
బెంగాల్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ టీఎంసీ లక్ష్యంగా పావులు కదుపుతోంది. వరుస దెబ్బలతో టీఎంసీ ఆత్మరక్షణలో పడింది. తాజాగా మమతా ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మమతా తీసుకున్న ఊహించని నిర్ణయం సంచలనంగా మారుతోంది.మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యక్రమాలు సాగిస్తుండటం, ప్రకటనలు ఇస్తుండటంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐటీసీ క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుందని రెండు వేర్వేరు నోటీసుల్లో టీఎంసీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అయితే ఎమ్మెల్యేలు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనేది ఆ నోటీసులో పేర్కొనలేదు. ఏపీ నుంచి BJP రాజ్యసభ అభ్యర్దిగా.. TDP నో అనే ఛాన్స్ లేకుండా..!!కఠినంగానే వ్యవహరించాలని మమతా నిర్ణయం కాగా, పార్టీ నుంచి తమను బహిష్కరించడంపై సందీపన్ సహా, రితబ్రత బెనర్జీలు స్పందించాల్సి ఉంది. తాజాగా మమతాబెనర్జీ నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి గైర్హాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో సందీపన్ సహా, రితబ్రత బెనర్జీ ఉన్నారు. సరైన విధివిధానాలు లేకుండా సమావేశం జరిపినట్టు సందీపన్ బహిరంగ ప్రకటన చేయడంతో పాటు, నకిలీ సంతకాల కేసులో అభిషేక్ బెనర్జీపై కూడా ప్రశ్నలు గుప్పించారు.











