translateexpand_more

Trinamool Congress News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 10:48 am
బీజేపీ 'ఆట'కు మమత ఊహించని చెక్, సంచలన నిర్ణయం

బెంగాల్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ టీఎంసీ లక్ష్యంగా పావులు కదుపుతోంది. వరుస దెబ్బలతో టీఎంసీ ఆత్మరక్షణలో పడింది. తాజాగా మమతా ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మమతా తీసుకున్న ఊహించని నిర్ణయం సంచలనంగా మారుతోంది.మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యక్రమాలు సాగిస్తుండటం, ప్రకటనలు ఇస్తుండటంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐటీసీ క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుందని రెండు వేర్వేరు నోటీసుల్లో టీఎంసీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అయితే ఎమ్మెల్యేలు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనేది ఆ నోటీసులో పేర్కొనలేదు. ఏపీ నుంచి BJP రాజ్యసభ అభ్యర్దిగా.. TDP నో అనే ఛాన్స్ లేకుండా..!!కఠినంగానే వ్యవహరించాలని మమతా నిర్ణయం కాగా, పార్టీ నుంచి తమను బహిష్కరించడంపై సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలు స్పందించాల్సి ఉంది. తాజాగా మమతాబెనర్జీ నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి గైర్హాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో సందీపన్ సహా, రితబ్రత బెనర్జీ ఉన్నారు. సరైన విధివిధానాలు లేకుండా సమావేశం జరిపినట్టు సందీపన్ బహిరంగ ప్రకటన చేయడంతో పాటు, నకిలీ సంతకాల కేసులో అభిషేక్ బెనర్జీపై కూడా ప్రశ్నలు గుప్పించారు.

Andhra Jyothy31 May, 10:50 am
నేనో రాజకీయ హింసా బాధితుణ్ని.. దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ

<p><strong><span style="color: #ff0000">ఇంటర్నెట్ డెస్క్: </span></strong>పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తనపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. బీజేపీ నేతలే తనపై దాడికి పాల్పడ్డారని.. ఆ పార్టీ రాజకీయ హింస, బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ బెనర్జీ.'రాహుల్ జీ.. మీ మద్దతుకు ధన్యవాదాలు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను నిలబెట్టేందుకు చేసే పోరాటంలో మనం ఐక్యంగా, దృఢంగా నిలబడదాం' అని బెనర్జీ పేర్కొన్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>విదేశాలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంలో తన పాత్రను వివరిస్తూ.. ఆపరేషన్ సిందూర్‌ సంబంధిత అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగంగా తాను 5 దేశాలలో పర్యటించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని ఈ సందర్భంగా అభిషేక్ అన్నారు. 'జాతీయవాద సంరక్షకులమని చెప్పుకునే వారు ప్రయోగించిన రాజకీయ హింసకు, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి నేడు నేను బాధితుడినయ్యాను' అని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను, అసమ్మతివాదులనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ఆ పార్టీకి మద్దతిచ్చిన వాళ్లనే దేశభక్తులుగా భావిస్తారని, వారికి వ్యతిరేకంగా ప్రశ్నించినవారిని లక్ష్యంగా చేసుకుంటారన్నారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా తాను ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సొరేన్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై కొందరు వ్యక్తులు దొంగ దొంగ అని అరుస్తూ దాడికి పాల్పడ్డారు. చొక్కా చించివేయడం సహా ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. పోలీసులు రంగంలోకి దిగి ఆయనకు హెల్మెట్‌ పెట్టి సురక్షిత ప్రదేశానికి తరలించారు. అయితే.. బీజేపీ నేతలే

AP7AM31 May, 02:26 am
నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసలో బాధిత సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై స్థానికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఇది బీజేపీ పన్నిన పక్కా ప్రణాళిక అని టీఎంసీ ఆరోపించింది. టీఎంసీ పాలనపై ప్రజాగ్రహమే కారణమని బీజేపీ అంటోంది.అసలేం జరిగింది?సోనార్‌పూర్‌లోని కమ్రాబాద్ ప్రాంతానికి అభిషేక్ బెనర్జీ మోటార్ సైకిల్‌పై వస్తున్న సమాచారం అందుకున్న వందలాది మంది స్థానికులు గుంపుగా చేరారు. ఆయన రాగానే చుట్టుముట్టి 'చోర్ చోర్' (దొంగ) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు సైతం చీపుర్లు, వెదురు కర్రలతో నిరసనకు దిగారు. కొంతమంది ఆందోళనకారులు అభిషేక్‌పై రాళ్లు, గుడ్లు, చెప్పులు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తోపులాటలో ఆయన చొక్కా చిరిగిపోగా, కళ్లద్దాలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనకు హెల్మెట్ ఇచ్చి.. మానవహారంగా ఏర్పడి అతికష్టం మీద అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాడిలో గాయపడిన అభిషేక్‌ను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ థెరపీ యూనిట్ (ఐటీయూ)లో చేర్పించి చికిత్స అందించారు.బీజేపీ కుట్రే: అభిషేక్, మమతదాడి అనంతరం అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. "ఇది బీజేపీ స్పాన్సర్ చేసిన హత్యాయత్నం. నన్ను చంపడానికే ఈ దాడి చేశారు. హెల్మెట్ ఉండటం వల్లే నా ప్రాణాలు నిలిచాయి. మా పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా భద్రత

AP7AM31 May, 05:13 am
బెంగాల్ లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అభిషేక్ పై దాడితో టీఎంసీకి కొత్త ఊపు

మూడున్నర దశాబ్దాల క్రితం తనపై జరిగిన దాడితో రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరిన మమతా బెనర్జీకి.. ఇప్పుడు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి మరో రాజకీయ పునరుజ్జీవానికి నాంది పలుకుతుందా? ఎన్నికల ఓటమి, అంతర్గత సంక్షోభంతో బలహీనపడిన తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) ఇది కొత్త మలుపు అవుతుందా? అనే చర్చ బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత సంక్షోభంలో ఉన్న టీఎంసీకి ఈ ఘటన పెను షాక్‌కు గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. లైవ్ కెమెరాల ముందే ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో విరుచుకుపడ్డారు. హెల్మెట్ ఉండటంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత అభిషేక్ వీల్‌చైర్‌పై ఆసుపత్రిలో ఉనన దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.ఈ కష్టకాలంలో మమతా బెనర్జీకి 'ఇండియా' కూటమి నుంచి అనూహ్య మద్దతు లభించింది. గతంలోని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పలువురు జాతీయ నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా మమతకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఖండించారు. అవసరమైతే అభిషేక్‌కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇది బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్‌కతాకు వచ్చి మరీ మమతను పరామర్శించారు. అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్

AP7AM30 May, 02:03 pm
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర నిరసన సెగ తగిలింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో శనివారం ఆయనపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో, ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించి తనను తాను కాపాడుకోవాల్సి వచ్చింది.అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధితుడైన ఓ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం సోనార్‌పూర్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో కమల్ గాజీ వద్ద కొంతమంది మహిళలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అనంతరం సోనార్‌పూర్ చేరుకోగానే వందలాది మంది స్థానికులు, మహిళలు ఆయన్ని చుట్టుముట్టి "దొంగ" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ క్రమంలో, అభిషేక్ తన కారు దిగి, ఓ స్థానిక టీఎంసీ కార్యకర్త బైక్‌పై గమ్యస్థానానికి చేరేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు మరింత ఆగ్రహంతో ఆయనపైకి దూసుకొచ్చారు. కొందరు మహిళలు ఆయనపై చేయి చేసుకోగా, మరికొందరు చొక్కా చించివేశారు. ఆయనపైకి కోడిగుడ్లు విసరడంతో, వెంటనే ఆయన తలకి క్రికెట్ హెల్మెట్ పెట్టుకున్నారు. కొందరు రాళ్లు విసిరినప్పటికీ అవి ఆయనకు తగల్లేదు.ఈ ఘటనపై అభిషేక్ తీవ్రంగా స్పందించారు. "ఇది బీజేపీ గూండాల పనే. నా తల హెల్మెట్ వల్ల సురక్షితంగా ఉంది. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందా? నేను దాడికి గురవుతున్నప్పుడు పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తా, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తా" అని ఆయన అన్నారు. మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత అభిషేక్

Andhra Jyothy02 Jun, 03:03 am
వసూలు చేసిన డబ్బు వెనక్కి.. ప్రజాగ్రహంతో తృణమూల్ నేతల కీలక నిర్ణయం

<p>పశ్చిమబెంగాల్‌లో పదిహేనేళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ఎన్నో అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది. ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి తృణమూల్ నేతలు, కార్యకర్తలు 'కట్ మనీ' పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారం కోల్పోయింది. దీంతో తృణమూల్ అగ్ర నేతలపై కూడా ప్రజలు దాడులు చేస్తున్నారు (TMC cut money). </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈ దాడుల భయంతో కొందరు తృణమూల్ నేతలు ప్రజాగ్రహాన్ని చల్లబరిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాము వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చెయ్యాలని నిర్ణయించుకున్నారు. బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోని మాతాభంగాలోని తృణమూల్ నేతలు గతంలో తాము వసూలు చేసిన డబ్బును ప్రజలకు తిరిగి ఇచ్చేశారు. గ్రామస్తులను ఒక మైదానంలో సమావేశానికి పిలిచి, అక్కడ డబ్బులను పంపిణీ చేశారు (TMC leaders village protest). </p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p>కూచ్ బెహార్ జిల్లాలోని ఓ తృణమూల్ నేత గ్రామస్తుల నుంచి రూ.80 లక్షలు వసూలు చేశాడని (Cut money controversy), తాజగా అందులో సగం డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశాడని స్థానిక బీజేపీ నేత తెలిపారు. చాలా గ్రామాల్లో ఇలా 'కట్ మనీ'ని వెనక్కి ఇచ్చేశారట. ప్రజాగ్రహానికి భయపడి తృణమూల్ నేతలు బయటకు రాలేని చోట్ల.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు డబ్బును పంపిణీ చేశారట. ఈ పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. </p><br/><h2><span style="color: #f41010">ఇవి కూడా చదవండి.. </span></h2><p></p><p><a rel="" href="https://www.andhrajyothy.com/2026/international/usa/trump-hopes-israelhezbollah-ceasefire-will-last-forever-amid-middle-east-tensions-sgr-1528970.html"><span style="color: #f50a0a">ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్</span></a></p><p><br><a rel="" href="https://www.andhrajyothy.com/2026/business/gold-prices-in-india-today-latest-22k-24k-rates-on-june-2nd-2026-sgr-1528951.html"><span style="color: #f70808">బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..</span></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

Andhra Jyothy31 May, 03:10 pm
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో ట్విస్ట్

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో అరెస్టైన నిందితుల్లో కొందరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. వీరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పోలీసులు అరెస్టు చేసిన తపన్ మైతీ, ఆకాశ్.. ఎంపీ అభిషేక్‌పై దాడి వీడియోల్లో కనిపించినట్టు సమాచారం. వీరికి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న నిర్మాల్యా సేన్‌గుప్తా, కాజల్ దాస్, దేబాశిష్ దత్తా కూడా టీఎంసీ నేత లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, అకాశ్ స్థానికులకు టీఎంసీ కార్యకర్తగా పరిచయం. నిర్మాల్య సేన్ గుప్తాకు కూడా టీఎంసీతో సుదీర్ఘకాలంగా సంబంధం ఉందని తెలుస్తోంది.సేన్‌ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆయనకు 1998 నుంచి పార్టీతో అనుబంధం ఉందని తెలిపారు. ఈ దాడికి బీజేపీ కారణమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. మాజీ సీఎం మమత ఇంట్లో మీటింగ్.. ఎమ్మెల్యేల డుమ్మా? పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్

AP7AM31 May, 07:22 am
బెంగాల్ లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై దాడులు కలకలం రేపుతున్నాయి. పార్టీలో కీలక నేత అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే, ఈ ఉదయం మరో ఎంపీ సొంత నియోజకవర్గంలోనే దాడికి గురయ్యారు.వివరాల్లోకి వెళితే.. హుగ్లీ జిల్లాలోని చండీతాలలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ పర్యటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే కొందరు ఆయన తలపై కొట్టారు. ఈ అనూహ్య పరిణామంతో ఆయన తల పట్టుకుని కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.దాడికి ముందు కొందరు వ్యక్తులు కల్యాణ్ బెనర్జీకి నల్ల జెండాలు చూపిస్తూ 'చోర్ చోర్' (దొంగ దొంగ) అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీ పర్యటనలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆయన పర్యటనలోనూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు చేశారు.రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక టీఎంసీ నేతలపై ఒకే తరహాలో దాడులు, నిరసనలు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Andhra Jyothy30 May, 02:33 pm
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే

<p>ఇంటర్నెట్ డెస్క్: సోనార్‌పూర్‌లో (పశ్చిమబెంగాల్) టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం జరిగిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఖండించారు. రాజకీయ భేదాభిప్రాయాలున్నంత మాత్రాన హింసకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు టీఎంసీ ఎంపీ శనివారం సోనార్‌పూర్ వెళ్లిన సందర్భంగా కొందరు కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.</p><p>ఈ దాడిని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్ వేదికగా ఖండించారు. ఆయనకు తగినంత పోలీసు భద్రత లేకపోవడాన్ని బట్టి బీజేపీ రాజకీయాలు, ప్రతీకారాలను అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతిపక్ష నేతల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>మరోవైపు, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించారు. తాము ఎంతటి ద్వేషపూరిత రాజకీయాలకైనా దిగగలమని బీజేపీ ఈ దాడితో రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. సున్నిత ప్రాంతాల్లో కూడా పోలీసు భద్రత లేకపోవడం కుట్ర కోణాన్ని సూచిస్తోందని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. బీజేపీ కార్యకర్తలే అభిషేక్ బెనర్జీపై దాడికి దిగారని టీఎంసీ ఆరోపించింది.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong>ఈ వార్తలనూ చదవండి:</strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/dk-shivakumar-to-be-sworn-in-as-karnataka-cm-on-june-3rd-says-kc-venugopal-avr-1528185.html"><strong>డీకే ప్రమాణస్వీకారం తేదీ ఖరారు.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్</strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/army-chief-general-upendra-dwivedi-says-armed-forces-ready-for-operation-sindoor-20-avr-1528179.html"><strong>ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం... ఆర్మీ చీఫ్ ద్వివేది</strong></a></p>

Sakshi31 May, 02:52 pm
దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ .. అభిషేక్ బెనర్జీపై దాడి చేసింది ఎవరో కాదు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసరడంతో కలకలం చెలరేగింది. నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకించారు. అభిషేక్‌ బెనర్జీపై జరిగిన దాడి కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో

Andhra Jyothy31 May, 01:38 pm
మాజీ సీఎం మమత ఇంట్లో మీటింగ్.. ఎమ్మెల్యేల డుమ్మా

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసంలో తాజాగా ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది హాజరైనట్టు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు తృణమూల్ ఎంపీలపై దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది సమావేశానికి రావడంతో చివరకు మీటింగ్ రద్దైంది. ఇటీవలి ఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యేలు బిజీగా ఉండటంతో రాలేకపోయారని టీఎంసీ పేర్కొంది. పార్టీ నేత శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం మమత నివాసంలో ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలే హాజరుకావడంతో మీటింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. గైర్హాజరైన ఎమ్మెల్యేలను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదని సమాచారం. పార్టీ సీనియర్ నేతలు అనేక మంది ఈ సమావేశానికి రాలేదని తెలిసింది. అయితే, పార్టీలో కీలక నేతలుగా పేరున్న ఫర్హాద్ ఖాన్, నయన్ బంధోపాధ్యాయ్, మదన్ మిత్రా, అషిమా పాత్రా, కునాల్ ఘోష్ ఈ సమావేశానికి వచ్చినట్టు తెలిసింది. ఇటీవల ఎంపీలపై దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు బిజీగా ఉండి రాలేకపోయారని టీఎంసీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Oneindia Telugu30 May, 02:20 pm
మమతా మేనల్లుడిపై దాడి.. చొక్కా చింపి.. కాళ్లతో తన్నుతూ

పశ్చిమ్ బెంగాల్ లో షాకింగ్ ఘటన జరిగింది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాకాండలో బాధిత కార్మిక కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దొంగ దొంగ అంటూ నినాదాలు చేస్తూ చొక్కా చింపి.. కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. వారి నుంచి రక్షణకోసం హెల్మెట్ ధరించినా దాన్ని తీసేసి దాడికి పాల్పడ్డారు దుండగులు. అభిషేక్ బెనర్జీ బెంగాల్ లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని సోనార్ పూర్ లో పర్యటించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం ప్రజలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని.. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని.. రోడ్లు వేయలేదని.. డబ్బంతా దోచుకున్నారని ఆరోపించారు. అందుకే తాము ఆగ్రహంతో ఉన్నామని ప్రజలు తెలిపారు. మరోవైపు తనపై జరిగిన దాడికి బీజేపీ ప్రభుత్వం కారణం అని ఎంపీ అభిషేక్ బెనర్జీ కీలక ఆరోపణలు చేశారు. తనకు జరిగిందంతా ప్రజలు చూశారని.. దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు లేరని అన్నారు. ఇది బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. ఈ ఘటన మొత్తం స్థానికంగా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిందని.. ఈ ఘటనపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. అలాగే గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం.. మేమే దాడి చేశామని.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు. ఇక సోనార్ పూర్ లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై

AP7AM02 Jun, 03:08 am
టీఎంసీలో ముసలం.. ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘోర పరాజయం తర్వాత పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన నివాసం వద్ద నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అభిషేక్ ఫొటో ముసుగు ధరించిన ఓ వ్యక్తి, తాను బొగ్గు, కార్లు దొంగిలించానని, సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు కారణమయ్యానంటూ నకిలీ ఒప్పుకోలు వాంగ్మూలం ఇచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పడం కలకలం రేపింది.&nbsp;ఒకప్పుడు టీఎంసీ విజయానికి బ్లూప్రింట్‌గా భావించిన అభిషేక్ 'డైమండ్ హార్బర్ మోడల్' కుప్పకూలడమే ఈ ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఫల్తా అసెంబ్లీ స్థానంలో అక్రమాల ఆరోపణలతో ఎన్నికల సంఘం రీ-పోలింగ్ ఆదేశించింది. దీంతో టీఎంసీ అభ్యర్థి, అభిషేక్ సన్నిహితుడైన జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఓటమిని అభిషేక్ పతనానికి సంకేతంగా భావిస్తున్నారు. దీని తర్వాత డైమండ్ హార్బర్ మున్సిపాలిటీకి చెందిన తొమ్మిది మంది టీఎంసీ కౌన్సిలర్లు అవినీతిని నిరసిస్తూ రాజీనామా చేయడం కలకలం రేపింది.టీఎంసీ ఓటమికి అభిషేక్ బెనర్జీ, ఆయన అతిగా ఆధారపడిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కారణమంటూ పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఐప్యాక్ జోక్యంతో పార్టీలో కార్పొరేట్ సంస్కృతి పెరిగిపోయిందని, దశాబ్దాలుగా పనిచేస్తున్న క్షేత్రస్థాయి నేతలను పక్కన పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. 74 మంది సిట్టింగ్