
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును నెగ్గిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీతోపాటు ఆ జట్టు సారథి రజత్ పాటీదార్ కూడా కీలక పాత్ర పోషించాడు. గుజరాత్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. నాకౌట్ స్టేజ్లోని గత మూడు మ్యాచుల్లో టాస్ గెలిచిన టీమ్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. అందుకు భిన్నంగా ఆర్సీబీ లక్ష్య ఛేదన వైపే మొగ్గుచూపడం గమనార్హం. దీనిపై బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ స్పష్టత ఇచ్చాడు. అలాగే ఈ విజయాన్ని వారి అభిమానులకే మళ్లీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘‘వరుసగా రెండో కప్పును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఫైనల్ కోసం ఇక్కడికి వచ్చాక గతేడాది జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఎలా ఆడామో.. ఇప్పుడు కూడా అదే దూకుడు ప్రదర్శించాం. ఈ విజయంపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. టాస్ గెలిస్తే ఏం చేయాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నాం. మా ప్లాన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్య ఛేదన సులువుగానే ఉంటుందని భావించాం. అందుకే, టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాం. గుజరాత్ టాప్ - 3 బ్యాటర్లను త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ మా నియంత్రణలోకి వస్తుందని తెలుసు. భువీ, జోష్, రసిఖ్ ఈ సీజన్లో చాలా ప్రభావం చూపించిన బౌలర్లు. జట్టులోని ప్రతి బౌలర్ను నేను మెన్షన్ చేయాలి. కెప్టెన్గా ఇక్కడ నా ప్రయాణం అద్భుతం. వరుసగా రెండోసారి కప్పును సగర్వంగా ఎత్తుకోవడం మరిచిపోలేని సందర్భం. గతేడాది మాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. కానీ, ఈసారి అంచనాలు ఉన్నాసరే ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడాం’’ అని పాటీదార్ తెలిపాడు. ‘‘ఈ




























