translateexpand_more

Political Strategy News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 01:20 am
మహానాడు గ్రాండ్ సక్సెస్

తొలిసారి హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించిన మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భాగస్వాములందరికీ అభినందనలు.. 2న 'సర్'పై ఎమ్మెల్యేలకు అవగాహన అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): తొలిసారి హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించిన మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహానాడును సమర్థంగా నిర్వహించడంలో భాగస్వాములైన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు జోనల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్ముందు పార్టీ తరఫున నిర్వహించే భారీ కార్యక్రమాలకు మహానాడు-2026ను బెంచ్‌ మార్క్‌గా తీసుకోవాలని సూచించారు. ఏపీతో పాటు ఈసారి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహానాడు బాగా జరిగిందని నేతలు సీఎంకు వివరించారు. మహానాడులో తెలంగాణ టీడీపీ సీనియర్‌ నేత బక్కని నర్సింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఎంతో చరిత్ర, నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగుజాతి ఒక్కటేనని.. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని సీఎం వ్యాఖ్యానించారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ బలమైన కేడర్‌ ఉన్నారని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. మహానాడులో ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఎన్నికల సంఘం చేట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై అవగాహన కల్పించేందుకు జూన్‌ 2న టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ స్థాయిల్లోనూ నిర్దేశిత

AP7AM01 Jun, 12:54 pm
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ మతపరమైన విభజన, మతం అనే సౌధంపై నిలబడి ఉందని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ దండయాత్ర, జైత్రయాత్ర చేయబోతోందంటూ ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఇక్కడ వారు కొన్ని సీట్లు గెలవొచ్చేమో కానీ అధికారంలోకి రావడం మాత్రం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, అందువల్ల సీపీఐ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల వ్యూహాన్ని ప్రకటిస్తూ, పొత్తులు ఉంటే కనీసం 5 స్థానాల్లో, లేనిపక్షంలో కనీసం 15 నియోజకవర్గాల్లో పోటీ చేసేలా పార్టీ సన్నద్ధం కావాలని కూనంనేని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో బలమైన 40 నియోజకవర్గాలను గుర్తించామని, అక్కడ ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రత్యేక పాదయాత్రలు చేపడతామని వెల్లడించారు. ఈ యాత్రల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో పాటు స్థానిక సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా జూన్ 4న, ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జూన్ 15న ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, సెప్టెంబర్ 28న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

SkyC Media30 May, 06:43 am
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల నిన్న మే 29, 2026 నాడు ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీలోని 10 జనపథ్‌ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా YS షర్మిల రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సంస్థాగత విషయాలు మరియు భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఇరు నాయకులు చర్చించారు. వైఎస్ షర్మిల గత 2024 లో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరడం జరిగింది. ఆమె పార్టీలో చేరిన తర్వాత అధిష్టానం ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ఆమె రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైన స్థితిలో కొనసాగుతోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీకి చాలా తక్కువ సీట్లు మాత్రమే దక్కాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడంపై ఇరు నేతలు సుదీర్ఘంగా ఆలోచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరియు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా మాట్లాడారు. దీంతో పాటు పార్టీ అంతర్గత బలోపేతానికి తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై కూడా చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ నుంచి రాష్ట్ర రాజకీయాలపై తాను పలు ముఖ్యమైన సూచనలు తీసుకున్నట్లు షర్మిల స్వయంగా తన సోషల్ మీడియా పోస్ట్‌లో అధికారికంగా పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చే

TV9 Telugu31 May, 05:30 am
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత కొంత బలహీనపడింది. అయినా సరే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే వారంతా బీఆర్ఎస్‌లో చేరడంతో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. 2018లో కాంగ్రెస్‌, వామపక్షాలతో జతకట్టి పోటీ చేసినా బీఆర్ఎస్‌ ముందు నిలబడలేకపోయింది. 2023 ఎన్నికలను పెద్దగా పట్టించుకోనేలేదు. అలాంటి పార్టీని ఇప్పుడు మళ్లీ పైకి లేపేందుకు… తెలంగాణపై పసుపు జెండా ఎగరేసేందుకు అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మొన్నటి మహానాడు సాక్షిగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తామన్నారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌. మళ్లీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని ఏపీలో పవర్ షేరింగ్‌ అందుకున్న జనసేన కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2నే హైదరాబాద్‌లో తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్‌ మీటింగ్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి లాంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా జనసేన ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా.. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయ్‌. దీంతో తెలంగాణలో పార్టీకి కొత్త జీవం పోయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం కేడర్‌ను స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన జనసేన నాయకత్వంలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా… టీడీపీ, జనసేన రెండు పార్టీలు తెలంగాణలో బలోపేతంపై ఫోకస్ పెట్టాయి.