translateexpand_more

Thalapathy Vijay News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu31 May, 12:11 pm
జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు

ఈ సినిమా జనవరి 9న సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సెన్సార్ సమస్యలే కారణమని నిర్మాత వెంకట్ నారాయణ రెండుసార్లు చెప్పారు. జూన్ 19న వస్తుందనుకుంటే, నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ 'బాలన్' అనే మరో సినిమాను ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. ఇక దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ఈ సినిమా రావొచ్చని టాక్. ఒక కార్యక్రమంలో 'జననాయగన్' రిలీజ్ గురించి డైరెక్టర్ హెచ్. వినోత్‌ను అడిగారు. దానికి ఆయన, 'సినిమా వచ్చినప్పుడు వస్తుంది. ఆ నిజం చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను చెప్పినా, దాన్ని ప్రచురించే ధైర్యం మీకు (మీడియాకు) లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు. వినోత్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న డైరెక్టర్ పా. రంజిత్ నవ్వడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'జననాయగన్' సినిమా మంచి ప్రింట్‌తో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. 'ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రావడానికి 5 నెలలు పడుతుందా? సినిమాను ఎవరు ఆపుతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది' అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

SkyC Media31 May, 10:50 am
విజయ్ జననాయగన్ ఆలస్యం మాట్లాడే ధైర్యం లేదన్న హెచ్ వినోద్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 'జననాయగన్' సినిమా విడుదల నిరంతరం ఆలస్యమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని సినిమా ఆలస్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ జననాయగన్ ఆలస్యం వ్యవహారం ఇప్పుడు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా విడుదల ప్రక్రియ ప్రస్తుతం తమ చేతుల్లో ఏమాత్రం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాలను బహిరంగంగా మాట్లాడే ధైర్యం తనకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమా అసలు ప్రణాళిక ప్రకారం జనవరి 2026 లో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే పొలిటికల్ కంటెంట్ కారణంగా ఈ చిత్రం తీవ్రమైన సెన్సార్షిప్ సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాలేకపోయింది. ఈ వివాదం కాస్తా కోర్టు మెట్లు ఎక్కడంతో ఒక ప్రత్యేక రివైజింగ్ కమిటీని కూడా నియమించారు. అయినప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని నిర్మాత వెంకట్ కే నారాయణ్ ధృవీకరించారు. దర్శకుడు వినోద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాను ఒకవేళ ధైర్యం చేసి నిజాలు మాట్లాడినా, వాటిని ప్రసారం చేసే ధైర్యం మీడియాకు ఉండకపోవచ్చని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు సంబంధించిన అడ్డంకులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోంది. విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ సినిమా కంటెంట్‌లోని రాజకీయ సున్నితత్వం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా సినిమా భవిష్యత్తుపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతానికైతే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్

Chitrajyothy31 May, 09:25 am
చెప్పే దమ్ము నాకున్నా.. ప్రసారం చేసే దమ్ము మీకు లేదు

విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఈ సినిమా విడుదలపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్‌’ సినిమా విడుదల మన చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాలు గురించి మాట్లాడేందుకు నాకు ధైౖర్యం లేదు. ఒకవేళ ధైౖర్యం చేసి మాటాడినా.. దానిని ప్రసారం చేసే దమ్ము మీకు లేదు’ అని అనడం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో దర్శకుడు ఎందుకిలా మాట్లాడడనే దానిపై చర్చ మొదలైంది. ఈ చిత్రం అసలు సంక్రాంతికి విడుదల కావల్సింది. కానీ సెన్సార్‌ బోర్ట్‌ నిబంధనలు, ఆంక్షల కారణంగా కోర్టు వరకే వెళ్లింది. రివైజింగ్‌ కమిటీ ఈ సినిమా చూసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని నిర్మాత ఇటీవల తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్‌ సీఎం అయ్యారు కాబట్టి సమస్యలన్ని ఓ కొలిక్కి వచ్చి త్వరగా విడుదలవుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇ్కఆ వ్యవహారం చక్కబడలేదు. అందుకే ఇంకా రిలీజ్‌ డేట్‌ కూడా ఇవ్వలేదు.

SkyC Media31 May, 03:50 am
నటుడు అజిత్ ఇంటికి వెళ్లిన తమిళనాడు సీఎం విజయ్, త్రిష

తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ మే 30, 2026 న నటుడు అజిత్ కుమార్ నివాసానికి వెళ్లారు. చెన్నై ఇంజంబాక్కంలోని అజిత్ నివాసంలో అజిత్ కుమార్ తల్లి మరణం తర్వాత ఆయనను విజయ్ వ్యక్తిగతంగా పరామర్శించారు. ఈ సందర్భంగా అజిత్ తల్లి మోహిని మణి భౌతికకాయానికి విజయ్ నివాళులు అర్పించారు. తన ప్రియ మిత్రుడు అజిత్ కు మరియు ఆయన కుటుంబ సభ్యులకు విజయ్ తన సానుభూతిని తెలియజేశారు. సీఎం విజయ్ తో పాటు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ కూడా అజిత్ నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. వీరు అజిత్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి వయస్సు 85 సంవత్సరాలు. ఆమె గత కొంతకాలంగా వయోసహజ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్త తెలిసే సమయానికి నటుడు అజిత్ కుమార్ దుబాయ్‌లో ఉన్నారు. ఈ విషయం తెలియగానే ఆయన వెంటనే దుబాయ్ నుండి చెన్నైకి చేరుకున్నారు. అజిత్ కుమార్ తల్లి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కష్టసమయంలో అజిత్ ను ఓదార్చడానికి తమిళనాడు సీఎం స్వయంగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి విజయ్ ఈ విషాద ఘటనపై ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. నా ప్రియ మిత్రుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మైయార్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసిందని విజయ్ పేర్కొన్నారు. ఆమె ఆత్మకు భగవంతుడి దివ్య చరణాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు తన స్నేహితుడు అజిత్ కుమార్ కు, ఆయన కుటుంబ సభ్యులకు

Chitrajyothy01 Jun, 03:05 pm
షాకింగ్.. బీజేపీలోకి విజయ్ భార్య

తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే, ఆయన పాలనపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలోనే, దళపతిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు తెరవెనుక ఒక భారీ పొలిటికల్ స్కెచ్ సిద్ధమైందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్నాయి. సీఎం విజయ్ భార్య సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నారనే ప్రచారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం విజయ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో, ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టి డిఫెన్స్‌లో పడేయాలనేదే ఈ బీజేపీ స్కెచ్ వెనుక ఉన్న అసలు వ్యూహమని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయ్, సంగీత మధ్య గత కొంతకాలంగా ఉన్న వ్యక్తిగత విభేదాలనే అస్త్రంగా చేసుకుని, ఆమెను పార్టీలోకి లాగడం ద్వారా సీఎం ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని ప్రత్యర్థులు చూస్తున్నారట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య స్వయంగా కేంద్ర అధికార పార్టీలో చేరితే, అది దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అవుతుందని, తద్వారా విజయ్ పీఠాన్ని కదిలించవచ్చని ఈ పొలిటికల్ ప్లాన్ వేసినట్లు టాక్. దీనికి సంగీత కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదంతా ఒక సీనియర్ నటి చేయిస్తోందని.. బీజేపీలో ఉన్న ఆ నటి, నిత్యం సంగీతను కలుస్తూ.. రాజకీయ ఎంట్రీ ఇవ్వమని, మంచి పదవిని ఇస్తామని

Eenadu31 May, 06:14 am
జన నాయగన్ ’ దర్శకుడి కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ (Vijay) నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan) వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ మూవీ విడుదల వివాదంపై ప్రశ్న ఎదురవగా దర్శకుడు హెచ్‌.వినోద్‌ (H Vinoth) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమా విడుదల మన చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాల గురించి మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా.. దానిని టెలీకాస్ట్‌ చేసే ధైర్యం మీకు లేదు’’ అని అనడం నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలోనే రావాల్సి ఉంది. కానీ, సెన్సార్‌ విషయంలో కోర్టుల వరకూ వెళ్లింది. ప్రత్యేకంగా ఏర్పాటైన రివైజింగ్‌ కమిటీ ఈ మూవీని చూసి, రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదని నిర్మాత వెంకట్‌ కె. నారాయణ ఇటీవల తెలిపారు. విజయ్‌ సీఎం అయ్యారు కాబట్టి వెంటనే సినిమా రిలీజ్‌ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ, ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అజిత్‌ ఇంటికి సీఎం విజయ్‌, త్రిష కలిసి వెళ్లారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Chitrajyothy30 May, 01:02 pm
ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్.. రాజకీయాల్లోకి అల్లు అర్జున్

సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లోకి రావడం చూడలేదు కానీ, సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం మాత్రం చూస్తూనే ఉన్నాం. సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లోకి రావడం చూడలేదు కానీ, సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం మాత్రం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం అవ్వడం.. విజయ్ (Vijay) సీఎం అవ్వడం చూశాక ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు రాజకీయాలపై మక్కువ ఎక్కువ అయ్యిందని తెలుస్తోంది. వారినే ఆదర్శంగా తీసుకొని పలువురు హీరోలు రాజకీయ రంగప్రవేశం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తాజాగా ఇండస్ట్రీలో ఒక రూమర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం చేయాలని చూస్తున్నాడట. అది కూడా అచ్చం సీఎం విజయ్ అనుసరించిన వ్యూహన్నే అనుసరించి బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ ఈ మధ్యనే కొందరు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ భేటీల వివరాలు బయటకు రానప్పటికీ, ఆయన 2034 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దళపతి విజయ్ లానే అల్లు అర్జున్ కూడా ఇప్పటికే పలు ప్రాంతాలలో అత్యంత బలమైన అభిమాన సంఘాల నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడు. భవిష్యత్తులో ఆయన గనుక రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటే, ఈ క్షేత్రస్థాయి అభిమానుల మద్దతు ఆయనకు ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ రాకా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయ్యాకా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి నిజంగానే బన్నీ పొలిటికల్

Chitrajyothy30 May, 11:57 am
విజయ్ దేవుడు.. త్రిష భక్తురాలు.. అలా మిస్ అయ్యిందా

ఏ సినిమా అయినా ఏ హీరో చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది. ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన కథ కొంచెం లేట్ అయినా కూడా వారి దగ్గరకే వెళ్తుంది. ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ వేరే హీరో చేయడం సర్వసాధారణం. ఏ సినిమా అయినా ఏ హీరో చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది. ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన కథ కొంచెం లేట్ అయినా కూడా వారి దగ్గరకే వెళ్తుంది. ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరకు వెళ్ళిన కథ వేరే హీరో చేయడం సర్వసాధారణం. కరుప్పు (Karuppu) సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. అవును.. కరుప్పు సినిమా సూర్య (Suriya) కన్నా ముందు దళపతి విజయ్ (Thalapathy Viajy) వద్దకు వెళ్ళింది. ఆయన నో అని చెప్పడంతో దర్శకుడు ఆర్జే బాలాజీ.. ఈ కథను సూర్యకు వినిపించడం, వెంటనే ఆయన ఓకే చెప్పడంతో కరుప్పు రిలీజ్ అయ్యి మంచి కలక్షన్స్ తో దూసుకువెళ్తోంది. కరుప్పునే విజయ్ చివరి సినిమా అని ఆర్జే బాలాజీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ' మొదట కరుప్పు కథతో విజయ్ వద్దకు వెళ్ళాను. అప్పటికే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2, 3 సార్లు మీట్ అయ్యాము. ఒక్క సినిమా చేసి సినిమాలు ఆపేద్దామని, రాజకీయ పరంగా ఎదగాలని అనుకుంటూనే కొన్నేళ్ళు సాగింది. ఆ తరువాత విజయ్ కిరెండు కథలు వినిపించాను. ఆయన నాతో సినిమా చేయను అని చెప్పారు. ఇది ఆయన కెరీర్‌లో చివరి సినిమా కాబోతుండటంతో, రాజకీయ సమీకరణాలు, వేరే కథల ఎంపిక వంటి పలు కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి గౌరవప్రదంగా తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు చాలా జస్టిఫైడ్‌గా అనిపించాయి. అందుకే

Asianet News Telugu29 May, 01:05 pm
కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్

ఈ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' పార్టీ 108 స్థానాల్లో గెలిచి, మిత్రపక్షాల సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా, ఆయన కోట్ సూట్‌లో కనిపించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. తన మేనేజర్ జగదీష్ ఇంటి గృహప్రవేశానికి హాజరైన విజయ్, అదే సంప్రదాయ దుస్తుల్లో సచివాలయానికి వచ్చారు. ప్రస్తుతం పట్టు పంచెకట్టులో ఉన్న సీఎం విజయ్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'మాడ్రన్ లుక్‌లో అయినా, ట్రెడిషనల్ లుక్‌లో అయినా మాస్' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Chitrajyothy29 May, 02:46 pm
సీఎం విజయ్ తనయుడి సిగ్మా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) అధినేత సుభాస్కరన్ (Subaskaran) నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’ (Sigma). తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishen) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి వార్తలలో హైలెట్ అవుతోన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేసింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. జూలై 31న ‘సిగ్మా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త సినీ అనుభూతిని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. దర్శకుడిగా తొలి చిత్రానికే జేసన్ సంజయ్ మంచి స్పష్టత, అంకితభావం, నమ్మకంతో వర్క్ చేశారు. ఆయన విజన్‌ను సాకారం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. ‘సిగ్మా’ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన జర్నీగా నిలిచిపోతుంది. నా విజన్‌ను

Chitrajyothy28 May, 05:43 am
మా ఇద్దరి మధ్య రిలేషన్ ఎలాంటిదంటే

సినీ హీరో, ముఖ్యమంత్రి విజయ్‌కు, తనకు మధ్య ఉన్న సంబంధం బ్రదర్‌ సిస్టర్‌ రిలేషన్‌ వంటిదని సీనియర్‌ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ స్పష్టం చేశారు. సినీ హీరో, ముఖ్యమంత్రి విజయ్‌కు, తనకు మధ్య ఉన్న సంబంధం బ్రదర్‌ సిస్టర్‌ రిలేషన్‌ వంటిదని సీనియర్‌ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ స్పష్టం చేశారు. ఖుష్బూ, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘డబుల్‌ ఆక్యుపెన్సీ’. సంతోష్‌, రేష్మా వెంకటేష్‌, సంయుక్తా విశ్వనాథన్‌, వినోద్‌ కిషన్‌, వీటీవీ గణేష్‌, భగవతి పెరుమాల్‌, బోస్‌ వెంకట్‌, వినోదిని వైద్యనాథన్‌ తదితరులు నటించారు. డెబ్యూ డైరెక్టర్‌ అశ్విన్‌ కందస్వామి దర్శకుడు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ఆడియో రిలీజ్‌ వేడుక మంగళవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఖుష్బూ మాట్లాడుతూ ‘సీఎం విజయ్‌, నేను వేర్వేరు పార్టీలకు చెందినవాళ్ళం అయినప్పటికీ.. మా ఇద్దరి మధ్య బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ రిలేషన్‌ ఉంది. ఈ సినిమా రొమాంటిక్‌ కామెడీ మూవీ. సంతోష్‌, ఆనంతిక మంచి స్నేహితులు. నాకు బాయ్‌ఫ్రెండ్‌ లేడు. కానీ, సంతోష్‌ వంటి అందమైన అబ్బాయి ఉన్నాడు. ఈ స్టోరీలో మంచి కథతో పాటు కామెడీ, ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీ నేను వినలేదు. మా బ్యానరులో సంతోష్ ను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఒక తల్లిగా గర్వపడుతున్నాను. అతనిలో ఫ్యాషన్‌, సినిమా పిచ్చి ఇలా అన్నీ ఉన్నాయి’ అని అన్నారు. దర్శకుడు సుందర్‌, నటి ఖుష్బూ దంపతుల రెండో కుమార్తె ఆనందిత సినిమాల్లోకి అడుగుపెట్టారు. విదేశాల్లో విద్య పూర్తి చేసిన ఆమె.. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’

Chitrajyothy25 May, 03:27 pm
Home » Tollywood » pawan kalyan sensational comments on cm vijay rp ABN , Publish Date - May...

Home » Tollywood » pawan kalyan sensational comments on cm vijay rp ABN , Publish Date - May 25 , 2026 | 08:57 PM ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వాక్చాతుర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యే...

Chitrajyothy25 May, 02:05 pm
Home » South Cinema » cm vijay allows five shows for movies in tamil nadu rcb ABN ,...

Home » South Cinema » cm vijay allows five shows for movies in tamil nadu rcb ABN , Publish Date - May 25 , 2026 | 07:35 PM తమిళ సినీ ఇండస్ట్రీపై సీఎం విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎవరి అనుమతి లేకుండానే ఇకపై రాష్ట్రవ్య...

Chitrajyothy25 May, 08:28 am
Home » South Cinema » Vijay sethupati request to CM Vijay avm ABN , Publish Date - May...

Home » South Cinema » Vijay sethupati request to CM Vijay avm ABN , Publish Date - May 25 , 2026 | 01:58 PM తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ముఖ్య మంత్రి విజయ్‌ను ఓ కోరిక కోరారు. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi)...

Sakshi29 May, 11:00 am
ఐఎండీబీ టాప్ లో ఊహించని పేరు.. విజయ్ , ఎన్టీఆర్ , షారూక్ కూడా అతని వెనకే

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ సెలబ్రిటీల ర్యాంకులను ప్రకటిస్తుంది. ప్రతి నెల, వారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ వారంలో పాపులర్‌ సెలబ్రిటీల జాబితాను ఐఎండీబీ వెల్లడించింది. ‍అయితే ఈసారి ఎవరు ఊహించని నటుడు నంబర్ స్థానంలో నిలిచారు. దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూక్ ఖాన్‌ను సైతం వెనక్కి నెట్టిన ఫస్ట్‌ ప్లేస్ దక్కించుకున్నారు. అతను ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వారంలో టాప్‌లో నిలిచిన నటుడు యుధ్వీర్ అహ్లావత్. అతను ఇటీవలే కర్తవ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ బాలీవుడ్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ లిస్ట్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, తలపతి విజయ్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్ లాంటి స్టార్లను అధిగమించి ఏకంగా నంబర్‌వన్ ప్లేస్‌ కొట్టేశాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు యుధ్వీర్ అహ్లావత్.. ఐఎండీబీ ర్యాంక్‌తో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. యుధ్వీర్ కర్తవ్య మూవీలో 16 ఏళ్ల హర్యానా బాలుడు హర్పాల్ పాత్ర పోషించారు. బాలుడి పాత్రలో కనిపించడంతో యుధ్వీర్‌ అంతా చిన్నపిల్లాడని భావించారు. కర్తవ్యను చూస్తున్న ప్రేక్షకులు యుధ్వీర్‌ను ఒక బాలనటుడిగా గుర్తించారు. కానీ అతని వయసు అక్షరాలా 33 సంవత్సరాలు. అతను దాదాపు దశాబ్ద కాలంగా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఐఎండీబీ టాప్ ర్యాంక్‌తో ఒక్కసారిగా ఫేమస్ ‍అయ్యాడు. కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్‌ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ప్రోనాగేశ్వర్ ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చెయ్యి పవన్ కి ఎమ్మెల్యే

Chitrajyothy31 May, 03:39 am
అజిత్ తల్లి మరణం.. స్వయంగా వచ్చి ఓదార్చిన సీఎం విజయ్

ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ ఉంటాయేమో కానీ, హీరోల మధ్య కాదు. అది టాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా.. హీరోలు ఎప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని మరోసారి రుజువుచేశారు తమిళ్ హీరోలు అజిత్ (Ajith)- విజయ్ (Vijay). ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ ఉంటాయేమో కానీ, హీరోల మధ్య కాదు. అది టాలీవుడ్ అయినా.. కోలీవుడ్ అయినా.. హీరోలు ఎప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని మరోసారి రుజువుచేశారు తమిళ్ హీరోలు అజిత్ (Ajith)- విజయ్ (Vijay). వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ, రియాలిటీలో అజిత్ - విజయ్ మంచి ఫ్రెండ్స్. ఆ స్నేహ బంధం ఎప్పుడూ కూడా వారు కొనసాగిస్తూనే ఉంటారు. శనివారం అజిత్ మాతృమూర్తి మోహిని మణి (Mohini Mani) అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ వార్త తెలియగానే కోలీవుడ్‌తో పాటు సౌత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఇక ఫ్రెండ్ తల్లి మరణవార్త విన్న విజయ్ సైతం.. అజిత్ ఇంటికి వచ్చి మోహిని మణి భౌతికకాయానికి నివాళులర్పించారు. అజిత్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుని ఓదార్చారు. అజిత్, విజయ్ ఇద్దరూ స్క్రీన్‌పై ఎంతటి పెద్ద పోటీదారులైనా.. వ్యక్తిగతంగా వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ కష్టసమయంలో విజయ్ స్వయంగా వచ్చి అజిత్ కుటుంబానికి ధైర్యం చెప్పడం అక్కడి వారిని కదిలించింది. విజయ్ తో పాటు త్రిష కూడా అజిత్ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించింది. అజిత్ భార్య శాలినిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారు