translateexpand_more

Film News News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu27 May, 12:47 pm
నాకు మొదట పెట్టిన పేరు వేరే.. అని మార్చింది తాతగారే

నందమూరి తారక రామారావు జూనియర్ (జూ. ఎన్టీఆర్) తన తాతగారు, దివంగత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)తో తనకున్న అమూల్యమైన అనుబంధాన్ని, తన పేరు మార్పు వెనుక ఉన్న చారిత్రక ఘట్టాన్ని ఓ ఇంటర్క్యూలో వివరించారు. ఓ ఉదయం తాను సీనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ వాతావరణం, అక్కడి దైవత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, గుడిలో ఉన్న అనుభూతి కలిగిందని తెలిపారు. కాషాయ వస్త్రాల్లో కూర్చుని ఉన్న తాతగారు తనను “ఏమిటి మీ పేరు?” అని అడిగారని, తాను తారక్ రామ్ అని బదులిచ్చానని చెప్పారు. తన నాయనమ్మ బసవరామ తారకం పేరుతో కలిసి ఉంటుందని తారక్ రామ్ అని పెట్టారని వివరించారు. అయితే, సీనియర్ ఎన్టీఆర్ వెంటనే తన తండ్రి హరికృష్ణను పిలిచి, “ఈ అబ్బాయి పేరు మార్చాలి, నందమూరి తారక రామారావుగా మార్చండి” అని ఆదేశించారని తెలిపారు. ఆ క్షణం నుంచి తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని జూ. ఎన్టీఆర్ పేర్కొన్నారు. పేరు మార్పుతో మొదలైన ఈ అనుబంధం ఒక సంవత్సరం పాటు కొనసాగిందని, తాతగారు తనను బంగారంలా చూసుకున్నారని భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ అనుబంధం అపురూపమైనదని, ఆ సమయంలో తాను, తాతగారు మాత్రమే ఉండేవారని, మూడో వ్యక్తికి తావులేదని వివరించారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్‌లో తాతగారే తనను భరతుడిగా వేషం వేయించి, అరకు తీసుకెళ్లారని తెలిపారు. అదే సినిమాకు ఆయనే దర్శకుడని, డబ్బింగ్ సమయంలో తాతగారే థియేటర్‌లో కూర్చుని తనతో డబ్బింగ్ చెప్పించారని గుర్తుచేసుకున్నారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో తాతగారు నాన్-వెజిటేరియన్ తినేవారు కాదని, సాయంత్రం 5:30 కల్లా భోజనం చేసి 7:00 గంటలకు నిద్రపోయేవారని, అయితే

TV9 Telugu26 May, 03:03 pm
CM Vijay: ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. అదృష్టం కొద్దీ.. షాకింగ్ విషయం చెప్పిన గబ్బర్ సింగ్ విలన్

అభిమాన్యుసింగ్.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ గబ్బర్ సింగ్ విలన్ అంటే ఇట్టే గుర్తు పడతారు. రక్త చరిత్ర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ విలన్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నేను నా రాక్షసి, బాడీ గార్డ్, బెజవాడ, ముకుంద, పండగ చేస్కో, జై లవకుశ, ఆక్సిజన్, అమర్ అక్బర్ ఆంటోనీ తదితర సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా చేశాడు. తెలుగులోనే కాదు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు అభిమన్యు సింగ్. స్టార్ హీరోలకు పోటీగా ప్రతినాయకుడి పాత్రల్లో ఆకట్టుకున్నారు. అలా అభిమన్యు సింగ్ తమిళనాడు సీఎం విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ వేలాయుధం లోనూ విలన్ గా అదరగొట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ విలన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే సీఎం విజయ్ తో కలిసి నటించిన క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘తమిళంలో నా మొదటి సినిమా విజయ్‌ దళపతి హీరోగా నటించిన వేలాయుధం. ఈ సినిమాలోని ఓ ఫైట్‌ సీన్‌ కోసం మేము సుమారు ఆరు గంటలపాటు ప్రయాణించి కోయంబత్తూరు వెళ్లాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్‌ వస్తుంది. అక్కడే మా షూటింగ్‌ స్పాట్. ఇందుకోసం అప్పటికే ఒక రైలును ముందుగానే రెడీ చేసి పెట్టారు. మొత్తం ఆరు రోజుల పాటు అక్కడ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై నాకు విజయ్ కు ఫైట్ సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. కాబట్టి రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్‌, నేను రిహార్సల్స్‌

TV9 Telugu26 May, 10:48 am
Manchu Manoj: ఎంత గొప్ప మనసన్నా నీది? మతి స్థిమితం లేని వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించిన మంచు మనోజ్.. వీడియో

రాకింగ్ స్టార్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రీల్ లైఫ్ లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. సినిమాల పరంగా అతని కెరీర్ ఎలా ఉన్నా సామాజిక సేవా కార్యక్రమాలతో మాత్రం అందరి మన్ననలు అందుకుంటున్నాడీ మంచు వారబ్బాయి. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఐక్య ధైర్య సేన సమితిని మంచు మనోజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన భార్య మౌనికతో కలిసి అయిదుగురు పిల్లలను దత్తత తీసుకున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు మనోజ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీ రీ బర్త్ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వెరైటీ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ మతి స్థిమితం లేకుండా బాధపడుతోన్న వ్యక్తికి నూతన జీవితాన్ని అందించాడు. అతనికి స్వయంగా హెయిర్ కట్ చేసి స్నానం చేయించాడు. అనంతరం నూతన వస్త్రాలు బహూకరించాడు. మతిస్థిమితం లేని వ్యక్తితో పాటు ఆశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని నిర్వాహకుడు గిరికి మనోజ్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. కాగా మతి స్థిమితం లేని వ్యక్తికి మంచు మనోజ్ హెయిర్ కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచు వారబ్బాయిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ మిరాయ్ మూవీలో విలన్ గా అదరగొట్టాడు. ఇప్పుడు అతని చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. డేవిడ్ రెడ్డి, వడ్డీ కాసులవాడ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ ఓ కీలక పాత్ర

TV9 Telugu27 May, 08:25 am
సీఎం విజయ్ నా సొంత తమ్ముడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా.. స్టార్ నటి కామెంట్స్ వైరల్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏ కొత్త సినిమా అయినా మొదటి వారం రోజలు డైలీ 5 షోస్ వేసుకునేలా విజయ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి కోలీవుడ్ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సీఎం విజయ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి కుష్బూ విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని సీనియర్ ప్రశ్నించారు. ప్రస్తుతం తమిళనాడు బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలిగా ఉన్న కుష్బూ సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుష్బూ ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘ సీఎం విజయ్‌ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం కలిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యం కాదు. విజయ్‌ పగ్గాలు చేపట్టి కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. ముఖ్యమంత్రికి కాస్త సమయం

TV9 Telugu26 May, 01:53 pm
Sri Gouri Priya: మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్లు అయింది.. హీరోయిన్ శ్రీ గౌరిప్రియ జీవితంలో ఇంత విషాదముందా?

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ. ప్రముఖ టీవీ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇదే క్రమంలో 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెల్చుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో 2021లో తొలిసారి మెయిల్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది గౌరి ప్రియ. ఆ తర్వాత లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. అయితే ఈ అమ్మడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది మ్యాడ్ సినిమా అని చెప్పవచ్చు. అలాగే రైటర్ పద్మభూషణ్ మూవీలోనూ ఈ ముద్దుగుమ్మ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హ్యాపీరాజ్ అనే సూపర్ హిట్ సినిమాలోనూ కథానాయికగా చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు తెలుగు, తమిళ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కిరణ్ అబ్బవరంతో కలిసి నటిసస్తోన్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘వదలనే’ అనే సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు. సోమవారం (మే 25) రాత్రి ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ నుంచి ‘వదలనే’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా తల్లిని గుర్తు చేసుకుంటూ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది. ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించిన స్రవంతి వదలనే సాంగ్ లిరిక్స్ ను ఎవరికీ అంకితం చేస్తారని గౌరిప్రియను అడిగింది. దీనికి సమాధానమిచ్చిన ఆమె .. ‘నిజంగా చెప్పాలంటే

TV9 Telugu26 May, 04:18 pm
Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..

ఐశ్వర్యా రాజేష్‌ పక్కా తెలుగు అమ్మాయి. అయినా తమిళంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడే ఆమెకు స్టార్‌డమ్, పాపులారిటీ ఎక్కువగా ఉంది. అప్పుడప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోతోంది. విక్టరీ వెంకటేష్ తో కలసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐశ్వర్య నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర గడుస్తున్నా ఐశ్వర్య నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. అయితే తమిళంలో మాత్రం మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఐశ్వర్య రాజేష్ తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదర్కొంది. 8 ఏళ్ల వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైంది. ఆ తర్వాత టీనేజ్ లో ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. దీంతో ఆమె మేనత్త, ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్యను చేరదీసింది. ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి రాజేష్‌ కూడా తెలుగులో హీరోగా చేశారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశార. నెలవంకతో మొదలైంది రాజేష్ ప్రయాణం. ఆ తర్వా రెండు జళ్ల సీత, ఆనంద భైరవి సినిమాల్లోనూ హీరోగా నటించారు. కేవలం హీరోగానే కాకుండా పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గానూ, సహాయక నటుడిగానూ కనిపించారు రాజేష్. మొత్తానికి యాభైకి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారాయన. అయితే నటుడిగా రాణిస్తున్న సమయంలోనే తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు రాజేష్. కాలేయ సమస్యలతో కేవలం 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అప్పటికి ఐశ్వర్య రాజేష్‌ వయసు కేవలం‌ ఎనిమిదేళ్లు మాత్రమే. దీంతో ఐశ్వర్య తల్లి LIC ఏజెంట్ గా మారి