translateexpand_more

Tirumala News News

Latest updates from Telugu Digital news sources.

Vaartha01 Jun, 06:00 pm
టీటీడీకి రూ.11 లక్షల విరాళం అందించిన దుబాయ్ దాతలు

TTD Donation: కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న పలు సామాజిక, ఆధ్యాత్మిక ట్రస్టులకు దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అందులో భాగంగానే, సోమవారం సాయంత్రం దుబాయ్‌కి చెందిన ఎన్నారై (NRI) దాతలు మనోజ్, నేహ దంపతులు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు భారీ విరాళంగా అందజేశారు. Read Also: APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ ఈ మేరకు దాతలు హైదరాబాద్‌లో టీటీడీ(TTD Donation) చైర్మన్ బి.ఆర్. నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకుని, విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను ఆయనకు నేరుగా అందజేశారు. పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన ప్రాణదాన ట్రస్టుకు ఈ విరాళం ఇవ్వడం పట్ల టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దాతలను మనసారా అభినందించారు. అనంతరం దాతలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. Janasena: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం APSPDCL Power Complaints:విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Sai Sudha Play School: తిరుపతిలో సాయి సుధా ప్లే స్కూల్ ఏసీ క్యాంపస్ ప్రారంభం! Tirupati Raxaul Express:తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం! Ghantasala Fans Tribute:ఘంటసాలకు పుష్పాంజలి! Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ జమ్మూకశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న ఉగ్రవాద హింసకు క్రమంగా అడ్డుకట్ట పడుతోంది. ఎప్పుడూ... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా... దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై... ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్ల ప్రక్రియను వేగవంతం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) భవిష్యత్తులో చేపట్టే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలను... తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక అద్భుతమైన తీపికబురు అందించింది. రాష్ట్రంలో... మున్సిపల్ పాలకవర్గం, సీనియర్ నేతలతో పొన్నం ప్రభాకర్ భేటీ Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో “ఏబీసీడీ... యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ను అప్‌గ్రేడ్ చేసి పూర్తిస్థాయి వెర్షన్ ప్రారంభించింది.... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ...

Oneindia Telugu01 Jun, 03:30 am
లో ఈ పథకానికి విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం, మార్గదర్శకాలు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరటం తో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం 90,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ల లో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో శ్రీవాణి కోటా తో పాటుగా టీటీడీ అమలు చేస్తున్న మరో పథకానికి భక్తుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది.తిరుమల తో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. ఆదివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా, టీటీడీ ట్రస్టుల్లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఆదరణ పెరుగుతోంది. రూ.లక్ష విరాళం అందజేస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం(ఒకసారి మాత్రమే) కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ఆధ్వర్యంలో నవజాత శిశువులు, చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన నిధులను దాతల ద్వారా సమీకరించేందుకు టీటీడీ 2022లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకాన్ని ప్రారంభించింది. PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!స్పందిస్తున్న భక్తులు.. పథకానికి విరాళాలు కాగా, ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి నిర్వహణ కోసం రూ.కోటి విరాళమిచ్చే దాతలు ఇప్పటికే ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా లభించే ప్రత్యేక

Oneindia Telugu30 May, 05:23 am
అరుదైన అవకాశం - సర్వదర్శన భక్తులకు తోమాల సేవలో శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. గత ఇరవై రోజుల నుంచి భక్తులతో తిరుమల కిటకిట లాడుతుంది. తిరుమలలోని మాడవీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఇదే సమయం లో టీటీడీ సర్వదర్శన భక్తులకు తోమాల సేవలో శ్రీవారి దర్శన అవకాశం కల్పించింది.వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో పాటు విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తతున్నారు. ప్రతి రోజూ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టు దాతలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఇకపై ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కేటాయించాలని నిర్ణయించింది. జూన్‌ 10వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం రోజూ 1,500 శ్రీవాణి టికెట్లను టీటీడీ కేటాయిస్తోంది. ఇందులో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద కేటాయిస్తారు. అలాగే మరో 200 టికెట్లను తిరుపతి ఎయిర్‌పోర్టులో కరెంట్‌ బుకింగ్‌ కోటాలో జారీ చేస్తున్నారు. రోజూ ఆన్‌లైన్‌ కరెంట్‌ బుకింగ్‌ కోటా ద్వారా ఉదయం 9 గంటలకు 800 టికెట్లను జారీ చేస్తున్నారు.TTD: దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు, ఇక నుంచి ఇలా..!!సర్వదర్శన భక్తులకు తోమాల సేవలో శ్రీవారి దర్శనం అయితే ఇప్పటికే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసి దర్శన టికెట్ల కోసం ఎదురుచూస్తున్న

Zee Telugu29 May, 11:13 am
తలానీలాల సమర్పణలో తిరుమల మరో రికార్డు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. TTD Records: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు తలనీలాలు సమర్పించి కొత్త రికార్డు నెలకొల్పారు. మే నెలలోనే 12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. తలనీలాలను సమర్పించే వారిసంఖ్య పెరగడంతో తిరుమలలో తలనీలాల నిల్వలు భారీగా పెరిగిపోయాయి. అలాగే రాత్రింబవళ్లు నిరంతరాయంగా తలనీలాల సేవలను అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవులు, వారాంతాల్లో ఉండే రద్దీ వల్ల తిరుమలకు భక్తులకు తాకిడి భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా రోజు 50 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన తలనీలాలను నిరంతరం సేకరించి టీటీడీ భద్రపరుస్తోంది. ప్రతి కళ్యాణకట్టలో భక్తుల కోసం స్నాన సౌకర్యాలు, వేడినీటి సదుపాయం కల్పిస్తోంది. తలనీలాలు కార్యక్రమం తర్వాత టీటీడీ భక్తులకు చందనం బిళ్ళలను కూడా పంపిణీ చేస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, వారికి సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చే అనుభూతిని అందించేందుకు, టిటిడి అన్ని తలనీలా కేంద్రాలలో పారిశుధ్య చర్యలు, తాగునీటి సౌకర్యాలు, కూర్చునే ఏర్పాట్లు, టోకెన్ వ్యవస్థలను మరింత పటిష్టం చేసింది. Also Read: Tirumala Video: తిరుమలలో భారీగా పెరిగిన

Zee Telugu30 May, 05:13 pm
టీటీడీ ట్రస్ట్ కు ఎలక్ట్రిక్ బస్, 15 ఆపిల్ ట్యాబ్స్ విరాళం.. నీరా రాడియా ఔదార్యం

TTD: నీరా రాడియా నుంచి టీటీడీ ట్రస్ట్‌కు విలువైన విరాళం అందింది. ఒక ఎలక్ట్రిక్ బస్‌తో పాటు 15 ఆపిల్ ట్యాబ్స్‌ను టీటీడీకి అందజేశారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఆలయ నిర్వహణలో సాంకేతిక సదుపాయాలు పెంచేందుకు ఈ విరాళం ఉపయోగపడనుంది. నీరా రాడియా చేసిన ఈ దాతృత్వ చర్యపై భక్తులు, ఆలయ వర్గాలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నాయి.

Zee Telugu26 May, 07:29 am
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

Tirumala News: నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా తిరుమల శ్రీవారి దర్శనానికి యేడాదిలో 365 రోజులు భక్తులు దర్శనానికి వస్తూనే ఉంటారు. వారి సౌకర్యాల కల్పన కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల కోసం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. TTD Good News for Devotees: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే దాదాపు రెండు, మూడు నెలల ముందే ముందస్తుగా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా చాలా మంది నేరుగా స్వామి దర్శనానికి ఎంతో మంది తిరుమలకు వస్తుంటారు. వారందరు సర్వ దర్శనం లైన్‌లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో దాదాపు 24 గంటలకు పైగా లైన్‌లో నిలబడితే కానీ స్వామి వారి దర్శనం చేసుకోలేని పరిస్థితి ఉంది. అంతేకాదు తిరుమలలో సర్వ దర్శనానికి వచ్చే భక్తులను క్యూ కాంప్లెక్స్‌లో పెడతారు. దీని వల్ల తిరుమల కొండపై కానీ.. కింద కానీ ఇతర దివ్య క్షేత్రాలను చూడాలనుకువారికి సమయం సరిపోవడం లేదు. అలాంటి సర్వ దర్శనం భక్తుల కోసమే మళ్లీ రీ ఎంట్రీ సదుపాయం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల కొండపై ఎస్పీ మ్యూజియం నుంచి రీ ఎంట్రీ సదుపాయం కల్పిస్తోంది. ముఖ్యంగా సమ్మర్ హాలీడేస్ కారణంగా చాలా మంది భక్తులు తిరుమల కొండకు పోటెత్తుతున్నారు. ప్రతి రోజు ఎంత లేదన్న 80 వేల మంది శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక సర్వ దర్శనం క్యూ లైన్‌లలో వయసు మీరిన పెద్దవాళ్లు, పపి పిల్లలతో వచ్చిన వాళ్లు తిరుమల దర్శనానికి వేచి ఉండే కంపార్ట్‌మెంట్స్ లో వేచి ఉండలేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Andhra Jyothy01 Jun, 11:15 am
తిరుమలలో రికార్డు సృష్టించిన భక్తులు

తిరుమలలో కొలువుదీరిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు.. స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుమల, జూన్01: తిరుమలలో కొలువుదీరిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు.. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి ముందుగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఈ ఏడాది తలనీలాలను భక్తులు రికార్డు స్థాయిలో సమర్పించారు. మే మాసంలో 12,43,063 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు ఇచ్చారు. మే 1 నుంచి మే 27వ తేదీ వరకు శ్రీవారికి మొక్కుల రూపంలో భక్తులు తననీలాలు సమర్పించుకున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. గతంలో ఉన్న రికార్డులను ఇది అధిగమించిందని తెలిపింది. 2024 మే నెలలో 10.65 లక్షల మంది, 2025, మే మాసంలో 10.18 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారని గణాంకాలతో సహా టీటీడీ వివరించింది. మే 18 నుంచి 23వ తేదీ వరకు ప్రతి రోజు 50 వేల మంది భక్తులు తలనీలాలు ఇచ్చారని చెప్పింది. అయితే మే 23వ తేదీ ఒక్క రోజే.. 57,580 మంది భక్తులు తమ మొక్కుల కింద తలనీలాలు ఇచ్చారని పేర్కొంది. ఇటీవల కాలంలో అత్యధికంగా తలనీలాలు సమర్పించినది మే 23వ తేదీ అని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమలలో కళ్యాణకట్టతోపాటు 11 తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేశామని టీటీడీ వివరించింది. తలనీలాల కోసం 1,150 మంది మంగలి వారిని ఏర్పాటు చేశామంది. వారిలో 269 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పింది. మొక్కుల రూపంలో భక్తులు ఇచ్చిన

TV9 Telugu29 May, 03:09 am
టీటీడీలో నల్ల బంగారం’ కొత్త రికార్డు..! ఒక్క మే నెలలోనే తలనీలాలు ఇచ్చిన భక్తులు ఎంతమందో తెలుసా

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించే భక్తులు రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. తలనీలాలు సమర్పించే సంఖ్య రికార్డులు బద్దలు కొడుతుంది. ఈ ఏడాది మే నెలలో గణనీయంగా పెరగడంతో తిరుమలలో నల్ల బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. తలనీలాలు సమర్పించే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం రాత్రింబవళ్లు నిరాటంకంగా తలనీలాల సమర్పణకు సేవలను అందుబాటులో తెచ్చింది. ఇందులో భాగంగానే మే 27 నాటికి, తిరుమలలో ఏకంగా 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 2024, 2025 మే నెలలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో ఇప్పటి దాకా తలనీలాలు సమర్పించిన భక్తులు ఎక్కువే. 2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేసవి సెలవుల సీజన్ తోపాటు వారాంతాల్లో ఉండే నిరంతర రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల తాకిడి ఈ ఏడాది మే నెలలో భారీగా పెరిగింది . మే 18 నుండి మే 23 వరకు, వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మే 23న ఒక్కరోజే భక్తులు మొక్కుల చెల్లింపులో రికార్డు బద్దలు కొట్టారు. ఆ ఒక్క రోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. తిరుమలలోని తలనీలాలు సమర్పించే భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటుసౌకర్యవంతమైన సేవలను అందిస్తోంది. తిరుమలలో చాలాచోట్ల కల్యాణకట్ట కేంద్రాలను ఏర్పాటు చేసిన టిటిడి ప్రధాన కల్యాణకట్టతో పాటు, PAC-1, PAC-2, PAC-3, PAC-5, GNC, HVC, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం,