translateexpand_more

Gossip Garage News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu31 May, 12:30 am
పోలవరం ఎమ్మెల్యేకి పవన్ కల్యాణ్ 4 వారాల డెడ్ లైన్ .. ఆంతర్యమేంటి

Pawan Kalyan-Chirri Balaraju: ఇన్నాళ్లు పాలన మీద పట్టు సాధించేందుకు టైమ్ కేటాయించిన పవన్.. ఇప్పుడు పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నేతలకు పిలిచి మరీ క్లాస్‌లు ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు.. పవన్‌ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించడం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నాలుగు వారాల్లో వివాదాల నుంచి ఆయన బయటపడగలరా.. ఇకపై బాలరాజుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి.. పోలవరం రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో.. ఈ మధ్య జనసేనాని పవన్‌ వన్ టు వన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాములుగా రివ్యూలు అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై జరుగుతాయ్. ఐతే వివాదాలపై ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న పవన్‌.. వాటిని సెట్‌రైట్ చేసుకునేందుకు నాలుగు వారాల డెడ్‌లైన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నాలుగు వారాల్లో బాలరాజు అంతా క్లియర్ చేసుకుంటారా.. ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి.. అసలు ఆయనకు ఎందుకు పవన్ డెడ్‌లైన్‌ విధించారు.. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అని ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ కనిపిస్తోంది. పంచాయితీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించగా.. క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పవన్‌ నిలదీసినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపు, టెండర్ల వెనక తప్పులు జరిగాయని విపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆరోపణలు వినిపించడం పవన్‌కు కోపం తెప్పించింది. దీంతో నాలుగు వారాల్లో పనులు స్పీడప్ కావాలని.. ఆరోపణలకు చెక్‌ పెట్టాలని.. నాలుగు వారాల డెడ్‌లైన్ పెట్టి ఎమ్మెల్యేకు పవన్ అల్టిమేటం జారీ చేశారని టాక్. చిర్రి బాలరాజుకు కేవలం ఆర్థిక,

10TV Telugu30 May, 04:12 pm
పెద్దల సభకు షర్మిల? ఇందులో నిజమెంత, కర్ణాటక నుంచే ఎందుకు

Ys Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు.. రాజ్యసభ సీటు ఇస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. కర్ణాటక నుంచి ఆమెను పెద్దల సభకు పంపుతారంటూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సరిగ్గా రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు ముందు.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీని ష‌ర్మిల క‌ల‌వ‌డంతో.. ఈ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఏది నిజం.. షర్మిలను నిజంగా రాజ్యసభకు పంపిస్తారా.. అదే నిజమైతే కర్ణాటక నుంచే ఎందుకు.. అసలు హస్తం పార్టీ వ్యూహాలు ఏంటి.. దక్షిణాది కాంగ్రెస్ రాజకీయాల్లో.. ఒక ఆసక్తికరమైన సమీకరణ తెరపైకి వచ్చింది. ఏపీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సీటు అంటూ జరుగుతున్న ప్రచారం.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక అటు షర్మిల కూడా.. పార్లమెంట్‌లో అడుగుపెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని టాక్‌. దీని కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటకను ఆమె వేదికగా ఎంచుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ముందుగా వైఎస్ఆర్‌టీపీ పేరుతో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల.. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ సమయంలో అధిష్టానం తనకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రాజ్యసభ బెర్త్ కోసం షర్మిల తన ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లిన ఆమె.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి చర్చించారు. దీంతో షర్మిలకు రాజ్యసభ అవకాశం అనే ప్రచారం మరింత బలంగా వినిపిస్తోంది. ఓవైపు షర్మిల ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో పాజిటివ్‌గానే ఉందనేది మరికొందరి నుంచి వినిపిస్తున్న

10TV Telugu01 Jun, 05:25 pm
కాంట్రవర్సీకి కేరాఫ్ గా టీడీపీ ఎమ్మెల్యే థామస్.. సొంత పార్టీ నేతలు, అధిష్టానం సీరియస్.. ఎందుకు

Mla Thomas: నోరు జారి, మళ్లీ నాలుక కరుచుకున్నారు ఆ టీడీపీ ఎమ్మెల్యే. సొంత పార్టీకి చెందిన సహచర ఎమ్మెల్యేలపైనే ఇండైరెక్ట్‌ కామెంట్స్‌ చేశారు. ఆయనతో పాటు వేదిక పంచుకున్న ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వ్యవహారం కాస్త పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో ఆ ఎమ్మెల్యే చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ఆ ఎమ్మెల్యే తీరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా సీరియస్‌గానే ఉన్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? అసలేం జరిగింది? చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రూటే సపరేటు. డాక్టర్ వృత్తిలో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేసి న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడం లేదంటూ గతంలో ఆయన చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. ఇదే విషయంపై పలుమార్లు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు కూడా. లేటెస్ట్‌గా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే థామస్. మీడియా సమావేశం సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..సొంత ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మట్టి అక్రమ రవాణతో సహా ఏ చిన్న ఘటన జరిగినా మీడియాలో హైలెట్‌ చేస్తారని..అదే అగ్రవర్ణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏం జరిగినా వాటిపై మీడియాలో కథనాలు రావడం లేదంటూ థామస్‌ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారాయి. అంతటితో ఆగకుండా ఆయన..పక్కనే ఉన్న చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి మట్టి అక్రమంగా బయటకు వెళ్లడం లేదా? వాటిని ఎందుకు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ..మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు వైరల్‌ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు స్వతహాగానే చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాశ్‌లకు ఆగ్రహం తెప్పించినా..సొంత పార్టీ సహచర ఎమ్మెల్యే కావడంతో కౌంటర్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. చివరకు థామస్ కామెంట్స్‌ పార్టీ అధిష్టానం చెవిన పడటంతో పార్టీ పెద్దలు సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాస్, థామస్‌ను సంజాయిషీ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో పల్లా శ్రీనివాస్ ను కలిసి తాను చేసిన వ్యాఖ్యలపై థామస్ వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్‌గాను కొనసాగుతున్న ఎమ్మెల్యే థామస్‌ను పార్టీ గట్టిగానే మందలించినట్లు చర్చించుకుంటున్నారు. అయితే జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం థామస్ తీరుపై కొంతకాలంగా గుర్రుగానే ఉన్నారట. ఎస్సీ ఎమ్మెల్యేలు, అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అంటూ జిల్లాలో ఎమ్మెల్యేలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారట. తనపై ఆరోపణలు వస్తే వాటిని ఖండించాల్సింది పోయి..పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బురద అంటించడం ఏంటని జిల్లా ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారట. గతంలోనూ ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని కూడా కొందరు ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. మరోసారి థామస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని ఒకరిద్దరు జిల్లా ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్లు టాక్. Also Read: ఏపీలో లోకల్ వార్..! కూటమి పార్టీల ప్లానింగ్స్ ఏంటి? ఏకగ్రీవాలకు వైసీపీ చెక్ పెట్టగలదా?

10TV Telugu01 Jun, 03:53 pm
మాట జారొద్దు, లైన్ దాటొద్దు.. దూకుడుగా వెళ్తున్న నేతలకు కేటీఆర్ క్లాస్

KTR : రుకో జరా. సబర్ కరో. దూకుడు మంచిదే. కానీ లైన్ దాటొద్దు. టగ్ స్లిప్ కావొద్దు. అటెన్షన్ కోసమో..లేక మీడియాలో హైలెట్‌ కావడం కోసమో నోరు జారితే అసలుకే ఎసరు వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాం. కాస్త జాగ్రత్త. ఆచితూచి మాట్లాడండి అంటూ..పార్టీ లీడర్లకు దిశార్దేశం చేశారట బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏది పడితే అది మాట్లాడి పార్టీని చిక్కుల్లో పడేయొద్దని.. కారు స్పీడుకు బ్రేకులు వేయొద్దని డైరెక్షన్స్ ఇచ్చారట. బాల్క సుమన్‌ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం..దూకుడుగా వెళ్తున్న నేతలను కంట్రోల్‌ చేసే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. బహిరంగ సమావేశం అయినా..ఇంటర్నల్‌ మీటింగ్ అయినా..సోషల్ మీడియాలో పోస్ట్ అయినా..కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఏడిపడితే అది మాట్లాడి మీరు చిక్కుల్లో పడొద్దు. పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దు. కారు పార్టీ యువ నేతలకు..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ తీసుకున్నారంటూ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. బాల్క సుమన్ ఎపిసోడ్‌తో అలర్ట్ అయిన గులాబీ పార్టీ అధిష్టానం దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్‌ నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విమర్శలు ధీటుగా సమాధానం చెప్పాల్సిందే కానీ వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు మాత్రం కంట్రోల్ తప్పొద్దని ఆదేశించినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యాఖ్యలు, నమోదైన కేసులు, అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశముందని భావించి బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుల భాష, ప్రజా వేదికలపై వారు చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువనేతలు, సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండే నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా

10TV Telugu30 May, 12:30 am
దొంతి మాధవరెడ్డి మంత్రి పదవికి అడ్డుపడుతోంది ఎవరు

Madhava Reddy Donthi: అందరూ ఒకవైపు.. తాను ఒకవైపు.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇదే ఫిక్స్ అయ్యారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ ప్రచారం వేళ.. ఆయన లోలోపల మదనపడుతున్నారట. అమాత్య పదవిపై ఆశలు పెట్టుకుంటే.. నీళ్లు జల్లుతున్నారని ఫీల్ అవుతున్నారట. ఇంతకీ ఆయన మంత్రి పదవికి అడ్డు వచ్చేది ఎవరు.. తన చుట్టూ ఎలాంటి రాజకీయం నడుస్తోందని మాధవరెడ్డి ఫీల్‌ అవుతున్నారు.. ఇప్పుడేం చేయబోతున్నారు.. ఓరుగల్లు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్‌. మిగతా నేతల సంగతి ఎలా ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలు.. మంత్రి పదవిపై భారీగా ఆశలు పెంచుకున్నారు. బెర్త్ కోసం అటు హస్తిన చుట్టూ.. ఇటు సీఎం రేవంత్ చుట్టూ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. మంత్రిపదవి కోసం.. ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్‌ రెడ్డి లాంటి నేతలు కొత్త వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. 32 ఏళ్లుగా ఓరుగల్లుకు చెందిన రెడ్డి సామాజికవర్గ నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని.. ఈసారి ఆ లోటు భర్తీ చేయాలని అంటున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అయితే.. సీఎం రేవంత్‌తో సహా.. సీనియర్ నేతలు, అధిష్టానం ముందు సరికొత్త వాదనలు తీసుకొస్తున్నారట. సీతక్క, కొండా సురేఖకు కేబినెట్‌లో స్థానం కల్పించడంపై.. పార్టీని స్ట్రాంగ్ చేయడంలో వాళ్ల మీద మీద చర్చ పెడుతూ సరికొత్త పాయింట్ తెరమీదకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని టాక్‌. నిజానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి..

10TV Telugu29 May, 09:20 am
చెర్రీతో సుక్కు మూవీకి దేవిశ్రీ మ్యూజిక్

Devi Sri Prasad : డైరెక్టర్‌గా సుకుమార్ అన్ని సినిమాలకు మ్యూజిక్ అందించింది డీఎస్పీనే ! ఇద్దరి కాంబోలో ఎన్నో సూపర్‌ హిట్‌ ఆల్బమ్స్ వచ్చాయి. పుష్క ఫ్రాంచైజీ అయితే.. ఇండియావైడ్‌గా మ్యూజిక్ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఐతే పుష్ప 2 టైమ్‌లో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఐతే అదంతా ఉట్టి గాసిప్పే అని ఇప్పుడు తేలిపోయింది. పెద్ది తర్వాత రామ్‌చ‌రణ్‌ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో ఓ మూవీకి సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్‌ డైరెక్ట్‌గా మళ్లీ దేవిశ్రీప్రసాద్ పేరే బలంగా వినిపిస్తోంది. పెద్ది సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ.. ఆ ఆల్బమ్ అంచనాలకు తగ్గ రీచ్ సాధించలేదనే ఓపీనియన్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో సుకుమార్ కూడా.. తన టేస్ట్‌కు సరిపోయే.. వైబ్‌తో మ్యాచ్ అయ్యే దేవిశ్రీప్రసాద్‌తోనే మళ్లీ పని చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్‌. గతంలో ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఊపు ఊపిన ఈ కాంబో.. మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని ఫిక్స్ అయిందట. దీంతో చెర్రీ, సుక్కు, రాక్ స్టార్‌ మూవీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

10TV Telugu30 May, 05:01 pm
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాలిటిక్స్ లో ట్విస్టులు..! తెలంగాణవాదులు ఎత్తుకున్న కొత్త నినాదమేంటి

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాలిటిక్స్‌లో ట్విస్టులు! తెలంగాణవాదుల తీరులో యూటర్న్ కనిపిస్తోందా? వాళ్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందా? తెలంగాణవాదుల ఎత్తుకున్న కొత్త నినాదమేంటి ? విగ్రహాలకు, రాజకీయాలకు లింక్ కనిపిస్తోందా ? Statue Row: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తెలంగాణ రాజకీయాలను మలుపులు తిప్పుతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రతిమకు, పాలిటిక్స్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అలానే ఉంది సీన్ మరి! ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం పేరు చెప్తే చాలు వ్యతిరేకించిన తెలంగాణవాదులు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? వాళ్ల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందా.. తెలంగాణవాదులు ఎత్తుకున్న కొత్త నినాదమేంటి.. దానికి కారణాలు ఏంటి.. రాష్ట్ర విభజనకు ముందు.. విభజన తర్వాత.. తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది అనేది కాదనలేని సత్యం. ఇప్పటికీ తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయ్‌. విడిపోయినా సరే.. వివాదాలు ఆగడం లేదు. ఏపీ, తెలంగాణ మధ్యలో.. నీటి పంపకాల కాంట్రవర్సీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ జల వివాదాలు తెలంగాణ రాజకీయ పార్టీలకు.. అస్త్రంగా మారుతూనే ఉన్నాయ్‌. ఇలాంటి తరుణంలో తెలంగాణవాదుల నుంచి కొత్త ప్రపోజల్ తెరపైకి వచ్చింది. ఇదే ఇప్పుడు రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత తెలంగాణవాదుల కొత్త ప్రతిపాదన.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను.. ఇక్కడ కూడా పెడుతోంది తెలంగాణ సర్కార్‌.. రవీంద్రభారతిలో ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ విగ్రహావిష్కరణ సమయంలో ప్రభుత్వంపై తెలంగాణవాదులు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని.. రవీంద్రభారతిలో ఎందుకు పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఆ వివాదంపై ఇప్పటికీ చర్చ జరుగుతుండగానే..

10TV Telugu29 May, 03:53 pm
సిట్టింగ్ ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీలు... భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్ పాలిటిక్స్

Karimnagar – Congress Vs Brs: సిట్టింగ్‌లు వర్సెస్‌ మాజీలు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయం సెగలు కక్కేలా చేస్తోంది. ఇదీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీన్‌. మంథని, ధర్మపురి.. నిన్నటికి నిన్న జగిత్యాల. ఆ రచ్చ రగులుతుండగానే.. ఇప్పుడు పెద్దపల్లి పంచాయితీ తెరమీదకు వస్తోంది. కరీంనగర్ జిల్లాలో అసలేం జరుగుతోంది. పెద్దపల్లి పొలిటికల్‌ ఫైట్‌ వెనక అసలు కారణం ఏంటి.. ఓపెన్ ఛాలెంజ్‌లకు వరకు ఎందుకు వెళ్లింది.. అప్పుడైనా.. ఇప్పుడైనా.. కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కాకమీద కనిపిస్తుంటాయ్‌. ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో సెగలు పుట్టిస్తుంటాయ్‌. ఇప్పుడు కూడా అలాంటి సీనే కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీల మధ్య జరుగుతున్న యుద్ధం.. పాలిటిక్స్‌పై మరింత ఆసక్తి పుట్టిస్తున్నాయ్‌. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇద్దరు నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో మంథని ప్రతీరోజూ రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది. ఇక అటు ధర్మపురిలోనూ సేమ్‌ సీన్‌. మంత్రి అడ్లూరి వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల మధ్య రాజకీయ యుద్ధం పీక్స్‌లో కనిపిస్తోంది. మీరేం చేశారంటే.. మీరేం చేశారంటూ.. ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇక నిన్నటికి నిన్న జగిత్యాల పరిణామాలు క్రియేట్‌ చేసిన పొలిటికల్ హీట్ అంతా ఇంతా కాదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌.. మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి మధ్య భారీ యుద్ధమే జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. వీటన్నింటిపై చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు పెద్దపల్లి రచ్చ తెరమీదకు వచ్చింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

10TV Telugu28 May, 06:28 pm
కాంగ్రెస్ కోసం కనుగోలు.. బీఆర్ఎస్ కోసం ! 2028 ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీల స్ట్రాటజీలు

Sunil Kanugolu – Prashant Kishor: అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లకు పైగా టైమ్ ఉన్నా.. యుద్ధం మొదలైంది అనే రేంజ్ లో తెలంగాణలో పార్టీల వ్యూహాలు కనిపిస్తున్నాయ్. గ్రౌండ్ లెవల్‌లో పార్టీని స్ట్రాంగ్ చేసేందుకు.. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్.. ఎవరికి వాళ్లు పక్కా స్ట్రాటజీలతో వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయ్. ఇందుకోసం రెండున్నరేళ్ల ముందు నుండే వ్యూహకర్తలను కూడా రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నాయని టాక్. కాంగ్రెస్ కోసం సునీల్ కనుగోలు.. బీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ మరోసారి తెలంగాణలో ఎంటర్ కాబోతున్నారనే గుసగుస.. తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. ఇది నిజమేనా.. అసలేం జరుగుతోంది.. ఏ పార్టీ అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే తెలంగాణ రాజకీయం సెగలు కక్కుతోంది. 2028 ఎన్నికల్లో గెలుపు కోసం.. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య యుద్ధం ఇప్పటికే పీక్స్‌లో కనిపిస్తోంది. ఐతే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. ప్రభుత్వ పథకాలు కూడా.. జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదనే ఆలోచనలో ఉన్నారు. ఇకపై గేర్ మార్చాల్సిందేనని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికోసం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహాకర్తగా పనిచేసి.. విజయానికి సహకరించిన సునీల్ కనుగోలు వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య కో ఆర్డినేషన్ పెంచడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం కోసం.. తన కోర్ టీమ్ లో కనుగోలును సీఎం చేర్చుకోబోతున్నారని.. ఆయనకు కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 2023 ఎన్నికల్లో అధికారం చేపట్టడం వెనక

10TV Telugu28 May, 04:13 am
ఎల్లమ్మలో హీరోయిన్ గా మమిత బైజు

Yellamma : దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఎలమ్మ మూవీకి సంబంధించి హీరోయిన్‌ ఎవరు అనే దానిపై మేకర్స్ చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు. ముందు సాయిపల్లవి ఆ తర్వాత కీర్తి సురేష్‌ మధ్యలో మృణాల్ ఠాకూర్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడు మమితా బైజు పేరు దాదాపు ఫైనల్‌ అయినట్లే అనే డిస్కషన్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా ఆయన పక్కన కొత్త ఫేస్ కోసం చూస్తున్నారట. దీనికోసం మమిత పేరును ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఫ్రెష్ జోడీగా మంచి బజ్ క్రియేట్ అవుతుందనేది మేకర్ ఒపీనియన్‌. Kevvu Kartheek : భార్య సీమంతం వేడుకలు.. ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. ప్రేమలు, డ్యూడ్‌లాంటి సినిమాలతో మమిత తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. ధనుష్‌ హీరోగా వచ్చిన కర మూవీలో కనిపించింది మమిత. సెల్లి అనే మిడిల్‌క్లాస్ అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. కర మూవీతో మమితకు మంచి గుర్తింపు రాగా.. పెద్ద బ్యానర్ల అటెన్షన్‌ డ్రా చేసింది. అదే ఎల్లమ్మలో చాన్స్‌ దక్కేలా చేసిందని, డీఎస్పీ పక్కన మమిత దాదాపు ఫైనల్ అయినట్లే అనే గాసిప్స్‌ జోరుగా వినిపిస్తున్నాయి.

10TV Telugu27 May, 05:13 am
పీక్స్ కు చేరిన పెద్ది మూవీ క్రేజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజేనా

Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న‌ ఈ సినిమాని వృద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. పెద్ది సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు కొన్ని గాసిప్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో జూన్ 2న ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారీ సెటప్, స్టార్ స్టడెడ్ గెస్ట్ లిస్ట్, ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి ఈ వేడుకను పెద్ద సెలబ్రేషన్‌లా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. Ranveer Singh: ధురంధర్ నటుడిపై నిషేధం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్.. ‘డాన్ 3’ వివాదంలో సంచలన నిర్ణయం ఈ ఈవెంట్ ద్వారా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసి రిలీజ్‌కు ముందు భారీ మైలేజ్ సంపాదించాలనే ఆలోచనలో ఉన్నారట. దీనిలో భాగంగా స్పెషల్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఆహ్వానించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. బన్నీ హాజరైతే ఈ ఈవెంట్ రేంజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే ఆయన స్పీచ్, ప్రెజెన్స్ ఈ సినిమాకు అదనపు హైప్ తీసుకురాగలదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చేవరకు క్లారిటీ లేదు కానీ.. ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ పెంచుతోంది.

10TV Telugu29 May, 02:46 pm
లింగమనేనా? నాగబాబా? పెద్దల సభకు పవన్ ఎవరిని పంపిస్తారు

Janasena Rajya Sabha Race: జనసేనలో రాజ్యసభ సందడి కనిపిస్తోంది. మరి పార్టీ అధినేత ఆలోచన ఏంటి.. కూటమిలో భాగంగా జనసేనకు ఒక్క స్థానం రాబోతుండగా.. అది ఎవరికి ఇవ్వబోతున్నారు.. జనసేన సభ్యుడిగా మొదటిసారి రాజ్యసభలోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారు? సొంత వాళ్లకా, పార్టీలో ఉన్నవాళ్లకా, లేదంటే పార్టీకి అండదండలు అందిస్తున్న వారికా.. అవకాశం దక్కబోయేది ఎవరికి.. ఇంతకీ పవన్ మనసులో ఉన్న పేరు ఏంటి.. ఏపీలో రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. నాలుగు స్థానాలకు ఎన్నిక జరగబోతుంది. ఇవన్నీ కూటమి పార్టీలకు దక్కబోతున్నాయ్‌. ఐతే పొత్తులో భాగంగా వీటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. జనసేన తరఫున మొదటిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టబోయేది ఎవరు.. అవకాశం ఎవరికి దక్కబోతోందనే చర్చ పార్టీలో జరుగుతోంది. జనసేనకు ఇది మొట్టమొదటి స్థానం కావడంతో.. పెద్దల సభకు పవన్ ఎవరిని పంపిస్తారు.. ఎలాంటి సమీకరణాలు లెక్కలోకి తీసుకుంటారనే ఆసక్తి పార్టీ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ కనిపిస్తోంది. రాజ్యసభ స్థానం విషయంలో పవన్ కల్యాణ్‌ భారీగా కసరత్తు చేస్తున్నారు. ఇక అటు ఈ ఒక్క స్థానం కోసం ఆశావహులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక అటు రేసులో కొందరి పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయ్. ఆ లిస్టులో మొదటిగా వినిపిస్తున్న పేరు.. లింగమనేని రమేష్. పవన్‌తో పాటు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌కు ఆయన అత్యంత సన్నిహితులు. పైగా కష్టకాలంలో పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఇవి లింగమనేని రమేష్‌కు కలిసి వచ్చే అంశాలు. జనసేనకు రాజ్యసభ అవకాశం ఎప్పుడు వచ్చినా.. లింగమనేని రమేష్‌కి ఇస్తారనే పార్టీలో దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. ఇక ఆయన కూడా

10TV Telugu27 May, 05:32 pm
బీఆర్ఎస్ లోనూ సుమన్ వ్యాఖ్యల కలకలం.. కేసీఆర్ సీరియస్..! ఏం జరగబోతోంది

Balka Suman: సింగరేణి భవన్ కాలబెట్టాలి.. రైల్వే పట్టాలు కోసేయాలి.. ఇక మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలనే కాదు.. సొంత పార్టీని కూడా షేక్ చేస్తున్నాయట. ఇక ఈ మాటలు గులాబీ బాస్ దృష్టికి కూడా చేరడంతో ఆయన సుమన్ పై గుస్సా అయ్యారట. కేటీఆర్ కూడా ఈ వ్యాఖ్యలపై సీరియస్ కాగా.. అటు అధికార కాంగ్రెస్ నేతలు కూడా కేసుల మీద కేసులు పెడుతున్నారట. అసలు సుమన్ వ్యాఖ్యలు క్రియేట్ చేస్తున్న ప్రకంపనలు ఏంటి.. ఇప్పుడేం జరగబోతోంది.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయ్. సింగరేణి కార్మిక సంఘ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు.. రాజకీయవర్గాల్లో, సోషల్‌ మీడియాలో కలకలం క్రియేట్ చేస్తున్నాయ్. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, సింగరేణి భవన్ కాలబెట్టాలి.. జీఎం ఆఫీస్ ముట్టడిద్దాం, రైల్వే లైన్లు కోసేద్దాం లాంటి పదాలు.. వివాదాస్పదంగా మారాయ్. సుమన్ వీడియోలు వైరల్ కావడంతో.. అధికార పార్టీతో పాటు మిగలిన రాజకీయ పక్షాలు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించాయ్. సుమన్‌ది సాధారణ ఆవేశపూరిత ప్రసంగం కాదని.. కారు పార్టీలో పెరిగిపోతున్న అసంతృప్తికి.. కార్యకర్తల్లో తగ్గుతున్న ఉత్సాహానికి.. నాయకత్వంపై పెరుగుతున్న ఒత్తిడికి సంకేతమంటూ బీఆర్ఎస్‌ను ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తున్నాయ్. ఇక అటు బాల్క సుమన్ వ్యాఖ్యలు.. గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలంగాణభవన్ వర్గాలు అంటున్నాయ్. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేడర్ ను మళ్లీ యాక్టివ్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉందనే టెన్షన్ గులాబీ వర్గాల్లో కనిపిస్తోంది.

10TV Telugu29 May, 05:31 pm
జగనన్న టెక్ ఫోర్స్.. సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్న వైసీపీ

Ysrcp Tech Force: వైసీపీ సోషల్‌ మీడియా పవర్‌ రేంజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సోషల్ మీడియాని మరింత విస్తృతంగా యూజ్‌ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. గ్రాస్ రూట్ లెవల్‌లో సోషల్‌ మీడియా పవర్‌ ఏంటో చూపేందుకు రెడీ అవుతోంది. దీని కోసం సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. పార్టీని స్ట్రాంగ్‌ చేయడంతో పాటు.. కూటమి సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా.. జెన్‌జీ టీమ్‌ను రెడీ చేస్తోంది వైసీపీ. వైసీపీ టెక్ ఫోర్స్ అంటూ ఓ విభాగం ఏర్పాటు చేసింది. మరి దీని స్పెషాలిటీ ఏంటి.. టెక్నాలజీ ఇప్పుడు ప్రతీ దాంట్లో భాగమైంది. చివరికి రాజకీయాల్లో కూడా ! అదే టెక్నాలజీని ఉపయోగించుకొని పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ. పార్టీకి టెక్నాలజీ జోడించి.. కేడర్‌లో కొత్త ఉత్సాహం తీసుకురావాలని పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న జగన్.. కేడర్‌ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దీంతోపాటు పార్టీ సోషల్‌ మీడియాను స్ట్రాంగ్ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి రూకల్పన చేశారని తెలుస్తోంది. జగనన్న టెక్‌ ఫోర్స్‌తో.. ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, టెక్నాలజీ వినియోగంపై అవగాహన ఉన్న వారిని ఒక తాటిపైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేశారట. పార్టీని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు.. అధికార పార్టీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం.. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలను.. జగనన్న టెక్‌ ఫోర్స్‌ ద్వారా చేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019లో అధికారంలోకి రావడంలో.. వైసీపీ సోషల్ మీడియా సైన్యం

10TV Telugu29 May, 12:30 am
ఏకగ్రీవమైందా.. పోస్టులు గోవిందా! ఇంచార్జిలకు జగన్ హెచ్చరికల వెనుక కారణాలేంటి

Ys Jagan Warning: గెలవనీ.. ఓడనీ.. ఫలితం ఎలా అయినా ఉండనీ.. పోటీలో మాత్రం ఉండాల్సిందే ! ఏకగ్రీవం అయిందా ఊరుకోను. పోటీలో ఉండండి పోరాడండి. ఎక్కడైనా ఏకగ్రీవం అయిందా.. పోస్టులు ఊస్టు అయిపోతాయ్‌ జాగ్రత్త. ఇదీ నియోజకవర్గ ఇంచార్జిలకు జగన్ ఇచ్చిన వార్నింగ్‌.. ఈ రేంజ్‌లో అసలు వైసీపీ అధినేత హెచ్చరికలు ఎందుకు ఇచ్చినట్లు.. అసలు కారణాలు ఏంటి.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది.. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయ్‌. ఈ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని అటు అధికార కూటమి పార్టీలు.. ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయ్‌. ఎలాగైనా సరే.. స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయ్‌. స్థానిక ఎన్నికలను వైసీపీ మరింత సీరియస్‌గా తీసుకుంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. గ్రౌండ్ లెవల్‌ కేడర్‌లో స్థైర్యం నింపాలన్నా.. జోష్‌ తీసుకురావాలన్నా.. లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాల్సిందే అని ఫిక్స్ అయింది. దీనికోసం పార్టీ నేతలు, కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు అధినేత జగన్‌. రెడీగా ఉండడం కాదు.. ఎక్కువ స్థానాలు గెలిచి తీరాల్సిందేనని టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో..స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నియోజకవర్గ ఇంచార్జిలకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు జగన్‌. ఎన్నికలు అయిపోయి రెండేళ్లయినా.. కొందరు నేతలు నియోజకవర్గాలకు అందుబాటులో ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో.. 34 మంది చోట్ల అసలు ఇంచార్జిలు అందుబాటులో ఉండటం లేదని ఫైర్ అయ్యారు. వీళ్లంతా పద్దతి మార్చుకోవాలని సూచించిన జగన్.. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ మీద పైచేయి సాధించాలని.. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక

10TV Telugu26 May, 12:30 am
Pawan Kalyan: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క ! తీరు మారిందా సరే.. లేదంటే మామూలుగా ఉండదు. ఇలానే కనిపిస్తున్నారు జనసేన...

Pawan Kalyan: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క ! తీరు మారిందా సరే.. లేదంటే మామూలుగా ఉండదు. ఇలానే కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఫైర్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే.. మరోవైపు...

10TV Telugu26 May, 01:00 am
Arvind Vs Sanjay: జగడానికి కేరాఫ్‌గా మారుతోంది జగిత్యాల. నిన్నటివరకు జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య సాగిన పంచాయితీ. హద్దులు దాటిన ఆవేశం.. తూటాలను...

Arvind Vs Sanjay: జగడానికి కేరాఫ్‌గా మారుతోంది జగిత్యాల. నిన్నటివరకు జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య సాగిన పంచాయితీ. హద్దులు దాటిన ఆవేశం.. తూటాలను మించి పేలిన మాటలు. జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో కథ సుఖాంతం అనుకున్నారంతా !...

10TV Telugu23 May, 03:03 pm
ఇక చెప్పడాల్లేవ్.. ఓన్లీ యాక్షనే..! ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసినట్లేనా..?

- Cm Chandrababu: పవర్‌లోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఒకటే మాట. - మళ్లీ గెలిచి రావాలన్న విషయం మర్చిపోకండి. - వన్ టైమ్‌ ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే మీ ఇష్టం.

10TV Telugu28 May, 12:30 am
తెలంగాణ పీసీసీ చీఫ్ కు ఆ జిల్లాలోకి నో ఎంట్రీ..! ఏంటా జిల్లా, ఎందుకు నో ఎంట్రీ

Mahesh Kumar Goud: ఏంటి ఈ పరిస్థితి అనుకుంటున్నాయట తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌కు ఆ జిల్లాలో మాత్రం నో ఎంట్రీ బోర్డు దర్శనమిస్తోందట.. కాంగ్రెస్ రథసారధిగా రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సిన పీసీసీ చీఫ్.. నిజంగా ఆ జిల్లాలో అడుగు పెట్టలేకపోతున్నారా..? అక్కడ సమావేశం పెట్టాలని రెండు నెలల నుంచి చూస్తున్నా.. జిల్లా నేతలు సహకరించడం లేదా.. ఇంతకీ ఆయనను ఇబ్బంది పెడుతున్న నేతలు ఎవరు.. ఆ జిల్లా ఏంటి.. ఏ పార్టీలో అయినా.. అధ్యక్షుడిదే తుది నిర్ణయం. ఐతే తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందా అంటే.. అవును అనే అంటున్నాయ్ పొలిటికల్ వర్గాలు. పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా.. పార్టీపై పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ పలువురు నేతలు.. ఆయనకు సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీపై పట్టు సాధించలేకపోవడంతో.. పీసీసీ చీఫ్ తీరుపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. హస్తం పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. గ్రౌండ్ లెవల్ లో పార్టీని మరింత స్ట్రాంగ్ చేయడంపై ఫోకస్ పెంచింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని కోసం జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు పీసీసీ చీఫ్. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. ఒక్క జిల్లా విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఇబ్బందులు తప్పడంలేదనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో ప్రాంతానికి వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని

10TV Telugu27 May, 04:07 pm
మహానాడు వేదికగా టీడీపీ చరిత్రాత్మక ప్రకటన.. వైసీపీ స్టాండ్ ఏంటి? టార్గెట్ అయ్యే చాన్స్ ఉందా

Tdp Mahanadu 2026: మహానాడు వేదికగా టీడీపీ చరిత్రాత్మక ప్రకటన చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే.. మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మహానాడులో తీర్మానం చేశారు. ఈ ఒక్క ప్రకటన.. ఏపీ రాజకీయాన్ని ఎలా మార్చబోతోంది. విపక్షాలకు ఒక రకంగా ఇది టీడీపీ విసిరిన సవాల్ అనుకోవచ్చా.. ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంది.. మహానాడు మొదటిరోజే చరిత్రలో నిలిచే పోయే సంఘటన కనిపించింది. గతానికి భిన్నంగా హైబ్రిడ్‌ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తున్న టీడీపీ.. పూర్తిగా డిజిటల్ వేదికపై మీటింగ్స్ నిర్వహిస్తోంది. స్త్రీశక్తి అనే థీమ్‌తో ఈసారి మహానాడు నిర్వహిస్తున్న టీడీపీ.. మహిళా సాధికారత, యువత పాత్ర, సామాజిక సమతుల్యత లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను రూపొందించింది. ఐతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహానాడు వేదిక నుంచి నారా లోకేష్.. భారీ అనౌన్స్‌మెంట్ చేశారు. మహిళల కోసం టీడీపీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని మహానాడు వేదికపై నుంచి ప్రకటించారు. మహిళా రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా.. భవిష్యత్‌లో అన్ని ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు రిజర్వ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అవుతోంది. ఎన్నికల టైమ్‌లో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయని.. ఐతే ఎలక్షన్స్ తర్వాత మహిళలను మర్చిపోతాయని.. టీడీపీ విధానం.. నినాదం రెండూ మహిళల అభ్యున్నతే అన్నారు లోకేశ్‌. మహిళల విషయంలో గతంలో టీడీపీ చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే.. చంద్రబాబు సీఎంగా విద్యా సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థుల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించడంతో టీడీపీ మరో మందుడుగు వేసింది.