translateexpand_more

Tvk Party News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 12:32 pm
నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని

<p><strong>చెన్నై, జూన్ 01:</strong> తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానేమీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానని, కేవలం ప్రజా సేవకుడిని మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తనను ఒక ముఖ్యమంత్రిలా కాకుండా సొంత సోదరుడిలా గుండెల్లో పెట్టుకుని ఆదరించారని భావోద్వేగానికి లోనయ్యారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మంచి మాత్రమే చేస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>ఇదే సమయంలో తన ప్రభుత్వంపై వస్తున్న రాజకీయ విమర్శలపై సీఎం విజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇచ్చి, ఆ తర్వాత విమర్శలు చేస్తామని చెప్పిన విపక్షాలు.. కనీసం ఆరు రోజులు కూడా ఓపిక పట్టలేకపోయాయని మండిపడ్డారు. పదవిలోకి వచ్చిన ఆరో రోజు నుంచే తమపై బురదజల్లడం ప్రారంభించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక చివరకు తన డ్రెస్సింగ్ స్టైల్‌ను కూడా విమర్శిస్తున్నారని, తాను బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో ఉంటే తప్పేంటని విపక్షాలను నిలదీశారు. తనను ఎంజీఆర్ (MGR) లాంటి మహోన్నత నాయకుడితో పోల్చవద్దని విజయ్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులోనూ తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK), ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) మధ్యే అసలైన పోటీ ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు పూర్తి మెజారిటీ అందించి.. స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని అందించాలని సీఎం విజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: rgb(9, 37, 246)">ఇవి కూడా చదవండి..</span></strong></p><p style="text-align:

Oneindia Telugu01 Jun, 05:57 am
డిప్యూటీ స్పీకర్, విలేకరుల సంభాషణ వైరల్

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తొలి పర్యటనలో భాగంగా తిరుచ్చి జిల్లాకు వెళ్తున్న సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేడు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలోని ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ముఖ్యమంత్రి విజయ్ జిల్లాకు వస్తున్నారు. ఇది ఆయన సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలి సందర్శన కావడంతో సెయింట్ జోసెఫ్స్ కళాశాల మైదానంలో భారీ సభా ఏర్పాట్లు జరుగుతున్నాయి.నేడు తిరుచ్చిలో విజయ్ పర్యటన.. సభా స్థలిని పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ నేడు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది పాల్గొనే అవకాశం ఉంది. పర్యటన సందర్భంగా జిల్లాలో డ్రోన్లు ఎగరవేయడంపై కలెక్టర్ నిషేధం విధించారు. ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి టీవీకే నేత, మాజీ మంత్రి కృష్ణన్ మరియు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ ఆదివారం సైట్&amp;zwnj;ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విలేకరులకు డిప్యూటీ స్పీకర్ సూచన, విలేకరులు ప్రతిస్పందన విలేకరులు తిరుచ్చి ఈస్ట్&amp;zwnj;లో మిమ్మల్ని పోటీకి నిలబెట్టాలని విజయ్ ఆలోచిస్తున్నారా? అని అడిగినప్పుడు, రవిశంకర్ వారిని ఆపి విజయ్ అని పిలవకండి, ముఖ్యమంత్రి లేదా సీఎం అని పిలవాలి అని సూచించారు. మేము విజయ్ అనవచ్చు, మీరు అనకూడదు అని స్పష్టం చేశారు. దానికి సమాధానంగా విలేకరులు మేం విజయ్ అనొచ్చు మీరే అనకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఈ సంభాషణ నెట్టింట్లో హల్&amp;zwnj;చల్ చేస్తోంది.డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు కలిగిస్తున్నాయి. కొందరు ఇది ప్రోటోకాల్ మర్యాదలను గౌరవించడమేనని చెబుతుంటే, మరికొందరు ఇది అనవసరమైన ఆధిపత్య భావన

Oneindia Telugu31 May, 02:01 pm
ముఖ్యమంత్రిగా విజయ్ తొలి బహిరంగ సభ.. తిరుచ్చిలో.. రీజన్ ఇదే

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత&amp;nbsp; తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తన మొట్టమొదటి అధికారిక పర్యటనకు రెడీ అయ్యారు. జూన్ 1వ తేదీన ఆయన తిరుచ్చి జిల్లాలో సీఎం విజయ్ పర్యటించనున్నారు. సీఎంగా పదవిని చేపట్టిన తర్వాత ఆయన ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.సీఎం విజయ్ తొలి పర్యటన ఇక్కడే.. ఎందుకంటేఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, తనను భారీ మెజారిటీతో గెలిపించిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు స్వయంగా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యటనను ఖరారు చేసుకున్నారు.&amp;nbsp;&amp;nbsp;తిరుచ్చిలో విజయ్ భారీ బహిరంగ సభఇందుకోసం టీవీకే పార్టీ శ్రేణులు తిరుచ్చిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన విజయ్.. మంత్రివర్గ విస్తరణ, ఎన్నికల హామీల అమలు, పొత్తుల నిర్వహణ, అలాగే ఢిల్లీ పర్యటన వంటి అత్యవసర ప్రభుత్వ పనులతో బిజీగా గడిపారు. ఈ పనులన్నీ విజయవంతంగా ముగించుకున్న తర్వాత ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు.&amp;nbsp;&amp;nbsp;రేపు సాయంత్రం బహిరంగసభలో సీఎం విజయ్&amp;nbsp;షెడ్యూల్ ప్రకారం, సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ కృతజ్ఞత సభ ప్రారంభం కానుంది. విజయ్ చెన్నై నుంచి విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓపెన్ వ్యాన్ లో ప్రయాణిస్తూ, టీవీఎస్ టోల్ గేట్ మరియు ఓల్డ్ డెయిరీ ఫామ్ మీదుగా సెయింట్ జోసెఫ్ కాలేజీ

AP7AM01 Jun, 10:54 am
సీఎం విజయ్ పై నటి జూలీ సంచలన ఆరోపణలు

ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ... తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన గర్భస్రావానికి సీఎం విజయ్ పరోక్షంగా కారణమంటూ ఆమె వ్యాఖ్యానించారు.జల్లికట్టు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన జూలీ, ఇటీవల ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తనపై నిరంతరాయంగా చేసిన ట్రోలింగ్, వేధింపుల వల్లే తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని, తద్వారా తన కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. "నా బిడ్డను కోల్పోవడానికి విజయ్ అన్నే బాధ్యుడు. ఆయన నేరుగా ఈ పని చేయకపోయినా.. తన అభిమానులను ఆపమని ఒక్క మాట చెప్పి ఉంటే నేను బిడ్డను కోల్పోయేదాన్ని కాదు" అని జూలి ఆరోపించారు.గత ఎన్నికల సమయంలో విజయ్ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం, మెరీనా బీచ్ వద్ద నిరసన తెలపడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని జూలీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణమైన కామెంట్లు పెట్టారని, చివరకు తనపై రూ. 15 లక్షల విలువైన నకిలీ కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా సృష్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రజలు విజయ్ అన్న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సీఎం అయ్యారని అంటున్నారు.&nbsp;జూలీ చేసిన ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి విజయ్ మద్దతుదారులు, టీవీకే నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతోందని

AP7AM24 May, 10:39 am
విజయ్ గెలుపు ఒక 'సినిమా సునామీ'.. ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: స్టాలిన్

- తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సరికొత్త యుద్ధం మొదలైంది. - డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. - చెన్నైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...

Sakshi26 May, 07:03 am
సైలెంట్‌గా స్కెచ్‌.. పెద్ద రిస్క్‌ చేస్తున్న విజయ్‌

వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్‌ అంటే లాటరీ? లీవ్‌? ఏదైనా రాజకీయ సెటైర్‌నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్‌ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్‌ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్‌” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్‌లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్‌ జయకుమార్‌, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్‌, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్‌ “విజిల్‌” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. “ఆపరేషన్ L” అలా మొదలైందా? అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్‌ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two

Eenadu27 May, 01:45 pm
అన్నాడీఎంకేలో చీలిక లేదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK) తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు (వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు) పళనిస్వామితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అయితే, టీవీకే ప్రభుత్వానికి పార్టీ మద్దతు ఇవ్వాలని వేలుమణి (SP Velumani).. ఇతర ఎమ్మెల్యేలతో కలిసి గతంలో విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి షణ్ముగం మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అనంతరం వేలుమణి మాట్లాడుతూ అన్నాడీఎంకేలో చీలిక లేదని.. భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. పళనిస్వామికి పూర్తిగా మద్దతిస్తున్నట్లు వెళ్లడించారు. తామందరం ఐక్యంగా ఉన్నామని.. మొదట షణ్ముగంను కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చామని తెలిపారు. అనంతరం వేలుమణి బృందం స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ను కలిసింది. అసెంబ్లీలో అంతా ఒకే పార్టీగా పనిచేస్తామని ఆయనకు లేఖ సమర్పించింది. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో మాజీ మంత్రులు వేలుమణి, సి.వి.షణ్ముగం నాయకత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. టీవీకే (TVK) ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసిన వారిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పదవి నుంచి తొలగించాలని పళనిసామి వర్గం ఎమ్మెల్యేలు సభాపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ అన్నాడీఎంకే గూటికి చేరడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Zee Telugu26 May, 04:00 pm
Aiadmk mla row: అన్నాడీఎంకే కు మరో షాక్.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం..

Tamil nadu politics: తమిళనాడు రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు టీవీకేలో చేరారు. ఇక తాజాగా.. అంబ సముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌ ప్రభాకర్‌కు అందజేశారు. ఈ క్రమంలో టీవీకే లో చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

10TV Telugu31 May, 02:37 am
సీఎం విజయ్ ని పొగిడిన రామ్ చరణ్.. తమిళనాడులో 'పెద్ది'కి ఫుల్ సపోర్ట్

Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. పెద్ది సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో దేశంలోని పలు నగరాల్లో పెద్ది ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా మే 30న తమిళనాడు చెన్నైలో పెద్ది ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడిన అనంతరం ఇటీవల తమిళనాడుకు సీఎం అయిన హీరో విజయ్ గురించి మాట్లాడారు. అలాగే చరణ్ చిన్నప్పుడు చెన్నైలోనే పెరగడంతో తమిళ్ వచ్చు కాబట్టి స్పీచ్ ఆల్మోస్ట్ తమిళ్ లోనే మాట్లాడారు. Also Read : Vijay Trisha : సీఎం అయ్యాక తొలిసారి విజయ్.. త్రిషతో కలిసి ఒకే కార్ లో వచ్చి.. వీడియోలు వైరల్.. చరణ్ విజయ్ గురించి మాట్లాడుతూ.. ఇటీవల తమిళనాడు సీఎం అయిన మన జోసఫ్ విజయ్ సర్ కి శుభాకాంక్షలు. ఆయన పీక్ కెరీర్ లో ఉన్నప్పుడు, స్టార్ డమ్ ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. ఇందుకు ఒక సినిమా వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను. తమిళనాడు ప్రజలకు, విజయ్ సర్ కి శుభాకాంక్షలు అని అన్నారు. దీంతో తమిళనాట విజయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విజయ్ ఫాన్స్, టీవీకే పార్టీ కార్యకర్తలు చరణ్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమాకు విజయ్ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ వచ్చినట్టే. అలాగే ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం అక్కడ సినిమాలకు అడక్కుండానే అయిదు షోలకు పర్మిషన్ ఇచ్చేసింది. దీంతో పెద్ది సినిమాకు కూడా అయిదు షోలకు పర్మిషన్స్ వచ్చేసినట్టే అని తెలుస్తుంది. తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా పెద్ది

Tvk Party News Keyword | Telugu Digital