NTV Telugu30 May, 04:37 pm
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడుతోంది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్కు తరలివస్తున్నారు. దీంతో విమాన టికెట్లు, హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం అహ్మదాబాద్కు వెళ్లే విమానాల టికెట్ ధరలు సాధారణ రేట్లతో పోలిస్తే గణనీయంగా పెరిగి, కొన్ని మార్గాల్లో రూ.17,000 నుంచి రూ.35,000 వరకు చేరుకున్నాయి. హోటల్ గదుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి ఐపీఎల్ ఫైనల్ ప్రభావం హోటల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా మే నెలాఖరు హోటల్ పరిశ్రమకు ఆఫ్-సీజన్గా పరిగణిస్తారు. అయితే ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలోని అనేక ప్రముఖ హోటళ్లు ఇప్పటికే పూర్తిగా బుక్ అయ్యాయి. ముఖ్యంగా ఎస్జీ హైవే, మొతేరా, చంద్ఖేడా, గాంధీనగర్ ప్రాంతాల్లోని హోటళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య ఉన్న గది అద్దెలు ప్రస్తుతం రూ.25,000 నుంచి రూ.36,000 వరకు పెరిగినట్లు సమాచారం. రెండు రోజుల్లో రూ.200 కోట్ల ఆదాయం? అహ్మదాబాద్లో ప్రస్తుతం సుమారు 20,000 హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐపీఎల్ ఫైనల్ కారణంగా దాదాపు అన్ని గదులు బుక్ అయ్యే అవకాశం ఉందని హోటల్ రంగం అంచనా వేస్తోంది. నగరంలో సుమారు 200 త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ కారణంగా కేవలం రెండు రోజుల్లోనే హోటల్ పరిశ్రమకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రంగ నిపుణులు చెబుతున్నారు. పర్యాటక రంగానికి భారీ ఊతం ఐపీఎల్ ఫైనల్