translateexpand_more

Telangana Politics News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 03:54 pm
కేసీఆర్, రేవంత్ వేరే రాష్ట్రాలకు పోవచ్చు.. పవన్ కల్యాణ్ సభ పెట్టుకోకూడదా? కాంగ్రెస్ పై రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao: తెలంగాణలో జనసేన సభకు అనుమతించకపోవడంపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో ఉందని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సభ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమేంటి అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. ”పవన్ కల్యాణ్ ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేశంలో అనేకమంది అనేక ప్రాంతాలకు వెళ్లి మాట్లాడుతుంటాం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మీడియాతో చిట్ చాట్ చేస్తానే ఉంటారు. మరో రాష్ట్ర డిప్యూటీ సీఎం పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ లేదా సభ పెడితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం నాకైతే కనిపించడం లేదు. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తారు. కేసీఆర్ వేరే రాష్ట్రానికి పోయి రైతులకు పైసలు ఇచ్చి వస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ ఎన్డీయేలో భాగం. ఆయనను మేము ఎలా వేరు చేస్తాం. ఆయన ఏ రాష్ట్రంలో ఉంటే ఏంటి? ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు కూడా. ఎన్డీయే భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వారు వేరే రాష్ట్రాలకు పోవద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? అని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Asianet News Telugu02 Jun, 02:32 pm
తెలంగాణ మీ జాగిరా.? పూర్తిగా ఓపెన్ అయిన ప వ న్ క ళ్యాణ్

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

10TV Telugu02 Jun, 02:22 pm
ఎక్కువ ప్యాకేజీ ఇస్తే జగన్ కి కూడా మద్దతిస్తారు..!- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Mla Anirudh Reddy: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు రావొద్దని నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో ప్యాకేజ్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ల సినిమాలో నటిస్తారు.. రాజకీయాల్లో సైతం ప్యాకేజీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే పవన్ మద్దతిస్తున్నారు అని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పవన్ ఆయనకి కూడా మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జైల్లో కలవడమే పవన్ ప్లస్ పాయింట్ అని అన్నారు. ”పవన్ కల్యాణ్ తెలంగాణకి క్షమాపణ చెప్తారని అనుకున్నా. నరదృష్టి ఉన్న దగ్గరికి పవన్ ఎందుకు రావాలి? పవన్ వెళ్ళి గుజరాత్ లో పోటీ చేయాలి. నల్లగా అయిపోతాననే పవన్ విజయవాడ వెళ్ళడం లేదు. గ్లామర్ కాపాడుకోవడం కోసమే పవన్ హైదరాబాద్ లో ఉంటున్నారు. టీటీడీ డబ్బులపై కూడా పవన్ రాజకీయం చేస్తున్నారు? పవన్ ఇంగ్లీషులో మాట్లాడింది అమిత్ షా కి అర్థం కావడానికే. కేసీఆర్, అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికే పవన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి భూముల వ్యవహారమే తెలీదు. పవన్ కబ్జా చేసిన భూమి దగ్గరికి వెళ్తే కేసులు పెడతారా? రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి పవన్ డిప్రెషన్ లో ఉన్నారు” అని అనిరుధ్ రెడ్డి అన్నారు. Also Read: తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

SkyC Media02 Jun, 12:55 pm
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టిస్తూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎవరి సొత్తు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ పుట్టిందే హైదరాబాద్ గడ్డపై అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము కేవలం రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే వ్యతిరేకించామని పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జనసేన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. తాము బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనుమతులు నిరాకరిస్తే ఇళ్ల నుంచే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ పక్క రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఆయన అభివర్ణించారు. పవన్‌కు అహంకారం ఎక్కువైందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాంగ్రెస్, జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలు ఇంటర్‌స్టేట్ రాజకీయ వివాదంగా మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2026 నుంచి 2028 మధ్య కాలంలో తెలంగాణలో బలం పుంజుకోవాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని యువత, అర్బన్ ఓటర్లే లక్ష్యంగా జనసేన వ్యూహాలు రచిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం జనసేనకు పెద్ద సవాలుగా మారనుంది. టీడీపీ, జనసేన కూటమి తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాబోయే రోజుల్లో జనసేన తెలంగాణలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూనే ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ వ్యూహం కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

10TV Telugu02 Jun, 12:03 pm
తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం.. ఇదేమైనా పాకిస్తానా?- పవన్ కల్యాణ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు జనసేనాని పవన్ కల్యాణ్. తెలంగాణలో జనసేన పోటీపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తెలంగాణలో తిరుగుతాం, పోటీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగం అని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నేడు ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోకి ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వైఎస్ హయాంలో యూత్ కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే తన్ని తరిమేశాం అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ”నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఎప్పుడూ పోటీ చేస్తుంటాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగతా. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ఎదుర్కొంటాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఈ తెలంగాణ నా భారత దేశంలో అంతర్భాగం. మీరు కూర్చోబెట్టి రాకూడదు అంటే భరించాం. పదేళ్లకు పైగా భరించాము. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం మేము. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఎమ్మెల్యేలు అయ్యారు. 12 ఏళ్లు తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. తెలంగాణలోకి ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటున్నారు. ఇలాంటి ప్రగల్బాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే… ఆరోజు వారిని తన్ని తగలేశాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు. Also Read: మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

NTV Telugu02 Jun, 12:01 pm
తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్

Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ ఫైర్‌ అయ్యారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో లక్షలాది మంది జనసేన కార్యకర్తలు ఉన్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు. జనసేన పార్టీని హైదరాబాద్ నడిబొడ్డునే స్థాపించామని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, తెలంగాణపై తమకు కొత్తగా ప్రేమ పుట్టలేదని చెప్పారు. తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించడం రాజకీయ పార్టీగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. తాను తెలంగాణలోని నాలుగు మూలలూ తిరిగానని, రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడూ కోరుకునే వ్యక్తినని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదిలాబాద్ వంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించానని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న చాలామంది అప్పట్లో అక్కడికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానంపైనే తన అభ్యంతరం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఎవరూ తనను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. తన ఇంటి చిరునామా చెప్పడానికే ప్రెస్‌మీట్ పెట్టానని, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను గతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరించారని, కానీ తెలంగాణ ప్రజల నుంచి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాల కొరత లేదా ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎవరైనా అన్యాయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందులో తాను ఉన్నా మినహాయింపు అవసరం లేదని పేర్కొన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరపాలని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే ఆస్తులను సీజ్ చేయాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ గురించి ప్రస్తావించిన పవన్ కల్యాణ్, ఆయన జీవించి ఉన్న సమయంలో చాలా మంది పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో గద్దర్ తనను సహాయం కోరగా, తాను వెంటనే వాహనం కొనిచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే తెలంగాణ అంతటా పర్యటిస్తానని, ప్రజా సమస్యలపై ఇదే విధంగా మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

NTV Telugu02 Jun, 11:47 am
బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకర్తగా తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలు, యువత ఉపాధి అవకాశాలపై మాట్లాడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఇక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని, భయపెట్టే కొద్దీ తన సంకల్పం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పలువురు వ్యక్తులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. యువరాజ్యం రోజుల నుంచి తెలంగాణ యువత తనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొన్నామని అన్నారు. వేర్పాటువాదం దేశ సమగ్రతకు భంగం కలిగించనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చనీయాంశమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చని, కానీ తాము తెలంగాణలో పర్యటిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చని, గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, అదే విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశాలపై స్పందించాలని కోరారు. ఇక, పాశం యాదగిరిపై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాము దేశ పౌరులమని, పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎలాంటి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల కోసం గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.

Andhra Jyothy02 Jun, 11:39 am
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. హైదరాబాద్,జూన్02: తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌ కల్యాణ్ వివరించారు. తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చామన్నారు పవన్ కల్యాణ్. మీ తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదన్నారు. భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతులేపేది జనసేన పార్టీనే అని స్పష్టం చేశారు. ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్నారు. గుంటూరులో టీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణను తానెప్పుడు అవమానించాను? అని ఆయన స్థానిక నేతలను ప్రశ్నించారు. తన పీక కోసినా కూడా భయపడేది లేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని తెలిపారు. తనను ఎన్ని తిట్టినా పట్టించుకోనన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? అని రాజకీయ పార్టీల నాయకులను ఆయన సూటిగా నిలదీశారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందన్నారు. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారన్నారు. ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. సడెన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని.. అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా? అని ఆయన సూటిగా నిలదీశారు. తన ఫామ్‌హౌస్‌ కబ్జా అని తేలిస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు గద్దర్‌ తెలుసునన్నారు. గద్దర్‌ ఒంట్లో బుల్లెట్లు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని రాజకీయ పార్టీల నేతలను పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. గద్దర్‌ తమ పార్టీ కార్యాలయానికి వచ్చేవారని గుర్తు చేశారు. గద్దర్‌ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అంటూ తనను ప్రశ్నిస్తున్న నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలంటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

10TV Telugu02 Jun, 11:26 am
మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా? పవన్ కల్యాణ్ మాస్ స్పీచ్

Pawan Kalyan: హైదరాబాద్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడారు. హైదరాబాద్ లో పవన్ కు ఏం పని? అని కొందరు వ్యక్తులు పదే పదే బెదిరిస్తున్నారు.. మీరెవరు నన్ను బెదిరించటానికి.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కల్యాణ్ ఎదురు దాడికి దిగారు. తెలంగాణలో బెదిరింపుల కంటే ఏపీలో బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. ఏపీలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వం అంటే తెలంగాణ జనసైనికులు నాకు అండగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే అధికారం కోరుకోని వాడిని, తెలంగాణలో కోరుకుంటానా? ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. మీరు సమస్యల మీద పోరాడండి అని మా పార్టీ నాయకులను కోరా. మాట్లాడితే ఆంధ్రా అంటున్నారు. హైదరాబాద్ లో ఏం పని? అంటున్నారు. హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని బెదిరిస్తున్నారు. మీరెవరు నన్ను బెదిరించటానికి? మీ అయ్య జాగీరా తెలంగాణ? నాకు తెలంగాణలో కంటే ఆంధ్రలో బెదిరింపులు ఎక్కువ. ఆంధ్రలో నా తల తీసేయాలని కోనసీమలో కొంతమంది అంటారు. తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకిక్కడ కొత్తగా బాగుకునేది ఏమీ లేదు. బెదిరించే వాళ్లకు అందరికీ చెబుతున్నా.. నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా రండి.. ఇదే నా ఇంటి అడ్రస్. మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఎలాంటి భయాలు లేవు. బాంచన్ కాల్మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతా? భయపడే వాళ్లమే అయితే పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో నేను తెలంగాణ నాయకులను ఒక్క మాట కూడా అనలేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Andhra Jyothy02 Jun, 06:59 am
డిసెంబర్ లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఆపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని వ్యాఖ్యానించారు. లివింగ్ లెజెండ్ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ వచ్చాక నోరుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'ఎత్తిన జెండా దించనని.. జెండా దించితే రాళ్లతో కొట్టిచంపమని అన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 2028 డిసెంబర్‌లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నెత్తురు పారిన చోట సాగు నీళ్లు తీసుకువచ్చింది కేసీఆర్ అని తెలిపారు. లక్షా 65 వేల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అని.. అల్పకులు ఏది పడితే అది మాట్లాడతారని మండిపడ్డారు. దేశమంతా కాంగ్రెస్‌ను వదిలించుకుందన్నారు. తెలంగాణను కాంగ్రెస్.. కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని వ్యాఖ్యానించారు. రైతులు.. అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. కృష్ణా, గోదావరిని గురువుకు గురుదక్షిణగా రేవంత్ ఇస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ వచ్చి చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బయటికి వస్తారా.? రైతుబంధు లేదు.. కానీ రాహుల్ గాంధీ బంధు టింగ్ టింగ్ అని వెళ్తోంది. తెలంగాణ తల్లి ఒడ్డాణం, కిరీటం ఎత్తుకుపోతున్నారు’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌‌మీట్.. ఆసక్తికర పోస్ట్ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్‌ గౌడ్

10TV Telugu02 Jun, 06:50 am
తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ

KTR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం పలువురు తెలంగాణ కళాకారులను కేటీఆర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. Also Read : Pawan Kalyan : అటు సభకు నో పర్మిషన్.. ఇటు తెలంగాణ ఆవిర్భావం వేళ పవన్ కామెంట్స్.. ‘ఈ నేల నుంచే..’ వేటగాడు చెప్పే పిట్టకథలు నిజం కావొద్దు అనుకుంటే సింహం తన కథ తను చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గురించి మనమందరం చెప్పుకోవాలని అన్నారు. 2028 డిసెంబర్‌లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. అందరి జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్. అబద్ధాలు, అభూత కల్పనలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొనితెచ్చుకున్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను మరో 20 యేండ్లు వెనక్కి నెట్టింది. కేసీఆర్ హయంలో వడ్డించిన విస్తరాకును కుక్కలు చింపిన విస్తరాకుల రేవంత్ రెడ్డి చేశాడు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. యూరియా ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంటలు కొనలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం సంక్షోభంలో కూరుకొని పోయింది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క ఇటుక పెట్టకుండా 4 లక్షల కోట్ల అప్పు చేశారు. రైతు బంధు బంద్ ఆగింది, రాహుల్ బంద్ కొనసాగుతుంది. అధికారంకోసం ఆరాటం ఏం లేదు, అధికారం వస్తే వస్తుంది లేకపోతే లేదు. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తూ ముష్కరులపాలైందన్న కేటీఆర్.. మనమందరం కలిసి తెలంగాణను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.