translateexpand_more

Manchu Manoj News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media31 May, 11:41 am
దాసరి వర్ధంతి వేళ మంచు మనోజ్ ఇండస్ట్రీ పై సీరియస్ కామెంట్స్

దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వర్ధంతి మే 30 న జరిగింది. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ ఆయన ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిశ్రమ పరిస్థితులపై మంచు మనోజ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దాసరి గారు కేవలం ఒక వ్యక్తి కాదని ఆయన ఒక మూవీ మిషన్ అని మనోజ్ కొనియాడారు. ఏడాదికి 10-15 సినిమాలు తీస్తూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఆయన స్ఫూర్తిని గుర్తుచేసుకోవడం నిజంగా అభినందనీయం. నేటి పాన్ ఇండియా మోజులో పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలును ఈ వ్యాఖ్యలు కచ్చితంగా ప్రతిబింబిస్తున్నాయి. మనోజ్ అభిప్రాయం ప్రకారం పూర్వం దాసరి నారాయణరావు గారి హయాంలో సినిమా అంటే ఒక నిరంతర ప్రక్రియగా సాగేది. ఒక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేది. ఈ వాల్యూమ్ బేస్డ్ సంస్కృతి వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరిగింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక ప్రమాదకరమైన ధోరణి నడుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో ప్రతి దర్శకుడు పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలని ఆరాటపడుతున్నారు. వందల కోట్ల వసూళ్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దీనివల్ల ఒకే ప్రాజెక్ట్‌పై 2-3 ఏళ్లు సమయం కేటాయించాల్సి వస్తోంది. బడ్జెట్లను వందల కోట్లకు పెంచేయడం వల్ల నిర్మాతలపై మోయలేని భారం పడుతోంది. పెద్ద సినిమాలు ఏడాదికి 4-5 మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో మిగిలిన రోజుల్లో థియేటర్లను రన్ చేయడం ఎగ్జిబిటర్లకు భారంగా మారుతోంది. ఒక సినిమా ఆలస్యమైతే ఆ ప్రాజెక్ట్ నమ్ముకున్న 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్లు నష్టపోతున్నారు. ఫలితంగా వారు నెలల తరబడి ఖాళీగా ఉండాల్సిన

Chitrajyothy31 May, 10:51 am
దాసరి లేని లోటు నాకు బాగా తెలుస్తోంది - మంచు మనోజ్

<p>‘తండ్రి సమానులైన దాసరిని, ప‌ద్మ ఆంటీని బాగా మిస్ అవుతున్నాము. వాళ్లు లేని లోటు మాకు.. ముఖ్యంగా నాకు బాగా తెలుస్తోంది’ అని అన్నారు రాకింగ్ మనోజ్ మంచు (RawKing Manchu Manoj). దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) వ‌ర్ధంతి సంద‌ర్భంగా శనివారం ఆయ‌న.. తన భార్యతో కలిసి దాసరి ఘాట్‌ను సంద‌ర్శించారు. దాసరి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక మంచు (Mounika Bhuma Manchu) మీడియాతో మాట్లాడారు. </p><div id="articlebodyAdsDiv"></div><br/><p>‘‘నిజంగా గురువుగారు దాస‌రి నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతి అనే విష‌యం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాల‌నీ వైపు వెళుతుంటే.., గురువుగారి విగ్ర‌హం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను. వెంట‌నే అరుణ్ అన్న‌కు ఫోన్ చేసి.. వారితో మాట్లాడాను. ఎందుక‌నో గురువుగారు గుర్తుకు వ‌స్తున్నార‌ని కూడా చెప్పాను. ఈలోగా వేరే ప‌నిలో ప‌డి విష‌యం మ‌రచిపోయాను. అది జ‌రిగి నాలుగు రోజులు కూడా కాలేదు.. నిన్న సాయంత్రం ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడ‌గానే చాలా బాధేసింది. వెంట‌నే నా టీమ్‌కు చెప్పాను. నేను ఆల‌స్యంగా చెప్పినా కూడా.. కార్మిక సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యారు. యాద‌గిరి అన్న‌కు ఫోన్ చేస్తే.. తెల్ల‌వారు జామునే స్పందించారు. అలాగే ఎమ్మెల్యేగారు కూడా వెంట‌నే స్పందించారు. నేను కాల్ చేసిన 20 నిమిషాల్లోనే స్పందించి జెసీబీని ఏర్పాటు చేశారు. మొత్తం 20 నుంచి 25 మంది ప‌ని చేశాం. నేను చెప్పగానే ఇక్క‌డ‌కు వ‌చ్చి అంతా క్లీన్ చేసిన వారంద‌రికీ, అలాగే వారికి వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసిన అంద‌రికీ థాంక్స్‌. </p><p>ఇక గురువుగారి గురించి చెప్పాలంటే ఆయన గొప్ప డైరెక్ట‌ర్‌,

Samayam Telugu30 May, 06:41 am
పాడుపడ్డ స్థితిలో దాసరి సమాధి… చలించిపోయిన టాలీవుడ్, రంగంలోకి మంచు మనోజ్, గీతా ఆర్ట్స్

దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహోన్నత వ్యక్తి దాసరి నారాయణరావు . 2017, మే 30న ఆయన భౌతికంగా దూరమైనా ఆయన సృష్టించిన కళాఖండాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అయితే తాజాగా దాసరి నారాయణరావు సమాధికి సంబంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దాసరి నారాయణరావు, ఆయన ధర్మపత్ని పద్మ సమాధులు సంరక్షణ లేక, చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.* వాచ్‌మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్!దీంతో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెండితెరపై ఎందరికో జీవితాన్ని ప్రసాదించి, వేల కోట్ల విలువైన ఆస్తులను వదిలివెళ్లిన ఒక లెజెండరీ డైరెక్టర్ సమాధిని కనీసం పట్టించుకునే నాథుడే కరువవ్వడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నవారి స్మారక చిహ్నాలను ఇలా వదిలేయడం ఎంతవరకు న్యాయమంటూ దాసరి వారసులపై మండిపడుతున్నారు. ఈ వీడియో కాస్తా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారడంతో పలువురు సినీ ప్రముఖులు తక్షణమే స్పందించారు. రంగంలోకి దిగిన మంచు మనోజ్ , విష్ణు, గీతా ఆర్ట్స్ ఈ హృదయవిదారక విజువల్స్ చూసి హీరో మంచు మనోజ్ తీవ్రంగా చలించిపోయారు. దాసరి వర్ధంతి రోజైన నేడు ఆయన నేరుగా సమాధి వద్దకు చేరుకున్నారు. తెలుగు సినిమాకు ఎన్నో జనరేషన్ల పాటు ఆదర్శంగా నిలిచిన ఒక మహానుభావుడి స్మారకం ఇలా ఉండటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం దాసరి, పద్మ గార్ల

SkyC Media30 May, 08:53 am
దాసరి నారాయణరావు సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

తెలుగు సినిమా పరిశ్రమకు అపార సేవలు అందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి సమాధి నిర్లక్ష్యానికి గురైంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వైరల్ వీడియో చూసి చాలా మంది సినీ అభిమానులు ఎంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ సేవా సంస్థ ద్వారా తక్షణం స్పందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కేవలం సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి, కామెంట్‌లు చేసి వదిలేయకుండా ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. దాసరి గారి సమాధిని శుభ్రం చేయించడం ద్వారా మంచు మనోజ్ తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. దాసరి నారాయణరావు గారి సమాధి ఉన్న పరిస్థితిని చూసి ఎంతో మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంచు మనోజ్ ఈ విషయంపై కేవలం మాట్లాడడం మాత్రమే కాకుండా నేరుగా పని చేసి చూపించారు. ఆయన ఉదయం 7 గంటలకే తన టీమ్‌తో కలిసి దాసరి గారి సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న వ్యర్థాలను, పరిసరాలను స్వయంగా దగ్గరుండి శుభ్రం చేయించారు. సినిమా షూటింగ్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం విశేషం. మంచు మనోజ్ సేవా సంస్థ అయిన ఐక్య ధైర్య సేన ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో సమాధి పరిసరాలు పూర్తిగా శుభ్రంగా మారిపోయాయి. కేవలం సామాజిక మాధ్యమాల్లో బాధపడటం కంటే ఇలాంటి బాధ్యతాయుతమైన పనులు చేయడం ఎంతో అవసరమని ఆయన నిరూపించారు. దాసరి గారి లాంటి గొప్ప వ్యక్తి సమాధి ఇలా నిర్లక్ష్యానికి గురికావడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే. ఫలితంగా మనోజ్ తీసుకున్న ఈ తక్షణ నిర్ణయంపై

Zee Telugu30 May, 01:50 pm
ఇండస్ట్రీ పెద్ద దిక్కుకు దిక్కైన మంచు మనోజ్.. దాసరి సమాధి వద్ద స్వయంగా క్లీనింగ్

Manchu Manoj: ఇండస్ట్రీ పెద్ద దిక్కుకు దిక్కైన మంచు మనోజ్.. దాసరి సమాధి వద్ద స్వయంగా క్లీనింగ్ ఈ వార్తకు సంబంధించిన

Telugu Cinema30 May, 09:08 am
ఘాట్ శుభ్రం చెయ్యించిన మనోజ్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఘాట్ దుస్థితిపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరిగింది. యాంకర్ గౌతమి షేర్ చేసిన ఓ వీడియోలో ఘాట్ పరిసరాలు నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపించడంతో సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసిన మనోజ్ మంచు (Manoj Manchu) వెంటనే స్పందించారు. దాసరి నారాయణరావు పట్ల తనకున్న గౌరవాన్ని చాటుతూ, స్వయంగా ఘాట్‌ను సందర్శించి అక్కడి పరిసరాలను శుభ్రం చెయ్యించారు. మనోజ్, ఆయన బృందం పేరుకుపోయిన చెత్త, ఎండుటాకులు తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. తన సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు ఉదయం 7 గంటలకే తన బృందంతో కలిసి ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “మూడు నాలుగేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని చూడటం బాధగా ఉంది. ఇటీవల వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత వెంటనే ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను” అన్నారు. మనోజ్, ఆయన భార్య మౌనిక కలిసి ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, సహాయ కార్యక్రమాలు, అనాథాశ్రమాల సందర్శనలు వంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మనోజ్, ఇప్పుడు దాసరి ఘాట్ పునరుద్ధరణకు ముందుకొచ్చి మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

Samayam Telugu31 May, 01:58 pm
ఒసేయ్ రాముల మ్మ’తో ప్ర తీ హీరోకి భ యం పుట్టించారు.. థియేట ర్ల స మ స్య

లెజండరీ డైరెక్టర్, దర్శక రత్న దాసరి నారాయణరావు సమాధి దుస్థితి చూసి హీరో మంచు మనోజ్ చలించిపోయిన విషయం తెలిసిందే. దాస‌రి ఘాట్ పై ఓ యాంక‌ర్ వీడియో షేర్ చేయగా.. మ‌నోజ్ దానిపై రియాక్ట్ అవ్వడమే కాకుండా, స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, తన టీమ్‌తో కలిసి శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ క్రమంలో దాసరి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను మ‌నోజ్, త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు. దాసరి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దాసరి ఎప్పుడో దారి చూపారని మనోజ్‌ ఈ సందర్భంగా అన్నారు. ''ఈరోజు మా గురువుగారు దాస‌రి నారాయ‌ణ‌రావు వర్ధంతి. వాస్తవానికి ఆయ‌న వ‌ర్ధంతి అనే విష‌యం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాల‌నీ వైపు వ‌స్తుంటే, గురువుగారి విగ్ర‌హం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను. వెంట‌నే దాసరి అరుణ్ కుమార్ అన్న‌కు ఫోన్ చేసి, ఆలం అక్క ఫోన్ నెంబ‌ర్ తీసుకొని వారితో మాట్లాడాను. ఎందుక‌నో దాస‌రి గుర్తుకు వ‌స్తున్నార‌ని అన్నాను. ఈలోగా వేరే ప‌నిలో ప‌డి విష‌యం మర్చిపోయాను. అది జ‌రిగి నాలుగు రోజులు కూడా కాక‌ముందే, దాసరి ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడ‌గానే నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. వెంట‌నే రెస్పాండ్ అయ్యాను. నా టీమ్‌కు నేను లేట్ గా చెప్పినా కూడా, వాళ్లు కార్మిక సిబ్బందిని తీసుకొచ్చి శుభ్రం చేయించారు. నేను కాల్ చేసిన వెంటనే ఎమ్మెల్యేగారు కూడా స్పందించి, అన్ని ఏర్పాట్లు చేశారు. నా మాట మీద ఇక్క‌డ‌కు వ‌చ్చిన వారంద‌రికీ థాంక్స్‌'' అని మంచు

Chitrajyothy30 May, 05:27 pm
చేసిందంతా మనోజ్.. క్రెడిట్ విష్ణు అకౌంట్ లోనా.. నెటిజన్లు ఫైర్

<p>‘చేసిందంతా మంచు మనోజ్ (Manchu Manoj) అయితే.. అందరూ మంచు విష్ణు (Manchu Vishnu)ని రుద్దుతున్నారేంటిరా?’.. ఈ కామెంట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన ఘాట్ విషయంలో శనివారం ఎలాంటి హంగామా నడిచిందో తెలియంది కాదు. ఓ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలను చూసిన మంచు మనోజ్ వెంటనే రియాక్టై, ఘాట్ మొత్తాన్ని క్లీన్ చేయించిన తీరు.. వీడియోల రూపంలో వైరల్ అవుతుంటే.., ఈ విషయంపై ఎప్పటికో స్పందించిన మంచు విష్ణు.. సోషల్ మీడియాలో క్రెడిట్ అంతా నాదే, అనేలా ప్రచారం చేయించుకుంటున్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><iframe src="https://www.andhrajyothy.com/long-videos/2026/20260530/hero-manoj-manchu-cleaning-dasari-ghat-260530140247.html" width="100%" height="350" frameborder="0" allow="fullscreen; picture-in-picture" allowfullscreen webkitallowfullscreen scrolling="no"></iframe><br/><p>దాసరి ఘాట్ (Dasari Ghat) గురించి తెలిసి వెంటనే రియాక్ట్ అయిన మంచు విష్ణు అంటూ కొందరు జర్నలిస్ట్‌లు చేసిన ట్వీట్స్ కింద కామెంట్స్ చూస్తే.. అసలు విషయం ఏంటో అర్థమవుతోంది. ఇదంతా పీఆర్ స్టంట్ అంటూ నెటిజన్లు పై విధంగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ స్టంట్స్‌తో దాసరి ఘాట్‌ని అంతా క్లీన్ చేయించిన మంచు మనోజ్ పేరుని పక్కన పెట్టి మరీ.. విష్ణుని లేపుతున్నారు. మరో విషయం ఏమిటంటే.. మంచు విష్ణు అండ్ టీమ్ షేర్ చేసిన వీడియోలో కూడా మంచు మనోజ్ ఉండటం. ఇంతకంటే ఏం కావాలి? ఇదంతా పీఆర్ స్టంట్ అని తేల్చేయడానికి. అంతా ఖర్చు పెట్టి క్లీన్ చేయించిన మనోజ్‌ని పక్కన పెట్టేసి.. ఎక్కడో ఉండి, కనీసం ఘాట్ దగ్గరకు కూడా రాని విష్ణు.. క్రెడిట్ మొత్తం కొట్టేయాలని చూడటంతో, ఆయనపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. </p><br/><p>ఈ పీఆర్ స్టంట్స్ చేయించకుండా.. ఎప్పటిలానే కామ్‌గా ఉన్నా

Chitrajyothy30 May, 12:20 pm
దాసరి వర్ధంతి.. అంతా అయ్యక క్యూ కడుతున్నారు

మే 30వ తేది.. ఒకప్పుడు టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో అతి తక్కువమందికి గుర్తుంది. మే 30వ తేది.. ఒకప్పుడు టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో అతి తక్కువమందికి గుర్తుంది. ఆయన కుమారులు ప్రభు, అరుణ్‌లకు గుర్తుందో లేదో కూడా తెలియదు. దాసరి వర్ధంతిని గుర్తు పెట్టుకున్న కొందరు అభిమానులు మొయినాబాద్‌లోని ఆయన స్మారక స్థలానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి షాకయ్యారు. అక్కడ వ్యవసాయం క్షేత్రంలో ఉన్న దాసరి నారాయణరావు, పద్మల సమాఽధులు ముళ్ల కంచెలు, పిచ్చి మొక్కల మధ్య దారితెన్ను లేకుండా ఉండటాన్ని గమనించిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సన్నివేశాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యాయి. దాంతో టాలీవుడ్‌లో ఒక్కొక్కరికి దాసరి గుర్తొచ్చారు. ఒక్కప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారనీ, ఎంతోమందికి ఎన్నో చేశారని, లైఫ్‌ ఇచ్చారని గుర్తు చేసుకుంటూ రంగంలోకి దిగారు. అయితే నిజంగా దాసరిని గుర్తుంచుకున్న కొందరు మాత్రం దాసరి ఘాట్‌ దగ్గర పరిస్థితి చూసి హృదయం చలించి అక్కడ శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. అందులో మొదటిగా స్పందించింది దర్శకుడు సాయిరాజేశ్‌ నీలం, మంచు మనోజ్‌. ఈ ఇద్దరూ వెంటనే తమ సిబ్బందిని మొయినాబాద్‌లోని దాసరి వ్యవసాయ క్షేత్రానికి తమ సిబ్బందిని పంపి శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. మంచు మనోజ్‌ అయితే ఉదయాన్నే అక్కడికి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. దాసరి శిష్యుల్లో ఒకరైన దర్శకుడు రాజ వన్నెంరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. తదుపరి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పూల మాలలతో నివాళులు అర్పించారు. మంచు మనోజ్‌కు పోటీగా ‘మా’ అధ్యక్షుడు

Chitrajyothy30 May, 10:34 am
దాసరి ఘాట్ ని పునరుద్ధరించిన రా కింగ్’ మనోజ్.. వీడియో వైరల్

<p>దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఘాట్ (Dasari Ghat) దుస్థితిపై సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలు వచ్చిన కొన్ని గంటల్లో ‘రా కింగ్’ మనోజ్ (Raw King Manchu Manoj) మంచు స్పందించి.. స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మనోజ్ మంచు ఇలా చాటుకున్నారు. దాసరి ఘాట్‌ని మంచు మనోజ్ పునరుద్ధరిస్తోన్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఈ సందర్భంగా మనోజ్ మంచు స్పందిస్తూ.. దాసరి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు ఎంతో విశిష్టతను చేకూర్చిన దాసరి ఘాట్‌కు ఇలాంటి పరిస్థితా? ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చిన వారికి ధన్యవాదాలు. నా వంతుగా నేను చేయగలిగి సహాయం చేస్తానని హామీ ఇస్తున్నానని ట్వీట్ వేశారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మనోజ్ తన సినిమా షూటింగ్‌కి వెళ్లే కంటే ముందు ఉదయం 7 గంటలకు.. తన బృంద సభ్యులతో కలిసి దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. ‘‘మూడు, నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్ని చూసి చాలా బాధగా ఉంది. చిత్రపురి కాలనీ దాటుతుండగా, ఆయన విగ్రహం కనిపించి ఘాట్ గుర్తొచ్చింది. ఆ వీడియా మా టీమ్ నాకు చూపించడంతో అసలు విషయం తెలిసింది. ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను తట్టుకోలేకపోయాను. అందుకే దీనికి ప్రాధాన్యతనిచ్చి, నా షూటింగ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చాను’’ అని మనోజ్ తెలిపారు. ఆ తర్వాత మనోజ్ తన టీంతో కలిసి ఘాట్

Samayam Telugu29 May, 01:14 am
సీఎం రేవంత్ రెడ్డితో మంచు మనోజ్ ఆలింగనం... ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై భావోద్వేగం

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, సినిమా, క్రికెట్, లైఫ్‌ స్టైల్ కథనాలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతో పాటు వీడియో టీమ్ కోసం పని చేసిన అనుభవం కూడా ఉంది. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. వీరేశ్ ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. గతంలో ఈనాడు.నెట్‌లో 7 ఏళ్లు పనిచేసిన ఆయన సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఆరేళ్లు సేవలందించారు. ప్రస్తుతం ‘సమయం తెలుగు’లోనే కన్సల్టెంట్‌‌గా పనిచేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్రకృతిలో సేద దీరడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు.... ఇంకా చదవండి

Chitrajyothy30 May, 02:47 pm
దాసరి విగ్రహానికి నమస్కరిస్తూ.. హేమ ఏం కోరిక కోరిందో తెలుసా

<p>దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతిని (Dasari Narayana Rao Death Anniversary) పురస్కరించుకుని శనివారం టాలీవుడ్‌లో ఎలాంటి హడావుడి నడిచిందో.. అంతా చూస్తూనే ఉన్నారు. దాసరి ఘాట్‌ని క్లీన్ చేసే విషయంలో మంచు విష్ణు, మనోజ్ తెగ ఉత్సాహం ప్రదర్శించారు. మంచు మనోజ్ (Manchu Manoj) ఘాట్ దగ్గర ఉండి కాసేపు క్లీనింగ్ పనులు చేయిస్తే.. మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం ఒక ప్రకటనతో.. క్రెడిట్ మొత్తం నాదే అని అనిపించుకోవాలనుకున్నారు. అంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ గురువుగా భావించి, పిలిచే దాసరి నారాయణరావు ఘాట్‌ అంత అధ్వాన్నంగా ఉండడం చూసి.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అనేలా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇక మంచు బ్రదర్స్ అనంతరం నటి హేమ (Actress Hema) సీన్‌లోకి వచ్చారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>‘ఇదంతా చూస్తుంటే.. ఈ రోజు నా వర్ధంతి.. అందరూ నన్ను మరిచిపోయారా!’ అని గురువుగారు మాకు గుర్తు చేసినట్లుంది అంటూ ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె.. ‘‘అందరికీ నమస్కారమండి, నేను మీ హేమని. ఈరోజు గురువుగారి వర్ధంతి.. అది నాకు అసలు మైండ్‌లో కూడా లేదు. అయితే, నిన్న ఒక వీడియో చూడగానే.. ‘అయ్యో! ఏంటి ఇలా ఉందా?’ అని చెప్పి భయపడి, కాల్ చేసి, లొకేషన్ షేర్ చేయించుకుని, నాతో పాటు ఒక నలుగురు మనుషులను ఎక్కించుకుని, పరిగెత్తుకుంటూ.. ఇక్కడ క్లీన్ చేయించడానికి వచ్చానండి.</p><br/><p>‘హలో, ఏంటి అందరూ నన్ను మరిచిపోయారా? ఇవాళ నా వర్ధంతి అని ఆయనే మాకు గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది’. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేనేమో ఇక్కడికి భయపడుతూ వచ్చాను. ఎలాగా, ఏం

Chitrajyothy28 May, 07:05 pm
ఎన్ టిఆర్ జయంతి.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్

మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు రాకింగ్ మంచు మనోజ్. ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు రాకింగ్ మంచు మనోజ్ (RawKing Manchu Manoj). నందమూరి తారక రామారావు 103వ జయంతి (NTR 103rd Birth Anniversary) సందర్భంగా అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంచు మనోజ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఎక్స్ వేదికగా మంచు మనోజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో.. ‘‘మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించారు నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు. తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు. శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు. నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు. ఆయన ఒక వ్యక్తి కాదు.. ఒక శకం. తెలుగు గర్వానికి ప్రతీక. ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం. కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం. నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ.. ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది. 24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం. నటుడిగా అలరించారు.. నాయకుడిగా నడిపించారు.. మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం. ఆయనలో చేయలేని పాత్ర లేదు, చేరలేని శిఖరం లేదు అనిపించేది. NTR

Chitrajyothy26 May, 11:53 am
మంచు మనోజ్ గొప్ప మనసు.. అడిగిన వెంటనే విరాళం | Actor Manchu Manoj Visits Matrudevobhava Orphanage, Donates Tables and Chairs rp

మంచు వారబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు ఫ్యామిలీలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు. మంచు వారబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు ఫ్యామిలీలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు. ఇక పెళ్ళి తరువాత మనోజ్ కెరీర్ పైన బాగా ఫోకస్ పెట్టాడు. హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలను ఎంచుకొని సక్సెస్ వైపు దూసుకెళ్తున్నాడు. దీంతో పాటు భార్యతో కలిసి సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. తాజాగా మరోసారి మనోజ్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్నిసందర్శించాడు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు మంచు మనోజ్ తక్షణమే స్పందించడమే కాకుండా.. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి అవసరార్థం పెద్ద ఎత్తున టేబుళ్లు, కుర్చీలను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి విరాళంగా అందజేశాడు. అంతేకాకుండా ఆయనే స్వయంగా ఆశ్రమానికి వెళ్లి వాటన్నింటినీ నిర్వాహకులకు అప్పగించి అక్కడి వారితో కొంత సమయం గడిపాడు. వృద్దులకు పండ్లను అందజేశాడు. ఇక ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'సమాజంలో దిక్కులేని వారికి, ఎవరూ లేని వారికి అండగా నిలబడటం అన్నిటికంటే గొప్ప విషయం. మాతృదేవోభవ ఆశ్రమం చేస్తున్న సేవలు అభినందనీయం. కేవలం ఇక్కడితోనే ఆగిపోకుండా, భవిష్యత్తులో కూడా ఈ ఆశ్రమానికి నావంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తాను' అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు

TV9 Telugu26 May, 10:48 am
Manchu Manoj: ఎంత గొప్ప మనసన్నా నీది? మతి స్థిమితం లేని వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించిన మంచు మనోజ్.. వీడియో

రాకింగ్ స్టార్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రీల్ లైఫ్ లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. సినిమాల పరంగా అతని కెరీర్ ఎలా ఉన్నా సామాజిక సేవా కార్యక్రమాలతో మాత్రం అందరి మన్ననలు అందుకుంటున్నాడీ మంచు వారబ్బాయి. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఐక్య ధైర్య సేన సమితిని మంచు మనోజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన భార్య మౌనికతో కలిసి అయిదుగురు పిల్లలను దత్తత తీసుకున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు మనోజ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీ రీ బర్త్ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వెరైటీ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ మతి స్థిమితం లేకుండా బాధపడుతోన్న వ్యక్తికి నూతన జీవితాన్ని అందించాడు. అతనికి స్వయంగా హెయిర్ కట్ చేసి స్నానం చేయించాడు. అనంతరం నూతన వస్త్రాలు బహూకరించాడు. మతిస్థిమితం లేని వ్యక్తితో పాటు ఆశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని నిర్వాహకుడు గిరికి మనోజ్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. కాగా మతి స్థిమితం లేని వ్యక్తికి మంచు మనోజ్ హెయిర్ కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచు వారబ్బాయిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ మిరాయ్ మూవీలో విలన్ గా అదరగొట్టాడు. ఇప్పుడు అతని చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. డేవిడ్ రెడ్డి, వడ్డీ కాసులవాడ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ ఓ కీలక పాత్ర

Zee Telugu27 May, 06:29 am
రియల్ హీరో అనిపించుకున్న మంచు మనోజ్.. ఓ వ్యక్తికి పునర్జన్మ ఇచ్చిన రా కింగ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Manoj Gave Life To Physically Challenged Person: మంచు మనోజ్ సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. తాజాగా మంచు మనోజ్.. మానసిక స్థితి బాగాలేని సంతోష్ అనే వ్యక్తి బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశాడు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి "సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించడం అక్కడ ఉన్నవారు కూడా పులకించిపోయారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ* .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్, సామాజిక మాధ్యమం ద్వారా మొదట తనను సంప్రదించినట్టు తెలిపారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా పనుల కారణంగా బిజీగా ఉన్నాను. అయితే గిరి చేసిన రిక్వెస్ట్, పెట్టిన వీడియో మాత్రం మదిలో అలా మెదులుతూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని, కాస్త విరామం దొరికిన తరువాత వెంటనే మళ్లీ నేనే వీరిని కలిసాను వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నానన్నారు.

Eenadu31 May, 11:58 am
ఇండస్ట్రీ సమస్యలు.. దాసరి దారి చూపారు.. హీరోలకు మంచు మనోజ్ విజ్ఞప్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ఎప్పుడో దారి చూపారని మంచు మనోజ్‌ అన్నారు. దాసరి నారాయణరావు సమాధి దుస్థితి చూసి చలించిపోయిన ఆయన తన టీమ్‌తో కలిసి శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సతీమణి మౌనికతో కలిసి దాసరి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘గురువుగారు దాసరి వర్థంతి అన్న సంగతి నాకూ గుర్తులేదు. చిత్రపురి కాలనీ వైపు వస్తుంటే, ఆ దారిలో గురువుగారి విగ్రహం ఉంటుంది. అది చూడగానే ఆయన కుటుంబం గుర్తు వచ్చింది. ఈలోగా ఆయన సమాధి పరిస్థితి తెలుసుకుని నా టీమ్‌తో కలిసి ఉదయాన్నే వచ్చేశా. అందరూ ఎంతో శ్రమించారు’’ ‘‘దాసరిగారు గొప్ప దర్శకుడు. స్క్రీన్‌ప్లే రైటర్‌. ఎడిటింగ్, మ్యూజిక్‌, డైలాగ్స్‌ ఇలా అన్నింటిపైనా పట్టు కలిగిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనొక ఇనిస్టిట్యూట్‌. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. సోషల్‌, కమర్షియల్‌, మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు రూపొందించారు. ‘దాసరి పని అయిపోయింది’ అని టాక్‌ వినిపించిన ప్రతిసారీ కొత్తదనంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం మనం థియేట‌ర్స్ స‌మ‌స్య‌లంటూ మాట్లాడుకుంటున్నాం. కానీ, నాకు తెలిసి గురువుగారు ఎప్పుడో దీనికి ఓ మార్గం చూపించారు. ఏడాదికి ప‌ది నుంచి ప‌దిహేను సినిమాలు చేస్తూ.. ఎంతో మందికి ఉపాధి లభించేలా చేశారు. ఎప్పుడో ఓ సినిమా చేయ‌టం కాదు.. ఎప్పుడూ సినిమా చేయాల‌ని దాసరి అనేవారు. ఇకపై నాతో సహా అందరూ హీరోలు వీలైన‌న్ని ఎక్కువ సినిమాలు చేయాలని కోరుతున్నాను. ఆ బాధ్య‌త అంద‌రిపైనా ఉంది. దాసరి ఘాట్‌ను పార్క్‌లా కాకుండా చుట్టు ప‌క్క‌ల పిల్ల‌లు ఆడుకునేలా తీర్చిదిద్దితే బాగుంటుందని అనుకుంటున్నా’’ అని అన్నారు.