ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో హై డ్రామా నెలకొంది. ఆర్సీబీ విజయానికి దగ్గరగా ఉన్న సమయంలో విరాట్ కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడిన బంతిని కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ విషయంలో విరాట్ కోహ్లి - శుభ్మన్ గిల్ - అంపైర్ల మధ్య కాసేపు హై డ్రామా నెలకొంది. క్యాచ్ విషయంలో కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్లో కొంత ఉత్కంఠభరిత క్షణాలు కనిపించాయి. అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ పూర్తిగా పట్టలేదని.. బంతి నేలను తాకిందని కోహ్లి భావించాడు. అయితే, కోహ్లి ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్తో వాగ్వాదానికి దిగాడు. తొలుత అంపైర్ కోహ్లిని పెవిలియన్కు వెళ్లాలని సూచించినా.. కోహ్లి రివ్యూకి వెళ్లాలని పట్టుబట్టడంతో చేసేదేం లేక నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు పంపిచారు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ డెసిషన్ తనకు అనుకూలంగా రావడంతో కోహ్లి గ్రౌండ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వివాదం జరిగే సమయానికి కోహ్లి 63 పరుగులు చేశాడు. కీలక మ్యాచ్లో మరోసారి ఛేజ్ మాస్టర్ అనిపించుకున్న విరాట్ కోహ్లి ఆఖరి వరకు క్రీజులో కొనసాగి 42 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్తో 156 పరుగుల లక్ష్యాన్ని
Samayam Telugu News
Latest updates from Telugu Digital news sources.
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కలయికలో వచ్చిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లు సాధించి, కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్బస్టర్గా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్లాల్, శివ రాజ్కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటుల అతిథి పాత్రలు సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రూపొందుతున్న సీక్వెల్ ‘ జైలర్ 2 ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్లో కూడా మరిన్ని క్రేజీ క్యామియోలు ఉంటాయని దర్శకుడు నెల్సన్ ప్రకటించడంతో, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగింది. * పొల్లాచ్చి షెడ్యూల్కు సిద్ధమైన ‘మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్! ఈ సినిమాలో ఒక అత్యంత పవర్ఫుల్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి ఈ పాత్ర కోసం మొదట నందమూరి బాలకృష్ణను సంప్రదించగా, ఆయన తన బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు ఈ రోల్ ఆఫర్ చేయగా, ఆయన కూడా తన ‘కింగ్’ సినిమా షూటింగ్ కమిట్మెంట్స్ వల్ల దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ను కూడా సంప్రదించారనే టాక్ నడిచింది. చివరికి ఈ
Padmanabhaswamy Temple Probe : అపార దైవ సంపదకు నిలయమైన కేరళలోని ప్రముఖ శ్రీ పద్మనాభస్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయానికి చెందిన అత్యంత విలువైన వస్తువులు అదృశ్యం అయ్యాయనే వార్తలు రాగా.. అక్కడ నెలకొన్న భద్రతా లోపాల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని కేరళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఆలయంలో వస్తువుల అదృశ్యం, భద్రతా వైఫల్యాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కె.మురళీధరన్ శనివారం అధికారికంగా వెల్లడించారు.హోం శాఖ చర్చల తర్వాత తుది ప్రకటన..ఈ వివాదంపై దేవాదాయశాఖ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. ఆలయ పరిపాలన కమిటీ నుంచి తాము కోరిన నివేదిక ప్రభుత్వానికి అందిందని స్పష్టం చేశారు. ఆలయ ఆస్తుల రక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని, ఇందులో ఎవరి జోక్యాన్ని లేదా నిర్లక్ష్యాన్ని అనుమతించబోమని హెచ్చరించారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖతో త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అనంతరం విచారణా కమిటీకి సంబంధించిన అధికారిక వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రసిద్ధ శబరిమల ఆలయంలో బంగారం అవకతవకలపై స్పందించిన మంత్రి.. అక్కడ ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న విచారణ తీరు తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే స్వయానా హైకోర్టు ఈ సిట్ను నియమించినందున.. దానిని మార్చే, రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల నివేదికపై ఆలయ కమిటీ, రాజకుటుంబం ఆగ్రహంమరోవైపు పద్మనాభస్వామి ఆలయం నుంచి వస్తువులు మాయం అయ్యాయంటూ వస్తున్న పోలీసుల ఆరోపణలను ఆలయ పరిపాలన కమిటీ, ట్రావెన్కోర్ రాజకుటుంబం తీవ్రంగా ఖండించాయి. ఆలయంలోని వజ్రాల నగలతో సహా అన్ని
సీరియల్ సెలబ్రెటీల నుంచి బిగ్బాస్ బ్యూటీల వరకూ లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అప్డేట్స్ మీ కోసం.. అరుణాచలంలో సింపుల్గా చీరకట్టులో నయని పావని సందడి చేశారు. జబర్దస్త్ పవిత్ర హాట్ లుక్కులో కనిపించారు. వెకేషన్లో వదినమ్మ ఫేమ్ సుజిత సందడి చేస్తున్నారు. నిరుపమ్, మంజుల ఇద్దరూ కూడా వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లితెర సీరియల్ నటి కరుణ తాజాగా ఓ రీల్ను షేర్ చేశారు. పల్లవి రామిశెట్టి తనకు వచ్చిన అవార్డుని చూపిస్తూ ఫోటోలను షేర్ చేశారు. ఓల్డ్ లుక్లో ఉన్న ఫోటోలను నటరాజ్, నీతూ షేర్ చేశారు. కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది బిగ్ బాస్ సిరి. చీరకట్టులో వాసంతి అందరినీ ఆకట్టుకుంటున్నారు.వాసంతి View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) బిగ్ బాస్ శిల్ప View this post on Instagram A post shared by Shillpa chakraborthy (@tvshilpa) బిగ్ బాస్ సిరి View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) నటరాజ్ View this post on Instagram A post shared by Natraj Kasturinatraj (@natraj_master) పల్లవి రామిశెట్టి View this post on Instagram A post shared by Pallavi Ramisetty Official (@pallaviramisettyofficial) కరుణ View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) మంజుల పరిటాల View this post on Instagram A post shared by Manjula Paritala
సినిమా ఇండస్ట్రీలో ఒక వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక ఎంతో పోరాటం ఉంటుందని, కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా సృష్టించే నెగెటివిటీ వల్ల దర్శకుల కలలు ముక్కలవుతున్నాయని ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయం సాధించలేకపోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆన్లైన్లో జరిగిన విపరీతమైన నెగెటివ్ ప్రచారం వల్లే చాలా మంది థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయామని తనకు సందేశాలు పంపుతున్నారని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. కొన్ని సినిమాలు ఇలాంటి నెగెటివ్ రివ్యూలను తట్టుకుని నిలబడతాయని, కానీ పెద్దగా ప్రభావం లేని సినిమాల తలరాతను ప్రజాభిప్రాయం పూర్తిగా మార్చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.* వెండితెరపై ‘ఫటాఫట్’ వెలుగు.. ప్రేమ ఉచ్చులో చిక్కుకుని 22 ఏళ్లకే విషాదాంతం ఓటీటీలో ఆదరణ ప్రదీప్ రంగనాథన్ , కృతి శెట్టి జంటగా నటించిన ఈ ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైంది. 2040వ సంవత్సరం నేపథ్యంలో, టెక్నాలజీ యుగంలో అల్గారిథమ్లు ప్రేమను ఎలా శాసిస్తాయనే సరికొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 66 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు
తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు హెచ్. వినోద్ సినిమా ఆలస్యంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న వినోద్ను యాంకర్ ‘తమిళనాడు మొత్తం ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ ఎప్పుడు విడుదలవుతుంది?’ అని ప్రశ్నించారు. దీనికి వినోద్ నవ్వుతూ స్పందిస్తూ.. “ఆ విషయం నా చేతుల్లో లేదు. అసలు ఏం జరుగుతుందో ఆ నిజాన్ని మీతో పంచుకునేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను ధైర్యం చేసి నిజం చెప్పినా, దానిని బయట ప్రపంచానికి చూపించే ధైర్యం మీకు కూడా ఉండదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినిమా వెనుక పెద్ద రాజకీయ లేదా సెన్సార్ ఒత్తిళ్లు ఉన్నాయనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.* నా ఎంట్రీ సీన్కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. ‘పెద్ది’ సీక్రెట్స్ లీక్ చేసిన అచ్చియమ్మ! రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రం చుట్టూ గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈ చిత్రాన్ని వాస్తవానికి జనవరి 9న సంక్రాంతి (పొంగల్) కానుకగా విడుదల చేయాల్సి ఉంది. అయితే సినిమాలో మతపరమైన సెంటిమెంట్లు, సాయుధ దళాల చిత్రణపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవడంతో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ ఈ సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా
మెగా పవర్స్టార్ రామ్చరణ్ , ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఈ ప్రమోషన్ ఈవెంట్లలో భాగంగా జాతీయ మీడియాతో ముచ్చటించిన జాన్వీ కపూర్ ‘పెద్ది’ సినిమాలో తను పోషించిన పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో ఆమె ‘అచ్చియమ్మ’ అనే ఒక విలక్షణమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది.* రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్?... 40 ఏళ్ల తర్వాత రీ యూనియన్!అమాయకత్వం కాదు.. ఫుల్ డామినేషన్!సాధారణంగా సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిల పాత్రలు అనగానే అమాయకంగా, బిడియంతో లేదా కాస్త సిగ్గుపడుతూ కనిపించడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ సినిమాలో తన క్యారెక్టర్ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని జాన్వీ స్పష్టం చేసింది. అందరినీ శాసిస్తూ, కాస్త పొగరుతో, తన చుట్టూ ఉన్నవారిపై ఆధిపత్యం చలాయించే హుషారైన పల్లెటూరి పడుచుగా ‘అచ్చియ్యమ్మ’ పాత్ర అలరించబోతోందని తెలిపింది. ఎంతో వైవిధ్యంగా సాగే ఈ క్యారెక్టర్ను తాను ఎంతో ఇష్టపడి, ఎంజాయ్ చేస్తూ చేశానని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.* పొల్లాచ్చి షెడ్యూల్కు సిద్ధమైన ‘మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్! హీరో రేంజ్లో ఎలివేషన్ఈ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మరో క్రేజీ అప్డేట్ను కూడా రివీల్ చేసింది. ఈ సినిమాలో
తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు. ఆర్జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఓ మైల్ స్టోన్ మార్క్ అందుకుంది. ఈ సందర్భంగా సూర్య చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులు అందిస్తున్నారు.‘కరుప్పు’ సినిమా మే 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయబడింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండు వారాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ బుకింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజయ్యే వరకూ బాక్సాఫీస్ వద్ద సూర్య మూవీ హవా ఇలానే కొనసాగేలా ఉంది.* ‘కరుప్పు’లో విజయ్.. అసలు విషయం బయటపెట్టిన ఆర్జే బాలాజీహీరో సూర్య గత కొన్నేళ్లుగా హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతున్నారు. ఎలాంటి వైవిధ్యమైన సినిమాలు చేసినా, ఎన్ని కొత్త జోనర్లు ట్రై చేసినా.. వర్కవుట్ కాలేదు. కీలకమైన దశలో ఇప్పుడు కరుప్పు రూపంలో భారీ విజయం దక్కింది. ఇది ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సూర్య దశాబ్దం కిందటే రూ.100 కోట్ల హీరో అనిపించుకున్నాడు కానీ.. ఆ తర్వాత మరో మైలురాయి అందుకోలేదు. ఇన్నేళ్లకి ఇప్పుడు వీరభద్రుడు సినిమాతో ఒకేసారి రూ.200 కోట్లు, రూ.300 కోట్ల క్లబ్ లోకి
నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సరికొత్త చిత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ను షేక్ యడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తొలుత ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో తెరకెక్కించాలని భావించినప్పటికీ, బడ్జెట్ పరిమితలతో పక్కా కమర్షియల్ హంగులతో కూడిన ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మలిచారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ షూటింగ్ ముంబై మహానగరంలో శరవేగంగా సాగుతోంది.కథలో ఊహించని ట్విస్ట్ సాధారణంగా గ్యాంగ్ స్టర్ సినిమాలు అంటే అండర్వరల్డ్ డాన్ల మధ్య సాగే ఆధిపత్య పోరు, రక్తపాతం మాత్రమే కనిపిస్తాయి. కానీ, దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో ఒక భారీ ఊహించని ట్విస్ట్ను ప్లాన్ చేశారట. ఈ కథ కేవలం ముంబై మాఫియా చుట్టూ తిరిగేది మాత్రమే కాదు.. దీని వెనుక ఒక బలమైన దేశభక్తి ఎలిమెంట్ దాగి ఉందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. సమాజ శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం తెరవెనుక ఒక గ్యాంగ్ స్టర్ ఎలాంటి పాత్ర పోషించాడు? దేశ సరిహద్దుల్లో కాకుండా, నగరాల నడిబొడ్డున ఉంటూనే దేశద్రోహులపై ఎలా పోరాటం చేశాడనే సరికొత్త కోణంలో ఈ కథ సాగనుందని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి చిత్రం ‘జాట్’ లోనూ పేట్రియాటిజం అంశాన్ని అద్భుతంగా చూపించి మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీతో ఆ దేశభక్తి కాన్సెప్ట్ను మరింత నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లనున్నారు.* వాచ్మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్! బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీ, ఆయన
దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహోన్నత వ్యక్తి దాసరి నారాయణరావు . 2017, మే 30న ఆయన భౌతికంగా దూరమైనా ఆయన సృష్టించిన కళాఖండాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అయితే తాజాగా దాసరి నారాయణరావు సమాధికి సంబంధించి సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దాసరి నారాయణరావు, ఆయన ధర్మపత్ని పద్మ సమాధులు సంరక్షణ లేక, చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.* వాచ్మెన్ నుంచి స్టార్ నటుడిగా.. 6.5లక్షల చెట్లతో అడవినే సృష్టించిన టాలీవుడ్ విలన్!దీంతో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెండితెరపై ఎందరికో జీవితాన్ని ప్రసాదించి, వేల కోట్ల విలువైన ఆస్తులను వదిలివెళ్లిన ఒక లెజెండరీ డైరెక్టర్ సమాధిని కనీసం పట్టించుకునే నాథుడే కరువవ్వడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నవారి స్మారక చిహ్నాలను ఇలా వదిలేయడం ఎంతవరకు న్యాయమంటూ దాసరి వారసులపై మండిపడుతున్నారు. ఈ వీడియో కాస్తా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారడంతో పలువురు సినీ ప్రముఖులు తక్షణమే స్పందించారు. రంగంలోకి దిగిన మంచు మనోజ్ , విష్ణు, గీతా ఆర్ట్స్ ఈ హృదయవిదారక విజువల్స్ చూసి హీరో మంచు మనోజ్ తీవ్రంగా చలించిపోయారు. దాసరి వర్ధంతి రోజైన నేడు ఆయన నేరుగా సమాధి వద్దకు చేరుకున్నారు. తెలుగు సినిమాకు ఎన్నో జనరేషన్ల పాటు ఆదర్శంగా నిలిచిన ఒక మహానుభావుడి స్మారకం ఇలా ఉండటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం దాసరి, పద్మ గార్ల
Punjab CM Bhagwant Mann : ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే తత్వమే వ్యవస్థల్లో మార్పులు తీసుకు వస్తుందని పంజాబ్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నిరూపించింది. లైవ్ ప్రోగ్రామ్లో ముఖ్యమంత్రి విద్యా విధానాన్ని ఒక పాఠశాల విద్యార్థిని ధైర్యంగా తప్పుపట్టడం, దానికి సీఎం సానుకూలంగా స్పందించి తక్షణమే దశాబ్దాల నాటి పాత నిబంధనను మారుస్తూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆ చిన్నారి ఏం ప్రశ్న అడిగింది, వెంటనే సీఎం కూడా విద్యావిధానంలో మార్పులు ఎందుకు తెచ్చారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 'సితారే జమీన్ తే' వేదికగా ఊహించని ప్రశ్న..పంజాబ్ స్టేట్ బోర్డ్ పరిధిలోని 8, 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 'సితారే జమీన్ తే' అనే ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రతిభావంతులైన విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలోనే అమృత్సర్కు చెందిన ఒక విద్యార్థిని లేచి నిలబడి.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అడిగిన ప్రశ్నతో సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. "సీఎం గారూ.. మేమందరం ఒకే క్లాసులో చదువుకుంటాం. పరీక్షల కోసం అందరం సమానంగా రాత్రింబవళ్లు కష్ట పడతాం. మమ్మల్ని తీర్చిదిద్దడంలో మా ఉపాధ్యాయులు కూడా అంతే కృషి చేస్తారు. అలాంటప్పుడు.. పరీక్షల్లో ముగ్గురికి ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు.. కేవలం వయసును ప్రామాణికంగా తీసుకుని ఒకరికి మొదటి ర్యాంకు, మిగిలిన వారికి రెండు, మూడు స్థానాలు ఎలా కేటాయిస్తారు? ఇది ఎంత వరకు న్యాయం?" అని ఆ బాలిక నిలదీసింది. విద్యార్థిని అడిగిన ఈ లాజికల్ ప్రశ్నకు
Post Office: ప్రస్తుతం అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నప్పటికీ సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలాంటి నష్ టభయం లేని, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో స్థిరమైన రాబడినిచ్చే పోస్టాఫీసు పొదుపు పథకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ రేట్లను కేంద్రం ఈ పథకాల ద్వారా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన భార్య పేరుపై పోస్టాఫీస్లో రూ.1 లక్ష మొత్తాన్ని 24 నెలల (2 సంవత్సరాలు) కాల పరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి ఎంత వస్తుంది అనే పూర్తి లెక్కలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) మాదిరిగానే పోస్టాఫీసులలో డిపాజిట్లను టైమ్ డిపాజిట్లు (Time Deposits) అంటారు. ఈ స్కీమ్స్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చినట్లుగా 1 ఏడాది నుంచి 5 సంవత్సరాల విభిన్న కాల పరిమితులతో అకౌంట్లు తెరిచే వెసులుబాటు ఉంటుంది. పోస్టాఫీస్ నిబంధనల ప్రకారం ఈ ఖాతాను తెరిచేందుకు కనీస పెట్టుబడి మొత్తం కేవలం రూ. 1000 కాగా గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు.సాధారణంగా కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు పురుషులు, మహిళలు లేదా సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్లో పురుషులు, మహిళలు లేదా వృద్ధులు అనే తేడా లేకుండా ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన భార్య పేరు మీద పోస్టాఫీస్ లో రూ. 1 లక్ష నగదును పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం 2 ఏళ్ల కాల పరిమితితో డిపాజిట్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఆరోగ్య పథకాన్ని ఈ నెల నుంచే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకానికి సంబంధించిన తుది మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నేడు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక పథకం పారదర్శకంగా, జాప్యం లేకుండా సాగడానికి వీలుగా ప్రభుత్వం సరికొత్తగా ఎంప్లాయ్ హెల్త్కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రస్ట్లో వాటాదారులందరికీ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. దీని ప్రకారం, ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ట్రస్ట్ రోజువారీ కార్యకలాపాలు, పర్యవేక్షణ కోసం ఒక సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించనున్నారు. ఈ ట్రస్ట్ కమిటీకి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం నాటి సమావేశం అనంతరం వెలువడే అవకాశముంది.పథకం లబ్ధిదారుల ఖచ్చితమైన గణాంకాల కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది. మే 31వ తేదీ లోపు ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఈ డేటా ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే అత్యాధునిక డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా గుర్తింపు పొందిన కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి.తొలుత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ..
RBI MPC : ప్రపంచ వ్యాప్తంంగా భౌగోళికస రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. ఇది భారతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ఈక్విటీతో పాటు స్థిరాదాయ పథకాలతో వైవిధ్యాన్ని పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను కాపాడుకుంటూనే ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని మీరో అసెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ అధినేత బసంత్ బాఫ్నా ఓ ప్రముఖ మీడియాతో వెల్లడించారు. మరి కొన్ని నెలల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని అంచనా వేశారు. అదే జరిగితే రుణాలు తీసుకున్న వారికి మరికొంత కాలం ఊరట లభించనుంది. మరి ఆయన చెప్పిన విషయాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. గత డిసెంబర్ నాటికి బాండ్ల రాబడులు 6.8 శాతం వద్ద ఉన్నాయని, మార్చి నెలాఖరు నాటికి అది 7.3-7.4 శాతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఏడాది విభాగంలో రాబడి 7.8-7.9 శాతం స్థాయికి చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు మనీమార్కెట్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లపై ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు మార్కెట్ కంటే తక్కువ వడ్డీకే రుణాలిచ్చిన బ్యాంకుల వద్ద అదనపు నగదు కరిగిపోయినట్లు చెప్పారు. లోన్ తీసుకున్న వారికి శుభవార్త ?ఎల్-నినో ప్రభావం కారణంగా కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో గత 10 ఏళ్లుగా భారత్ మిగులు సాధించింది. చమురు ధరల పెరుగుదల, ప్రతికూల రుతుపవనాల కారణంగా ద్రవ్యోల్బణంపై 40-50 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడవచ్చని, ఇలా జరిగినా ద్రవ్యోల్బణం 5.5 శాతం నుంచి 5.6 శాతంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన లిమిటికి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఒక కథానాయికగా దీపికా పదుకొణెని అధికారికంగా ప్రకటించారు. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి మరో ముగ్గురు అందాల భామలు ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాలో ఓ మలయాళ హీరోయిన్ నటిస్తోందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ‘రాకా’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మలయాళ నటి ఫెమినా జార్జ్ ఈ సినిమాలో భాగమయ్యారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 2021లో 'మిన్నల్ మురళి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మోడల్ ఫెమినా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడింది. అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. తన పాత్ర చిన్నదే అయినా, ఇలాంటి పెద్ద సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.''రాకా' వంటి బిగ్ ప్రాజెక్ట్లో భాగమవుతానని నేను అసలు ఊహించలేదు. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన నటించిన ‘హ్యాపీ’ సినిమా చూశాను. అప్పటినుంచే ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. 'రాకా' సినిమాలో నా పాత్ర నిడివి తక్కువే అయినా.. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్లో భాగం కావడంతో నా డ్రీమ్ నిజమైనట్లుగా ఉంది'' అని ఫెమినా జార్జ్ చెప్పింది. అల్లు అర్జున్ కు మలయాళంలో ఉండే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో తాగునీటి సమస్యలకు చెక్ పెట్టే పనిలో ఉంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ)లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించబోతోంది. ఏకంగా రూ.393.74 కోట్లతో శాశ్వత తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేయబోతోంది. మొత్తం 40 డివిజన్లు ఉండగా.. వాటిలోని 29 జోన్లలో పైప్లైన్లలో 24 గంటలూ సురక్షిత తాగునీటిని సరఫరా చేయనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలు కలిసి సమన్వయంతో ఈ ప్రాజెక్టను తీసుకొస్తున్నారు. ఈ తాగునీటి పథకానికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 2.67 లక్షల జనాభా ఉన్నారు.. అయితే 2055 నాటికి జనాభా 4.47 లక్షల వరకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రోజూ 88.5 మిలియన్ లీటర్ల నీరు కావాలని అంచనా వేశారు అధికారులు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా హెచ్డీపీఈ పంపిణీ పైప్లైన్ నెట్వర్క్ను మొత్తం 644 కిలోమీటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఈఎల్ఎస్ఆర్లు (27 కొత్త ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు) నిర్మించనున్నారు. ప్రస్తుతం మూడు రిజర్వాయర్లు ఉన్నాయి.. వీటితో కలిపి మొత్తం 30 ఈఎల్ఎస్ఆర్లు అందుబాటులో ఉంటాయి. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లో కొత్తగా 19 వేలకుపైగా ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్లాన్ చేశారు. నగరంలోని ప్రాంతాలతో పాటుగా గ్రామాలనకు కూడా నీటిని సరఫరా చేసేందుకు జోన్ వ్యవస్థను కూడా తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం యూఐడీఎఫ్ నుంచి రూ.287.54 కోట్లు, అమృత్ 2.0లో రూ.51.20 కోట్లు, సీఆర్డీఏ నుంచి రూ.55 కోట్లు సమకూరనున్నాయి. సీఆర్డీఏకి సంబంధించిన రింగ్ మెయిన్ల ద్వారా ప్యూరిఫై చేసిన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ఐఐటీ, వైద్య విద్య, మిగిలిన జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించేలా కార్పొరేట్ విద్యను అందించనున్నారు. ఈ మేరకు 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏడు ఎక్స్లెన్స్ సెంటర్లను ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించే ఈ ఎక్స్లెన్స్ సెంటర్ల నిర్వహణను టెండర్ల ద్వారా ఎంపిక చేసి కార్పొరేట్ విద్యాసంస్థలకు అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సెంటర్లను పర్యవేక్షిస్తుంది.. ఈ సెటర్లలో ఇంటర్తో పాటుగా జేఈఈ, నీట్కు ఉచిత శిక్షణ అందిస్తారు. ఇప్పటికే జేఈఈ, నీట్ కోసం ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతం వారికి ఉన్న గురుకులాల్లోనే పదింటిని ఎంపికచేసి ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎస్టీ, బీసీ విద్యార్థులకూ కూడా అమలు చేయనున్నారు. ఈ మొత్తం ఏడు సెంటర్లలో ఎస్సీ విద్యార్థులకు 3 సెంటర్లు, బీసీలకు 2, ఎస్టీలకు 2 సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కొత్త సెంటర్లను ఎస్సీ విద్యార్థులకు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం/శ్రీసత్యసాయి, రాజమహేంద్రవరంలో బీసీ విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు. ఉత్తరాంధ్రలో బీసీ విద్యార్థులకు మరో కేంద్రాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. విశాఖపట్నం, రాయలసీమలోని మరో ప్రాంతంలో ఎస్టీ విద్యార్థులకు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ ఎక్స్లెన్స్ సెంటర్లలో గరిష్ఠంగా 4,200 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో సెంటర్లో 500 నుంచి 600మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. విద్యార్థుల్ని పదోతరగతి మార్కుల ప్రాతిపదికగా ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఎక్స్లెన్స్ సెంటర్లలో ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందు అవసరమైన భవన సముదాయాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ భవనాలు దొరక్కపోతే ప్రస్తుతం ఉన్న
తెలంగాణలోని పల్లెల్లో స్వపరిపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేయబోతోంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా తొలగించి.. ఆ నిధులను స్థానిక అవసరాలకే నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీలకు ఇళ్లు, నల్లా పన్నులు, లేఅవుట్ అనుమతులు, సంతల నిర్వహణ, వేలం పాటల ద్వారా ఏటా సుమారు రూ.140 కోట్ల వరకు సొంత ఆదాయం సమకూరుతోంది. అయితే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ నిధులన్నీ ప్రభుత్వ ట్రెజరీలో జమ అవుతుండటంతో రూపాయి ఖర్చు చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అయింది.ఈ పాత పద్ధతి వల్ల గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నా, ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించాలన్నా, వీధిలైట్లు, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి అత్యవసర వస్తువులు కొనాలన్నా నెలల తరబడి ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో పడుతున్నప్పటికీ తాము కష్టపడి వసూలు చేసుకున్న సొంత నిధుల కోసం సర్పంచులు ఇబ్బందులు పడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి చట్ట సవరణకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆర్థిక స్వేచ్ఛను అమలు చేయడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 లోని సెక్షన్ 70(3)ని సవరించాల్సి ఉంటుంది. దీంతోపాటు నిధుల డ్రా ప్రక్రియలో పారదర్శకత కోసం జాయింట్ చెక్ పవర్ విధానంలో కీలక మార్పు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్, ఉపసర్పంచ్ ఉమ్మడి చెక్ పవర్ స్థానంలో.. ఉపసర్పంచ్ను తొలగించి గ్రామ కార్యదర్శికి ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ
Karthika Deepam June 01 Episode: ఆస్తి కోసం, ఆఫీస్ పెత్తనం కోసం కలలు కంటున్న జోత్స్నకి నిన్నటి ఎపిసోడ్లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పెద్దాయన శివన్నారాయణ. ఇక ఈరోజు (జూన్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. జ్యోత్స్స కోసం స్టాల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే కార్తీక్ జ్యోత్స్న, పారిజాతంను తీసుకుని స్టాల్ వద్దకు వస్తాడు. "నా బ్రదర్ టైమింగ్ ఎప్పుడూ మిస్ అవ్వదు " అంటాడు సూరజ్ కార్తీక్ ను చూస్తూ. "ఏంటీ పెద్ద మేడమ్ గారు. కారు దిగరేంటీ.. మనం వచ్చింది ఊరికే చూడటానికి కాదు. పని చేయడానికి. దిగండి దిగండి " అంటాడు కార్తీక్ వెటకారంగా. "రాత్రి నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి రావు అనుకున్నానే" అంటుంది పారిజాతం. "ఎప్పుడు ఏం చేయాలో జ్యోత్స్నకు బాగా తెలుసు గ్రానీ. నేను తల దించుకున్న అందులో ఏదో మంచే ఉంటుంది. నేను వస్తే వీడికి ఏదో మంచి జరుగుతుంది అనుకుంటున్నాడు. ఏం చేస్తానో చూడు" అంటుంది జ్యోత్స్న పొగరుగా. "మళ్లీ ఏం చేస్తావే" అంటుంది పారిజాతం కంగారుగా. "ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా"అంటుంది జ్యోత్స్న.నా వల్ల తప్పు జరిగింది.. జోత్స్నకి దిమ్మతిరిగే షాక్ "హాలో పెద్ద మేడమ్ గారు. నువ్వొచ్చింది కారులో కూర్చుని కబుర్లు చెప్పడానికి కాదు. పని చేయడానికి. అక్కడ కస్టమర్లు వెయిటింగ్" అంటాడు కార్తీక్. "దిగుతున్నాం రా" అంటుంది పారిజాతం. సూరజ్ స్టాల్ ముందు జ్యోత్స్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో "నావల్ల తప్పు జరిగింది... సూరజ్ హెల్తీ ఫుడ్స్ ఈజ్ ది బెస్ట్ " అని రాసి ఉండడం చూసి షాకవుతుంది జ్యోత్స్న. "అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదు. నేను ఇచ్చే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ పథకాన్ని రద్దు చేస్తున్నారంటూ, కిట్ల పంపిణీని నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మరోసారి విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.. ప్రజలు ఎవరూ నమ్మొద్దని సూచిస్తున్నారు. 'cockroach_janasena_party వంటి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రభుత్వం విద్యాకానుక కిట్ల పంపిణీని నిలిపివేసిందని జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ఇదే విషయం పై గతంలో కొంతమంది ఫేక్ ప్రచారం చేయగా మే 24వ తేదీన ప్రభుత్వ పరంగా పూర్తి వివరాలతో ఖండన ఇచ్చారు. అయినా ఇప్పుడు ఫేక్ అకౌంట్లతో మళ్ళీ జరుపుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. యుద్ధప్రభావం, అంతర్జాతీయ రవాణా అడ్డంకులు, ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరుగుతోందే తప్ప పథకం ఎక్కడా నిలిపివేయలేదు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఖచ్చితంగా అందుతాయి, మిగిలిన వస్తువులను తదుపరి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నాటికి అందజేస్తారు. విద్యార్థుల విద్యా పథకాలపై ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వారిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు' అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.గతంలో కూడా విద్యార్థి మిత్ర పథకాన్ని నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి లోకేష్ స్పందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకపోవటంతో పాటుగా పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని సదరు నేత భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటనలోనూ దూరంగా ఉండటంతో.. ప్రచారం నిజమేననే వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టారు అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి . తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు ప్రభాకర్ చౌదరి. టీడీపీ కోసం ఎప్పుడూ కార్యకర్తలా పనిచేశానని.. ఇకపైనా చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేని పరిస్థితులలో అధినేత చంద్రబాబు తనను పిలిపించి మాట్లాడారని.. టికెట్ ఇవ్వలేకపోవడానికి గల కారణాలు, పరిస్థితుల గురించి వివరించారని తెలిపారు. టీడీపీ కోసం పనిచేయాలంటూ చంద్రబాబు తనకు అప్పగించిన పనులను పూర్తి చేశానని తెలిపారు. తనను చట్టసభల్లోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించటంపైనా ప్రభాకర్ చౌదరి స్పందించారు. ప్రధాన కార్యదర్శిగా ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేని పరిస్థితులు ఉండటంతో ఆ పదవి నుంచి తొలగించారన్న ఆయన.. ఇందుకు తానేమీ బాధపడటం లేదన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటనకు వెళ్లలేకపోవటానికి కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే. అనంతపురం నియోజకవర్గంలో పోటీ చేయనన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అనంతపురం పక్క నియోజకవర్గాలలో పోటీ చేసే
మంచి వార్తలను మీడియా సంస్థలు దేశ ప్రజలకు మరింత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి పనులు, సక్సెస్ స్టోరీలను మీడియా ఎక్కువగా చూపించకపోతే.. యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కేరళలో ప్రముఖ మలయాళ దినపత్రిక దీపిక 140వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ రాధాకృష్ణన్ .. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సమాజంలో నిత్యం జరుగుతున్న సానుకూల పరిణామాలతోపాటు.. విజయగాథలు, సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. యూత్కు సరైన సమాచారాన్ని.. ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి తెలియజేయకపోతే వారు తాత్కాలిక ట్రెండ్లు, అనవసరమైన అంశాల వైపు ఆకర్షితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మంచి విషయాలను మీడియా బలంగా ప్రచారం చేయాలని.. లేకపోతే యువత ఆసక్తి కోల్పోయి బొద్దింకను ఫాలో అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.సీపీ రాధాకృష్ణన్ చేసిన బొద్దింక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన ‘ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకరోజు హడావుడి చేసే అంశాలకు అతిగా ప్రచారం కల్పించడం సరైంది కాదని.. నిజంగా విలువైన విషయం అయితే వారం, 10 రోజులు లేదా నెల తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన.. కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఇటీవల సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలు అంటూ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఏర్పడిన వివాదం తర్వాత సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెలుగులోకి వచ్చిన సంగతి
హరీష్ రావు తప్పకుండా పార్టీ మారుతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఫాంహౌస్లో ఉన్న కేసీఆర్ మీద ఒట్టేసి.. తాను బీజేపీలో చేరబోను అంటూ హరీష్ రావు చెప్పగలరా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో తాజాగా హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తన పుట్టుక బీఆర్ఎస్.. నా జీవితమంతా బీఆర్ఎస్ అని ఎన్నో సార్లు చెప్పానని.. మళ్లీ అదే చెప్తున్నానని తేల్చి చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుందని ప్రశ్నించారు. తాజాగా సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది అని నిలదీశారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప చేసింది ఏముందంటూ హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 4 పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి.. తన గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అని మండిపడ్డారు. తాను జీవితాంతం బీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్తోనే ఉంటానని ఇప్పటికే 100 సార్లు చెప్పానని.. ఇక ఇదే విషయాన్ని మరో 100 సార్లు చెబుతానని హరీష్ రావు తేల్చి చెప్పారు. తన పుట్టుక బీఆర్ఎస్లోనే అని.. చావు కూడా బీఆర్ఎస్లోనే అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పాట పాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి.. రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదని విమర్శించారు. హరీష్ రావు ఫ్యూచర్
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో ఉన్న కోడి చెరువుకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వస్తున్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి స్పందించారు. పవన్ కళ్యాణ్ మీద విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పవన్ కళ్యాణ్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విపక్షాలు నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని అన్నారు. శంకర్పల్లి ప్రాంతంలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఆస్తులపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఆ ఆస్తి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి కాగా, అన్ని రకాల రిజిస్ట్రేషన్, అనుమతులు ఉన్నాయని తెలిపారు. 2015 నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని, ఎలాంటి ఆక్రమణలు లేదా చట్టవిరుద్ధ అంశాలు లేవని స్పష్టం చేశారు.జన్వాడ గ్రామంలోని మరో వివాదాస్పద ఆస్తికి సంబంధించిన అంశాలను పవన్ కళ్యాణ్ వ్యవసాయ భూమికి ఆపాదిస్తూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని లోకం నాగ మాధవి విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవ కోసం తన సినీ జీవితాన్ని త్యాగం చేసి రెండు దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడని, ఆయన నిజాయితీపై బురదజల్లే ప్రయత్నాలు ఎన్నోసార్లు విఫలమయ్యాయని లోకం నాగ మాధవి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి, అక్రమాలపై పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడుతుండటంతో రాజకీయ ప్రత్యర్థులు ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని లోకం నాగ మాధవి తెలిపారు.తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ, పెరుగుతున్న ప్రజాదరణ కూడా ఈ
విశాఖపట్నం కేంద్రంగా బుల్లెట్ రైలు రానుంది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనకు సమాచారం అందించినట్లు మాధవ్ తెలిపారు. రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు జూన్ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఇక విశాఖ కేంద్రంగా విశాఖ - విజయవాడ బుల్లెట్ రైలు కూడా రానుంది. సాగరతీరం విశాఖపట్నం విజయవాడ మధ్య 350 కిలోమీటర్లకుపైగా దూరం ఉంది. ఈ రెండు ప్రధాన నగరాలను కలిపేలా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఈ బుల్లెట్ రైలు అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం - విజయవాడ బుల్లెట్ రైలును తొలుత గంటకు 320 కి.మీ వేగంతో నడపాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత బుల్లెట్ రైలు వేగాన్ని 600 కి.మీలకు పెంచాలని భావిస్తున్నారు. కనీసం గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించినా విశాఖపట్నం నుంచి విజయవాడకు గంటన్నరలోనే చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ రైల్వే బోర్డుకు అదికారులు ప్రతిపాదనలు పంపించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటుచేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - బెంగళూరు కారిడారు, చెన్నై - బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. వీటికి తోడుగా విజయవాడ - విశాఖపట్నం మధ్య కూడా మరో హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖ - విజయవాడ హైస్పీడ్ రైల్
తెలంగాణ బీజేపీలో విబేధాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పాత నేతలు, కొత్త నేతల మధ్య గ్యాప్ ఉందంటూ వార్తలు వస్తున్న వేళ.. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తూ.. ఫ్లెక్సీలు వెలియడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఈ ఫ్లెక్సీలు అంటించి ఉండటం గమనార్హం. ఆ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం, వార్తలు చక్కర్లు కొట్టడంతో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు రియాక్ట్ అయ్యారు. ఆ ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్ లక్ష్యంగా రాతలు ఉండటం గమనార్హం. 'నీ ఏడుపే బీజేపీకి శాపం' అనే హెడ్డింగ్తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని.. కేంద్రమంత్రి పదవి దక్కలేదని ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఈటల రాజేందర్కు 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు.. రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది బీజేపీ పార్టీనేనని గుర్తు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గెలుపొందిన తర్వాత కూడా.. తన ఇమేజ్తోనే గెలిచాను అని ఈటల రాజేందర్ చెప్పడం రాజకీయ నైతికత కాదని ఆ ఫ్లెక్సీల్లో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని.. ఎంపీ ధర్మపురి అరవింద్కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపుమంట ఎందుకని అందులో ప్రశ్నించారు. తాను బీసీ నాయకుడిని.. తానే ప్రత్యామ్నాయం అనే భావన నుంచి బయటకు రావాలని ఈటల రాజేందర్కు సూచిస్తూ
ఉత్తర్ప్రదేశ్లో బక్రీద్ రోజున సంచలనం సృష్టించిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ శనివారం అర్ధరాత్రి పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ ఘటన గాజియాబాద్ జిల్లాలో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మే 28వ తేదీన బక్రీద్ పండగ రోజున గాజియాబాద్లోని ఖోడా ప్రాంతంలో సూర్యప్రతాప్ చౌహాన్పై అసద్, అతని అనుచరులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సూర్యప్రతాప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మరీ ముఖ్యంగా బక్రీద్ రోజునే హత్య జరగడంతో హిందూ సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు.. ఘటన జరిగిన వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు అసద్ పరారీలో ఉండటంతో అతడిని అరెస్ట్ చేసేందుకు రూ.50 వేల రివార్డు ప్రకటించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.శనివారం రాత్రి అసద్ తన అనుచరుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఖోడా, ఇందిరాపురం పోలీస్ స్టేషన్ల సంయుక్త బృందాలు పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో బైక్పై వస్తున్న అసద్ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా అసద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నంద్యాలలోని శ్రీనివాస సెంటర్లో ఉన్న మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. జంబులయ్య అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి.. తలభాగాన్ని విగ్రహం నుంచి వేరుచేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు సైతం రంగంలోకి దిగారు, ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. జంబులయ్యను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులో ఈ పనిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వైసీపీ కార్యకర్త పనేనన్న లోకేష్మరోవైపు వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. వైసీపీ కార్యకర్త పనేనని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జంబులయ్య వైసీపీ నేతల అనుచరుడంటూ ఓ ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛీ కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదని మండిపడ్డారు. జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారని ఆరోపించారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య వైసిపి నేతల అనుచరుడని పోలీసులు తేల్చారన్న లోకేష్.. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా అని ప్రశ్నించారు.రాజకీయ కక్షకు నిదర్శనం.. వైఎస్ షర్మిల మరోవైపు వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇంత జరుగుతున్నా కూటమి
PM Modi Mann Ki Baat : దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్లో భాగంగా ఆయన దేశంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై ప్రత్యేకంగా మాట్లాడారు. వేసవి తీవ్రత నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రభుత్వ విభాగాల నిబంధనలు పాటించడంతో పాటు శరీరాన్ని చల్లబరిచే సాంప్రదాయ దేశీయ పానీయాలను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ..!ప్రస్తుతం దేశంలోని అత్యధిక ప్రాంతాలు భానుడి భగభగలకు అల్లాడిపోతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తగినంత నీరు తాగుతూ, శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేస్తున్న వాతావరణ మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు" అని పీఎం మోదీ స్పష్టం చేశారు. తీవ్రమైన ఎండల వల్ల సాధారణ ప్రజల దైనందిన జీవితం ఎంతో దుర్భరంగా మారుతోందని, ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకుంటూనే, చుట్టుపక్కల ఇబ్బంది పడుతున్న ఇతరుల పట్ల కూడా మానవత్వాన్ని, సహాయ గుణాన్ని చాటాలని ఆయన కోరారు.దేశీయ పానీయాలివే.. కచ్చితంగా తాగండంటూ..!ఎండలను తట్టుకోవడానికి మన దేశంలో అనాదిగా వస్తున్న విభిన్న సాంప్రదాయ పానీయాలను ఈ వేసవిలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే ఈ పానీయాలు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నారు.
MP Kalyan Banerjee Attacked : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింతగా శృతి మించుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేతలపై వరుస దాడుల పరంపర కలకలం రేపుతోంది. ఇప్పటికే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి జరగ్గా.. తాజాగా మరో టీఎంపీ నేత, ఎంపీపై దాడి జరిగింది. ముఖ్యంగా ఆదివారం రోజు ఉదయం హుగ్లీ జిల్లాలో టీఎంసీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీపై దాడి జరగడం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఇదంతా పోలీస్ స్టేషన్ బయటే జరగ్గా.. అంతా దిగ్ర్భాంతి వ్యక్తతం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే బీజేపీ, టీఎంసీ శ్రేణుల పరస్పర దాడులు..హుగ్లీ జిల్లాలోని చండీతలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కొందరు స్థానిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు అధికారులకు అధికారికంగా వినతి పత్రం సమర్పించేందుకు ఎంపీ కల్యాణ్ బెనర్జీ తన అనుచరులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరారు. కల్యాణ్ బెనర్జీ తన శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ దిశగా నడుచుకుంటూ వెళ్తుండగా.. అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర బలగాలు ఆయనను అడ్డుకుని, లోపలికి వెళ్లడంపై ప్రశ్నించడం ప్రారంభించాయి.సరిగ్గా అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పరస్పర ఘర్షణకు దారి తీసింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య, కేంద్ర బలగాలు ఎంపీని ప్రశ్నిస్తున్న సమయంలోనే