translateexpand_more

Telangana News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu31 May, 03:32 pm
విద్యా వికాస పునర్నిర్మాణానికి నడుం బిగించాం

హైదరాబాద్‌: పాఠశాల విద్యలో తెలంగాణ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ.. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)లో పేర్కొనడం తమ ప్రభుత్వ రెండేళ్ల కృషికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అభివృద్ధికి తొలి కొలమానం విద్య అని చెప్పారు. విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి, సమాజాన్ని జాగృతం చేయగలదని తాను బలంగా విశ్వసించినట్లు తెలిపారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాశాఖ బాధ్యతలు స్వయంగా తీసుకుని.. రెండేళ్లుగా తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. పదేళ్లలో జరిగిన విద్య విధ్వంసం నుంచి విద్యా వికాస పునర్నిర్మాణానికి నడుం బిగించామన్నారు. తాజా ఫలితాలతో సంతృప్తి పడట్లేదని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తయి.. భవిష్యత్‌లో ఈ పాఠశాలలు దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణ స్థానాన్ని నెంబర్ వన్‌గా నిలబెడతాయన్న విశ్వాసం ఉందన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా కేంద్ర నివేదికలో పేర్కొన్న ఫలితాలు ప్రేరణ ఇచ్చాయని సీఎం తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 02:20 pm
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఝార్ఖండ్‌లో పర్యటించిన భట్టి విక్రమార్క.. అక్కడి సీఎం హేమంత్ సోరెన్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఓ నివేదికను రూపొందించారు. ఆ నివేదికను తాజాగా కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 09:51 am
రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకం

హైదరాబాద్‌: రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి గతంలో సాగుకు రోజుకు 3 గంటల విద్యుత్‌ చాలన్నారు. ఇప్పుడు మాటమార్చి రైతు డిస్కం ఏర్పాటు చేస్తామంటున్నారు. రైతు మెడకు ఉరి పెట్టే డిస్కం అది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక సమయంలో స్థానికంగా ఆరు వేల ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆరు ఇళ్లయినా కట్టించారా? రేవంత్‌రెడ్డి 420 హామీలు అమలు చేసి చూపించాలి. కేసీఆర్‌ అప్పులు చేసి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 07:24 am
ఖర్గేతో సీఎం రేవంత్ , కాంగ్రెస్ నేతల భేటీ.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ

హైదరాబాద్‌: హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)ను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Ravanth reddy), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు.. ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాలపై మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఖర్గే సూచించినట్టు సమాచారం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 04:12 am
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

ప్రతికూల సవాళ్ల మధ్య ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం దృష్ట్యా తెలంగాణ సర్కారు సర్వసన్నద్ధమైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో రసాయన ఎరువుల కొరత, ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గడం, వర్షాభావం, కరవు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటమార్పిడిలో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను మళ్లించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రత్యామ్నాయ పైర్ల సాగు కోసం ముందుకొచ్చే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్న మంత్రి తుమ్మలతో ముఖాముఖి.. ఈ వార్త చదివారా: మేం మోటార్లకు మీటర్లు పెట్టకపోతే పోటీ నుంచి వైదొలుగుతారా?

Eenadu31 May, 02:17 am
మనవళ్ల కోసం.. మొక్కల డిపాజిట్

మొక్కలే ప్రాణాధారమని, పర్యావరణ పరిరక్షణ వాటితోనే సాధ్యమని.. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు విశ్రాంత ఉద్యోగి. ఇప్పటివరకు 3,800 మొక్కలు నాటి, వాటి సంరక్షణలో తరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన గట్టు కృష్ణమూర్తి.. చొప్పదండి నవోదయ పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి 2021లో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటినుంచి పట్టణంలోని ఆలయాలు, చెరువు గట్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా ఖాళీస్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించడమే కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఉదయాన్నే లేచి పార, తట్ట పట్టుకుని బయలుదేరుతారు. పురపాలిక నర్సరీ నుంచి మొక్కలను, సొంత ఖర్చుతో ట్రీగార్డులను సమకూర్చుకుంటున్నారు. ‘భావితరాలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో మొక్కలు నాటుతున్నా’ అని కృష్ణమూర్తి తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 09:39 am
ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదు

హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం పౌరుల హక్కులను హరించిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తుల కుటుంబాల్లోకి తొంగిచూసి, బెదిరించి లొంగదీసుకోవాలని చూశారని మండిపడ్డారు. ప్రజల వ్యక్తిగత గోప్యతను హరించిన కేసీఆర్‌కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ‘‘కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే లక్షల మంది ఫోన్లపై నిఘా పెడతారు. ప్రజల ఫోన్లపై నిఘా పెట్టి ఎవరెవరు ఓటు వేయలేదో తెలుసుకొని వేధిస్తారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఫోన్‌ ట్యాపింగ్‌ రాక్షసక్రీడలో ఎంతోమంది బలైపోయారు. వ్యవస్థీకృతంగా క్రూరమైన నేరం చేసిన వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. జడ్జీలు, జర్నలిస్టులు, నటులు, రాజకీయ నేతలు ఇలా అన్ని వర్గాల ఫోన్లను ట్యాప్‌ చేశారు. బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’’అని అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 02:31 pm
దేశంలో మక్కలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

హైదరాబాద్‌: దేశంలో మొక్కజొన్నలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwara Rao) అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 లక్షల టన్నుల మక్కలు కొన్నట్లు చెప్పారు. మక్కల కొనుగోలుపై మంత్రి ఆదివారం మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల కొనుగోలులో కొంత ఆలస్యమైంది. లారీలు, కూలీలు, డీజిల్‌ కొరత ఉంది. అయినా, రాష్ట్రంలో గోదాంలు నిండటంతో పొరుగు రాష్ట్రాలకు పంపుతున్నాం. మక్కల కొనుగోలు వల్ల నష్టం వచ్చినా.. రైతులను ఆదుకుంటాం. దేశంలో అత్యధికంగా వరి కొనుగోలు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణనే. ఇప్పటి వరకు 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం’’ అని మంత్రి తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu30 May, 01:38 pm
అదే జరిగితే ఎన్నికల్లో పోటీ చేయం’.. కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మోటార్లకు మీటర్లు పెడితే, రైతులకు ఉచిత విద్యుత్‌ నిలిపివేస్తే.. తాము ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. తాము ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తే.. బీఆర్ఎస్‌ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని సవాల్‌ విసిరారు. రైతుల ముసుగులో కేసీఆర్‌ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాం. ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌ వినియోగాన్ని దీనికి కనెక్ట్‌ చేస్తున్నాం. రైతు డిస్కంతో జవాబుదారీతనం పెరుగుతుంది. మేం ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.95 వేల కోట్ల అప్పు తీరుస్తున్నాం. మేం తీరుస్తున్న అప్పుల గురించి హరీశ్‌రావు చెప్పడం లేదు. రూ.54 వేల కోట్లు అప్పులు తీసుకుంటామని ముందే చెప్పాం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదు. కేసీఆర్‌ మీద ఒట్టేసి.. బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని హరీశ్‌రావు చెప్పాలి. గతంలోనూ హరీశ్‌రావు.. వైఎస్సార్‌ దగ్గరికి వెళ్లారు. ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు.. కానీ చెప్పను. ఇటీవల పార్టీ మీటింగ్‌ వదిలేసి ఆయన దిల్లీకి ఎందుకు వెళ్లారు? భాజపా, బీఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానమే లేదు. సీబీఎస్‌ఈలో జవాబుపత్రాలు తారుమారు చేసిన గ్లోబరీనా.. కేటీఆర్‌ బినామీ సంస్థ. కేంద్రంలోని భాజపా సర్కారు వడ్లు సరిగ్గా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్రంలో 32 శాతం ధాన్యం మాత్రమే కొంటోంది. భాజపా నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తాం. అంతర్రాష్ట్ర జలవివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెబుతున్నారు. ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో చర్చలకు ప్రయత్నిస్తున్నాం. ఆయన ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు? 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను. పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌

Eenadu31 May, 01:58 am
చుక్క రక్తంతో క్యాన్సర్ గుట్టురట్టు

నిమ్స్‌లో త్వరలో అందుబాటులోకి లిక్విడ్‌ బయాప్సీ నిమ్స్‌లో సేవలందిస్తున్న ఎన్‌జీఎస్‌ యంత్రం ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌లో క్యాన్సర్‌ చికిత్సల్లో అత్యాధునిక సేవలు ఒక్కొక్కటి అందుబాటులోకి తెస్తున్నారు. నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ (ఎన్‌జీఎస్‌)తో క్యాన్సర్‌ జీనోమిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన నిమ్స్‌.. దాని ఆధారంగా పలు చికిత్సలను రోగులకు అందుబాటులోకి తేనుంది. ఇందులో భాగంగా త్వరలో లిక్విడ్‌ బయాప్సీ సేవలు ప్రవేశపెట్టనుంది. ఈ వివరాలను నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప మీడియాకు విడుదల చేశారు. ‘ప్రస్తుతం ఎన్‌జీఎస్‌ సాంకేతికతతో క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ స్థాయిలో గుర్తించి రోగికి టార్గెటెడ్‌ థెరపీ అందించొచ్చు. కేంద్రం ఆధ్వర్యంలోని డైమండ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ సేవలు ప్రవేశపెట్టారు. 2024 నుంచి 1443 మందికి ఈ పరీక్షలు ఉచితంగా చేశాం’ అని బీరప్ప తెలిపారు. ఈ సేవలతోపాటు ఒక్క రక్తపు చుక్కతోనే క్యాన్సర్‌ గుట్టురట్టు చేసేలా లిక్విడ్‌ బయాప్సీ పరీక్షలను త్వరలో అందుబాటులోకి తెస్తామని నిమ్స్‌ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శాంతవీర్‌ జి.ఉప్పిన్‌ తెలిపారు. లిక్విడ్‌ బయాప్సీలో కణజాలం సేకరించకుండానే కేవలం రక్త పరీక్షతో క్యాన్సర్‌ స్థాయిని నిర్ధారిస్తారని వివరించారు. ‘ఊపిరితిత్తుల క్యాన్సర్లు, బ్రెయిన్‌ ట్యూమర్లు, ఎముకల్లోకి పాకిన క్యాన్సర్‌ లాంటి వాటికి శరీరం లోపలికి వెళ్లి కణితి కణజాలాన్ని బయాప్సీ చేయడం కష్టం. ఇలాంటి సందర్భంలో లిక్విడ్‌ బయాప్సీ ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ పరీక్షలన్నీ ఆరోగ్యశ్రీలో రోగులకు ఉచితంగానే అందిస్తాం’ అని డాక్టర్‌ బీరప్ప వివరించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ

Eenadu01 Jun, 12:16 am
నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు మే 17న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ర్యాంకులు ప్రకటిస్తామని ఐఐటీ రూర్కీ తెలిపింది. జూన్‌ 2వ తేదీ నుంచి ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(స్పా), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని అంచనా. ఈ పరీక్షలో కనీస మార్కులు సాధించినవారు మాత్రమే ఐఐటీల్లో సీట్లకు పోటీ పడాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, స్పాట్‌ తదితర విద్యాసంస్థల్లో చేరవచ్చు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 12:05 pm
ఒక్క గురుకుల పాఠశాలకైనా శంకుస్థాపన చేశారా

హైదరాబాద్‌: పదేళ్ల హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలనూ నిర్మించడం చేతగాని బీఆర్‌ఎస్‌ నేతలకు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనను విమర్శించే నైతికత లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క గురుకుల పాఠశాలకైనా శంకుస్థాపన చేసినట్లు కేటీఆర్‌ నిరూపించాలని, అందుకు తానేక్కడికి రమ్మన్నా వస్తానని సవాల్ విసిరారు. గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందే.. ఏదో అవినీతి జరిగింది అంటూ కేటీఆర్‌ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ముందు నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను సైతం తామే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 02:01 pm
కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ .. ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న విద్యార్థులు జూన్ 6లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి అర్హతలు, అప్లికేషన్ విధానం, కావాల్సిన ధ్రువపత్రాలు తదితర వివరాలు ఈ వీడియోలో... ఈ వార్త చదివారా: టీఎంసీ.. ఫుల్‌ టైమ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Eenadu31 May, 06:02 am
ఎల్ నినో ప్రభావం.. నైరుతి’లో తగ్గనున్న వర్షాలు

దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్‌-సెప్టెంబరు) సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్‌లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఫసిపిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా బలపడి రుతుపవనాల కాలం నాటికి పూర్తిగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దేశంలోని ప్రధాన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ ఈసారి వర్షపాతం మిశ్రమంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్త చదివారా: కేదార్‌నాథ్‌ కాలినడక మార్గంలో 19 కి.మీ. ట్రాఫిక్‌ రద్దీ

Eenadu30 May, 02:36 pm
రూ.9 లక్షల డిమాండ్ .. ఏసీబీకి చిక్కిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆర్ ఐ

హైదరాబాద్‌: లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు ఓ వ్యక్తిని ఆయన రూ.9 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి నుంచి ఇప్పటికే రూ.5 లక్షలు నగదు తీసుకున్నారు. మిగిలిన రూ.4 లక్షల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 02:13 pm
నెల రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత

ఆసిఫాబాద్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్‌ను ఆవిష్కరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. అర్హులైన అందరూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని చెప్పారు. నెల రోజుల్లో ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను తీసుకొస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి ప్రస్తావించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 03:49 pm
రాష్ట్రంలో మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్‌ ఆదివాసీల సొంతింటి కల నెరవేరాలని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున పేదలకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగజ్‌నగర్‌లో పర్యటించిన సీఎం.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘తండాలు, గూడేల్లో ఉండే అర్హులైన ఆదివాసీ బిడ్డల కోసం స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి నూరు శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. గుడిసెలు లేని ఆదిలాబాద్‌ జిల్లాను నేను చూడాలనుకుంటున్నా. రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17న మరో లక్ష గృహప్రవేశాలు చేస్తాం. కొత్తగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఈ వేదిక నుంచే మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా. కాళేశ్వరంలో పెట్టిన రూ. లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయి. బీఆర్‌ఎస్‌ పాలనలో ఆదిలాబాద్‌లోని ప్రాజెక్టులను పట్టించుకోలేదు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్‌లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల కోసం మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశాను. అయినా అక్కడి నుంచి స్పందన లేదు. తెలంగాణ సీఎం అంటే మహారాష్ట్ర సీఎంకు ఎందుకుంత చిన్నచూపు? సమస్య పరిష్కరించడానికి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 గ్రామాలను ఏపీలో కలపలేదా? తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు కలిగే నష్టాన్ని భరిస్తాం. మహారాష్ట్ర నుంచి 2వేల ఎకరాలు మాత్రమే అడుగుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 62లక్షల క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశాం. మొత్తం 75లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటాం. జూన్‌ 15 నాటికి ఈ కొనుగోళ్లు పూర్తవుతాయి. మేం సేకరించిన వడ్లు, మక్కలు, జొన్నలను కేంద్రం కొనాలి. దీనికి కిషన్‌రెడ్డి సహకారం అందించాలి. వడ్లు కొనకపోతే జూన్‌

Eenadu01 Jun, 11:04 am
డఫాబెట్ .. బెట్టింగ్ కేసులో 11 మందిని అరెస్టు చేసిన సీఐడీ

హైదరాబాద్‌: ఆర్థిక నష్టం కలిగిస్తూ, యువత ఆత్మహత్యలకు కారణం అవుతున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై తెలంగాణ సీఐడీ ప్రత్యేక దృష్టి సారించింది. వీటిపై ఇప్పటికే సిట్‌ ఏర్పాటు చేసిన సీఐడీ.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా అంతర్జాతీయ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ‘డఫాబెట్’ వేదికగా మోసాలకు పాల్పడుతున్న 11 మందిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్‌కి చెందిన ఓ బాధితుడు డఫాబెట్‌లో దాదాపు రూ.10లక్షలు మోసపోయిన కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. న్యూ దిల్లీ, గుజరాత్, పంజాబ్‌కు బృందాలను పంపి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో ఒక అఫ్గానిస్థాన్ దేశస్థుడు సహా 11 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా బెట్టింగ్ నిర్వాహకులని సీఐడీ చీఫ్‌ చారు సిన్హా తెలిపారు. నిందితుల నుంచి 3 కార్లు, 8 ల్యాప్‌టాప్‌లు, 26 మొబైల్స్, 5 పాస్‌పోర్టులు, రూ.3.21లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై ఏపీ, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలో 225 కేసులు ఉన్నట్లు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu01 Jun, 03:06 pm
ఊరికి సర్వీసు రోడ్డు కావాలంటూ కలెక్టరేట్ వద్ద బాలుడి కంటతడి

‘‘సారూ.. మా ఊరికి సర్వీసు రోడ్డు లేక బస్సులు రావడం లేదు. దీంతో స్కూలుకి పోవాలంటే కిలో మీటర్ల మేర నడవాల్సి వస్తోంది’’ అంటూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడి ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టరేట్ ఎదుట గ్రామస్థులతో కలసి ఆందోళన చేశాడు. మా గోడు వినాలి అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఈ వార్త చదివారా: నెల రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత: సీఎం రేవంత్‌రెడ్డి

Eenadu01 Jun, 02:28 pm
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్ర పోలీసులకు పతకాలు

హైదరాబాద్‌: ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసులు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. టీఎస్‌ జెన్‌కో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ చీఫ్‌ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, చెర్ల సీఐ రాజుకు శౌర్య పతకం ప్రకటించారు. ఇంటిలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సంపత్‌, గ్రేహౌండ్స్‌లోని మరో ఏడుగురికి శౌర్య పతకాలు వరించాయి. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మందికి ఉత్తమ సేవా పతకాలు, 50 మంది కఠిన సేవా పతకాలు, మరో 461 మంది సేవా పతకాలు అందుకోనున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 07:27 am
రూ.8 వేల కోట్లకు తెలంగాణ రెవెన్యూ లోటు

ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే తెలంగాణ బడ్జెట్ అంచనాకు భిన్నంగా రూ.8 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు నమోదు చేసింది. ఏప్రిల్‌ నెలలో పన్నుల ద్వారా ఖజానాకు రూ.10,598 కోట్లు జమయ్యాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో వచ్చిన మొత్తం కంటే తక్కువగానే ఉంది. మొదటినెలలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో చాలా స్వల్పంగా రూ.16 కోట్లకు పైగా మాత్రమే నిధులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ వార్త చదివారా: మనవళ్ల కోసం.. మొక్కల డిపాజిట్‌

Eenadu31 May, 07:52 am
నకిలీ జీవో కోసం రాధాకృష్ణకు బ్రహ్మనాయుడు రూ.4 కోట్లు ఇచ్చారు

హైదరాబాద్: భూకబ్జా వ్యవహారంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై ఆధారాలు లభ్యమైనట్టు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. నకిలీ జీవో కోసం రాధాకృష్ణకు బొల్లా.. రూ.4కోట్లు ఇచ్చినట్టు గుర్తించామన్నారు. భూమి క్రమబద్ధీకరించాలని కలెక్టర్‌, సీసీఎల్‌ఏకు దస్త్రాలు వెళ్లినట్టు సృష్టించారని పేర్కొన్నారు. రాధాకృష్ణ చెప్పిన విషయాలు, నిమ్మల కుటుంబం చెప్పిన విషయాలు సరిపోలాయన్నారు. రాధాకృష్ణ 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. అతని వద్ద కందుకూరు, అంబర్‌పేటలో స్థల పత్రాలు లభించాయని చెప్పారు. వివిధ నకిలీ సంస్థలు సృష్టించి స్టాంపులు తయారు చేశారని డీసీపీ వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu31 May, 01:49 pm
మా మధ్య అంతర్యుద్ధం తీసుకురావాలని చూస్తున్నారు

హైదరాబాద్‌: మల్కాజిగిరిలో ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. భాజపా నేతల ఐక్యతను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని, తమ మధ్య అంతర్యుద్ధం తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు. ఫ్లెక్సీలపై డీజీపీ, సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Namasthe Telangana31 May, 06:30 am
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృధికి కృషి

రాజన్న సిరిసిల్ల, మే 31: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి సహకారం అందిస్తాం అని నవతేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చైర్మన్ గండ్ర యాదగిరి రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేశారని, ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. కోరుట్లపేట గ్రామశాఖ అధ్యక్షుడు లోకుర్తి బాలమల్లు, ఆలయ నిర్వాహకులు చిదుగు గోవర్ధన్ గౌడ్, సర్పంచ్ ఇల్లేందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Eenadu23 May, 11:32 pm
TG News: 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. పాలమూరుకు రూ.587 కోట్లు

- రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు జూన్‌ 1న నియోజకవర్గానికి 2 వేల చొప్పున రెండో విడత ఇళ్ల మంజూరు క్యూర్‌ పరిధిలో పేదలకు లక్ష గృహాలు వేగంగా పాలమూరు-రంగారెడ్డి భూసేకరణ గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు జూనియర్‌ కళాశాలల్లోనూ మధ... - చిత్రంలో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. - పూరిగుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తీర్మానించింది.

Eenadu29 May, 04:33 pm
ఎస్ ఐఆర్ పై నేతలంతా సంపూర్ణ అవగాహనతో ఉండాలి

హైదరాబాద్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)తో తలెత్తే సమస్యలపై నేతలంతా సంపూర్ణ అవగాహనతో ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లంబాడీ, ఆదివాసీ, వలస కార్మికులకు ఎస్‌ఐఆర్‌ పెద్ద సమస్య కావొచ్చన్నారు. ‘‘ఎస్‌ఐఆర్‌తో దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశముంది. దీనివల్ల తలెత్తే సమస్యలపై నేతలకు పూర్తి అవగాహన ఉండాలి. ఎస్‌ఐఆర్‌ కోసం అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జ్‌లను నియమించాలి. వారు సరిగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడొచ్చు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను 10 రోజులకోసారి కలుస్తాను. నెలలో 3 రోజులు కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తా. నాతో సహా అందరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే. బూత్‌ ఎన్‌రోలర్ల సాయంతో 90 రోజుల్లో 45 లక్షల డిజిటల్‌ సభ్యత్వాలు చేయించాం. ఎక్కువ సభ్యత్వాలు చేయించిన వారికి రాహుల్‌గాంధీతో సన్మానం చేయించాం’’అని రేవంత్‌ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో నాగుపాము కలకలం సృష్టించింది.

Eenadu30 May, 06:22 am
తీవ్ర వడగాల్పులు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్: తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu23 May, 11:35 pm
Yadagirigutta: వేద పాఠశాలకు శ్రీకారం

- యాదగిరిగుట్టలో భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకూ.. - ఆలయంలో సమస్యల పరిష్కారానికి హామీ గురుకుల వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. - చిత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, విప్‌ బీర్ల అయిలయ్య, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ర...

Eenadu30 May, 04:23 pm
రాష్ట్ర హక్కుల పరిరక్షణకే.. తెలంగాణ రక్షణ సేన పుట్టింది

మొయినాబాద్: ఏ లక్ష్యాల కోసం తెలంగాణను సాధించుకున్నామో.. వాటి సాధనతో పాటు రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసమే తాము కొత్త రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆడబిడ్డల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జెండా పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. గతంలో భారాస, ప్రస్తుతం కాంగ్రెస్‌.. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధికి గుదిబండగా మారిన జీవో 111 విషయంలోనూ మాట తప్పాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. యువత వ్యాపారం చేసేలా ప్రోత్సహించేందుకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu25 May, 12:17 pm
హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కనీసం...

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొ...