. మమతా బెనర్జీ మేనల్లుడిపై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లతో దాడి

పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో శనివారం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల అనంతర హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా ఆయనపై గుడ్లు, రాళ్లు విసిరారు. ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా 'దొంగ దొంగ' అని నినాదాలు చేశారు. ఈ దాడి నుంచి అభిషేక్‌కు కాపాడేందుకు భద్రత సిబ్బంది తమ హెల్మెట్ ఇచ్చి రక్షణగా నిలిచారు. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది. అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా సిబ్బంది ఆయనను చుట్టుముట్టి రక్షణగా నిలుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ ఘటన అనంతరం అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..ఈ దాడిని బీజేపీయే ప్రోత్సహించిందని ఆరోపించారు. ‘ఇదంతా బీజేపీయే ప్రోత్సహించింది. వాళ్లు ఏం చేశారో చూడండి. ఇదేనా వాళ్ల ప్రజాస్వామ్యానికి ఉదాహరణ. నెల కూడా కాలేదు, పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు’’ అని ఆయన అన్నారు. దాడి చేసినవారు తనను చంపడానికే వచ్చారని ఆరోపించిన బెనర్జీ.. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయిందని పేర్కొన్నారు. ‘‘వారు నన్ను చంపాలనుకున్నారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. మేము ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తప్పకుండా తీసుకువస్తాం... గవర్నర్‌కు కూడా తెలియజేస్తాం.. నేను తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాను’’ అని ఆయన అన్నారు.తాను తృటిలో తీవ్ర గాయాల నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ‘‘నా తలకు గాయంకాకుండా తప్పించుకున్నారు.. అదృష్టవశాత్తు, నేను హెల్మెట్ ధరించాను.. వారు నా బట్టలు చించి, నా కళ్లజోడు పగలగొట్టారు’’ అని తెలిపారు. అంతేకాదు, ‘‘ఘటనా స్థలంలో పోలీసుల ఉనికి లేదు. వారు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. చంపనివ్వండి.. నేను చావనైనా చస్తాను కానీ ఇక్కడ నుంచి కదలను’’ అని

Sakshi31 May, 02:52 pm
దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ .. అభిషేక్ బెనర్జీపై దాడి చేసింది ఎవరో కాదు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసరడంతో కలకలం చెలరేగింది. నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకించారు. అభిషేక్‌ బెనర్జీపై జరిగిన దాడి కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో

10TV Telugu30 May, 05:43 pm
మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడిపై దాడి.. రాళ్లు, గుడ్లు, చెప్పులతో అటాక్

Abhishek Banerjee Attacked: వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీపై దాడి జరిగింది. రాళ్లు, కోడి గుడ్లు, చెప్పులతో ఆయన పై అటాక్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు ఎంపీ అభిషేక్ బెనర్జీ సోనార్ పూర్ కు వెళ్లారు. ఈ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానికులు తిరగబడ్డారు. కోపంతో ఊగిపోయారు. అభిషేక్‎పై దాడి చేశారు. రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఆయన చొక్కా పట్టుకుని లాగారు. కొందరు చేయి చేసుకున్నారు. అభిషేక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడి నుంచి కాపాడుకునేందుకు అభిషేక్ బెనర్జీ క్రికెట్ ప్లేయర్లు వాడే హెల్మెట్ ధరించాల్సి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆయన సిబ్బంది.. అభిషేక్ ను చుట్టుముట్టి రక్షణగా నిలిచారు. స్థానికుల దాడితో అభిషేక్ బెనర్జీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమని ఆయన ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు. వాళ్లు తనను చంపేందుకు ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి సమయంలో పోలీసులు అక్కడ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తానని అభిషేక్ బెనర్జీ తెలిపారు. అదృష్టవశాత్తూ హెల్మెట్ ధరించడం వల్ల తన తలకు ఏమీ కాలేదన్నారు. తన బట్టలు చించి, కళ్లజోడు పగలగొట్టారని వాపోయారు. దాడిలో గాయపడ్డ అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి అభిషేక్‎ను పరామర్శించారు. అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి

Oneindia Telugu30 May, 02:20 pm
మమతా మేనల్లుడిపై దాడి.. చొక్కా చింపి.. కాళ్లతో తన్నుతూ

పశ్చిమ్ బెంగాల్ లో షాకింగ్ ఘటన జరిగింది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాకాండలో బాధిత కార్మిక కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దొంగ దొంగ అంటూ నినాదాలు చేస్తూ చొక్కా చింపి.. కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షణకోసం హెల్మెట్ ధరించినా దాన్ని తీసేసి దాడికి పాల్పడ్డారు దుండగులు. అభిషేక్ బెనర్జీ బెంగాల్ లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని సోనార్ పూర్ లో పర్యటించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం ప్రజలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని.. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని.. రోడ్లు వేయలేదని.. డబ్బంతా దోచుకున్నారని ఆరోపించారు. అందుకే తాము ఆగ్రహంతో ఉన్నామని ప్రజలు తెలిపారు. మరోవైపు తనపై జరిగిన దాడికి బీజేపీ ప్రభుత్వం కారణం అని ఎంపీ అభిషేక్ బెనర్జీ కీలక ఆరోపణలు చేశారు. తనకు జరిగిందంతా ప్రజలు చూశారని.. దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు లేరని అన్నారు. ఇది బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. ఈ ఘటన మొత్తం స్థానికంగా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిందని.. ఈ ఘటనపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. అలాగే గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం.. మేమే దాడి చేశామని.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు. ఇక సోనార్ పూర్ లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై